తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ నుంచి మొన్న కాంగ్రెస్ జనగర్జన వరకు దారులన్నీ ఖమ్మంవైపే. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినప్పటికీ తెలుగుదేశం, వైఎస్సాఆర్సీపీ లాంటి పార్టీలను ఖమ్మం ఆదరించింది. మరోవైపు కమ్యూనిస్టులకు ఖమ్మం జిల్లా కంచుకోట. కానీ నేడు ఖమ్మం ప్రజలు అభివృద్ధి చేసే బీఆర్ఎస్ వెంటే అంటున్నారు.
మారుతున్న రాజకీయాలతో పాటు ఖమ్మం జిల్లాలోనూ అనేక మా ర్పులు చోటు చేసుకున్నాయి. 2016 వరకు జిల్లాలో నామమాత్రంగా ఉన్న బీఆర్ఎస్ భారీ గా పుంజుకొన్నది. గ్రామ స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు నాయకులు బీఆర్ఎస్లోకి రావడంతో పార్టీ పట్టు బాగా పెరిగింది. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి సైతం పురోగమిస్తున్నదనేది వాస్తవం. ఇలాంటి తరుణంలో ఖమ్మం ప్రజలు అభివృద్ధి వైపు నిలుస్తారా? గత రాజకీయ ధోరణినే అవలంబిస్తారా వేచి చూడాలి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ చైతన్యంతో ముడిపడి ఉన్న జిల్లా. ఆంధ్ర జనాభా అధికంగా ఉన్నప్పటికీ 1969లో తెలంగాణ ఉద్యమం ఇక్కడి నుంచే మొదలైంది. 1983 తర్వాత తెలుగుదేశం పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కమ్యూనిస్టులు సైతం ఈ జిల్లాలో చాలా కీలకంగా మారారు . వైఎస్సాఆర్ హయాంలో జిల్లాలో కాంగ్రెస్ చాలా పుంజుకున్నది. కాంగ్రెస్కు ముఖ్యంగా పల్లెల్లో ఆదరణ బాగా ఉండేది. ఈ విధంగా అనేక పార్టీలు ఖమ్మం జిల్లాలో తమ బలాలను నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేశారు తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదు.
పోడు సమస్యలు, తాగు-సాగు నీరు, జిల్లా కేంద్రమైన ఖమ్మం పట్టణాభివృద్ధి గురించి చేసిందేమీ లేదు. ఏజెన్సీలోని ఆదివాసీలు, తండాల్లోని గిరిజనుల పాత్ర జిల్లాలో చాలా కీలకం. భూమిహక్కు సమస్య ఇక్కడి కొండరెడ్లను, కోయలను వెంటాడుతూ వస్తున్నది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ వారి సమస్యలు అలాగే ఉండిపోయాయి . మరోవైపు సింగరేణి కార్మికుల పాత్ర చాలా కీలకమైంది. కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉండేది.
కాంగ్రెస్ హయాంలో పోలవరం ముంపు గ్రామాలు సైతం చాలా వివక్షకు గురయ్యాయి. ప్రాజెక్ట్లులన్నీ కూడా పెండింగ్లో ఉండడం వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్త వ్యవసాయ ఉత్పత్తులకు నోచుకోకుండా పోయింది. విజయవాడ – వరంగల్ లాంటి ప్రధాన పట్టణాల మధ్యలో ఉన్నప్పటికీ అభివృద్ధి ముందుకు సాగలేదు. అధికంగా అడవులు ఉండడం వల్ల నక్సల్ సమస్య చాలా జటిలంగా ఉండేది. పరిశ్రమలకు ఆమడ దూరంలో జిల్లా ఉండిపోయింది. కాంగ్రెస్ హయాంలో భద్రాచలం పుణ్యక్షేత్రం సైతం వివక్షకు గురైంది. రోళ్లపాడు, దుమ్ముగూడెం లాంటి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి కాకుండానే ఆగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత చాలా జిల్లాలు కొత్త ఆలోచన విధానాలతో ముందుకు సాగుతున్నాయి. ఖమ్మం జిల్లా సైతం ఎప్పుడూ చూడని అభివృద్ధిని చూస్తున్నది. సమ్మిళితం, సృజనాత్మకం, మౌలిక నిర్మాణం అనే తెలంగాణ మాడల్ నినాదంతో అన్ని ప్రాంతాలు ముందుకు సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో అధికంగా అడవులు, ఆదివాసీల జనాభాతో కూడిన కొత్తగూడెం ప్రాంతాన్ని జిల్లాగా విభజించడం జరిగింది.
ప్రభుత్వం 3500 తండాలను గ్రామపంచాయతీలను చేసింది. వాటిలో అధికంగా 50 శాతం ఖమ్మం జిల్లా నుంచే ఉండడం విశేషం. భద్రాచలం, మణుగూరు పట్టణీకరణ వైపు సాగుతున్నాయి. భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా ద్వారా పరిపాలన చాలా సులభతరమైంది. తండాలకు గిరిజన జనాభాకు రాజ్యాంగ హోదా ఇవ్వడం జరిగింది.
సాగు నీటి రంగంలో సైతం ఖమ్మం జిల్లా దూసుకుపోతున్నది. దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయిన ప్రాజెక్టులో భక్త రామదాసు ప్రాజెక్టు చాలా కీలకం. కేవలం 60 రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తయింది. సుమారు 59 వేల ఎకరాలకు నీరు అందుతున్నది.
మిషన్ కాకతీయ కింద అనేక చెరువులు, మధ్య తరహా నీటి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నది. దీనికి తోడు సీతారామ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా దాదాపు 10 లక్షల ఎకరాలకు నీరు అందనున్నది. కాళేశ్వరం, పాలమూరు తర్వాత ఈ ప్రాజెక్ట్ అతి పెద్దది. మధ్య తరహా నీటి ప్రాజెక్టులైన లంక సాగర్, వైరాల ద్వారా జిల్లాలో అద్భుతమైన సాగు జరుగుతున్నది.
ఈ జిల్లా ఆయిల్పామ్ సాగుకు అనువైన జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఆయిల్పామ్ సాగుకోసం తెలంగాణ పభుత్వం అద్భుతమైన విధానాలను రూపొందించింది. దాదాపు 20 లక్షల ఎకరాల్లో , 6-8 లక్షల ఎకరాల సాగును ఖమ్మం జిల్లాలోనే చేపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ కాలేజి ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం .
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని 1080 మెగావాట్ల సామర్థ్యంతో కొత్తగా భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ప్లాంట్లు పూర్తయితే తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి 23000 మెగావాట్లకు చేరుకుంటుంది. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో అనేక ఆదివాసీ, గిరిజన, కోయ తండాల్లో వ్యవసాయం చేసుకోవడానికి వీలు కలుగుతున్నది.
ఖమ్మం జిల్లా కేంద్రం పట్టణీకరణలో భాగంగా ముఖ్యమైన ప్రాంతాలను సుందరీకరించడం జరిగింది. లాకారం చెరువును సుందరీకరించి హ్యాంగింగ్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. విద్య, ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం తెలంగాణ గ్రిడ్ పాలసీని తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా ఖమ్మం జిల్లాలో నేడు ఐటీ టవర్ అందుబాటులోకి వచ్చింది. వివిధ అంకుర సంస్థలకు నేడు ఖమ్మం జిల్లా వేదికగా మారింది.. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా గడిచిన పదేండ్లలో అద్భుత ప్రగతిని సాధించింది.
ఖమ్మం గడ్డ తమదేనని చెప్పుకొని తిరిగే కొంతమంది వ్యక్తులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కనపడకపోవడం విచిత్రం. తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో సంక్షేమ పథకాలకు అరకొర నిధులు ఇచ్చే పార్టీలు కూడా ఖమ్మంలో ఊకదంపు డు హామీలు ఇస్తున్నాయి. పింఛన్లు పెంచుతామని పిచ్చి ప్రకటనలు చేస్తున్నాయి. కానీ ప్రజలు అడగకుండానే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ వైపే ఖమ్మం ప్రజలు ఉన్నారు. రానున్న రోజుల్లోనూ అభివృద్ధిని కాంక్షించే ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉంటారని గుర్తిస్తే మంచిది.
కాంగ్రెస్ హయాంలో పోలవరం ముంపు గ్రామాలు సైతం చాలా వివక్షకు గురయ్యాయి. ప్రాజెక్ట్లులన్నీ కూడా పెండింగ్లో ఉండడం వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్త వ్యవసాయ ఉత్పత్తులకు నోచుకోకుండా పోయింది. విజయవాడ – వరంగల్ లాంటి ప్రధాన పట్టణాల మధ్యలో ఉన్నప్పటికీ అభివృద్ధి ముందుకు సాగలేదు.