తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగా ఉద్యమించారో.. స్వరాష్ట్ర అభివృద్ధి కోసం అంతకన్నా ఎక్కువగా పోరాడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను స్వాగతించాల్సిన ప్రతిపక్షాలు కేసీఆర్కు కల్పిస్తున్న అడ్డంకులు, సృష్టిస్తున్న ఆటుపోట్లే ఆయనకు రాచబాట వేస్తున్నాయి. ఇవన్నీ గమనిస్తున్న రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఆయన పాలనను కోరుకుంటున్నారు.
‘నీ మీద రాళ్లు విసిరితే… వాటిని నీ ఇంటికి పునాదిగా మలుచుకో’ అనేది ఓ సూక్తి. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ పోరాటంలో ఆయన మీద నాటి పాలకులు విసిరిన రాళ్ల తో బంగారు తెలంగాణ భవిష్యత్కు పునాది వేశాడాయన. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఆటుపోట్లు, అపనిందలు రాజకీయాల్లో ఉన్నవారికి కొత్త కాదు. కానీ ప్రత్యేక రాష్ట్రం సాధించేదాక ఆయన రాజకీయ ప్రయాణమంతా వాటి మధ్యే సాగింది.
ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ సాధన నినాదం ఎత్తుకున్నారో అప్పటినుంచే ఇతర పార్టీలు ఆయ నను అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మంత్రి పదవిస్తే టీఆర్ఎస్ పార్టీ పెట్టేవాడు కాదని హేళన కూడా చేశారు. కానీ ఆయన ఎంపీగా గెలిచి నాటి యూపీయే ప్రభుత్వంలో భాగస్వామియై తెలంగాణ నినాదాన్ని మరింత గట్టిగా వినిపించాడే తప్ప కేంద్ర మంత్రి పదవి వచ్చిందని తెలంగాణ పోరాటాన్ని వదిలేయలేదు.
కేసీఆర్ సంకల్పబలం చూసి అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కంపించాయి. కేసీఆర్ను ఇలాగే వదిలేస్తే ప్రజాబలంతో ఆయన తెలంగాణ సాధించడం ఖాయమని భయపడ్డాయి. అప్పటి నుంచి అడ్డంకులను సృష్టించడం ఆరంభించాయి. నిందలు మోపడం మొదలుపెట్టాయి. ‘తెలంగాణ రాదు.. ఆ సెంటిమెంట్తో కేసీఆర్ ఆడుకుంటున్నా డు.. ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నాడు’ అంటూ అబద్ధ, అసంబద్ధ ప్రచారాలకు తెరతీశాయి. అలాం టి వాటికెన్నడూ ఆయన వెరవలేదు. నిరాహార దీక్ష కు సిద్ధమయ్యాడు. ఆ విషయంలో కేసీఆర్కున్న ప్రజల అండ అప్పటి ప్రభుత్వాలకు చెమటలు పట్టించింది. తెలంగాణ ఇస్తామని నాటకమాడి.. పార్లమెంట్లో ప్రకటన చేసినట్టే చేసి.. తూచ్ అని ఆ నాయకుడినే కాదు.. మొత్తం తెలంగాణనే ఎద్దే వా చేశారు. అయినా కుంగిపోలేదాయన. ఉద్యమా న్ని మరింత ఉధృతం చేశాడు. ఒకానొక సమయంలో కేసీఆర్ ఉనికే ఏలికలకు వెరుపయింది. అలాంటి వాతావరణంలో ఆయనకు ఎక్కడ ప్రాణహాని తలపెడతారోనని తెలంగాణ సమాజం కలవరపడింది. జాగ్రత్తగా ఆయనను కాపాడుకున్నది. ఆయన ప్రాణాలకు యావత్ తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలను అడ్డుపెట్టారు. అది ఆయన సంక ల్ప బలానికి దక్కిన అరుదైన గౌరవం. తెలంగాణ కోసం ఆయన కట్టుకున్న దట్టి.. అంత దృఢంగా లేకుంటే.. ఈ రోజుకూ అప్రకటిత హక్కుల అపహరణతో.. రెండో తరగతి పౌరులుగానే ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు మనం మన గడ్డ మీద మనకు సర్వహక్కులు.. అంతకుమించిన ఆత్మగౌరవం.. మన వనరులు.. మన కొలువులను అనుభవిస్తు న్నాం.. ఆస్వాదిస్తున్నామంటే కేసీఆర్ సంకల్ప ఫలితమే! నేటికీ తెలంగాణ పాలనకు.. బంగారు తెలంగాణ సాధనకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో అడ్డంకు లు, అవరోధాలను సృష్టిస్తున్నది. ఆటుపోట్లు ఉం టేనే సముద్రంలో నావ ముందుకు సాగుతుంది. అందుకే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో ఆ ఆటుపోట్లనే చాలెంజ్గా తీసుకొని, రాష్ట్ర పురోగతితోనే వాటికి జవాబు చెప్తున్నారు సీఎం కేసీఆర్.
రాష్ట్ర సాధనలో తెలంగాణ అంతా ఆయన వెను కే నడిచినట్టు.. ఇప్పుడూ ఆయన వెన్నంటే ఉన్నది. కారణం.. బంగారు తెలంగాణ సాధన విషయంలో ఆయనకున్న చిత్తశుద్ధి పట్ల ప్రజలకున్న విశ్వాసమే. రైతుబంధు, దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు. ట్రాక్టర్లు, గొర్ల పంపిణీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రభుత్వ కొలువులు, మిషన్ భగీరథ , సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామికాభివృద్ధి, వీ-హబ్, టీ-హబ్ల ఏర్పాటు, కంటివెలుగు, షీ టీమ్స్, పౌష్టికాహార కిట్లు, మహిళల కోసం గృహలక్ష్మి పథ కం. ఇలా ఎన్నో పథకాలను తన పాలనలో భాగం చేశారు కేసీఆర్. రైతేరాజు అని చెప్పకుండానే వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతును గౌరవిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భాషా వాఙ్మయాలూ అవమానానికి,హేళనకు గురయ్యాయి. అందుకే తన పాలనలో వాటన్నింటికీ ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ వాటి ప్రాముఖ్యాన్ని.. తద్వారా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాలను ప్రపంచానికి చాటుతున్నారు. తెలంగాణ కళలు, సాహిత్య వారసత్వాలనూ ప్రోత్సహిస్తూ, వాటిని పరిరక్షిస్తున్నారు.
తెలంగాణ పోరాటమప్పుడే కేసీఆర్కు తెలంగాణ రాజకీయ, భౌగోళిక, నైసర్గిక, సాంస్కృతిక విధానా ల పట్ల ఓ స్పష్టమైన అవగాహన ఉ న్నది. ఆ అవగాహన ఊరికనే రాలేదు. తెలంగాణ చరిత్రను ఆయ న పూర్తిగా అధ్యయనం చేశారు. తెలంగాణకున్న బలాలు, బలహీనతలను అవగతం చేసుకున్నారు. తెలంగాణ రాజకీయాల మీద పట్టు సాధించారు. వాటన్నింటికి అనుగుణంగానే బంగారు తెలంగాణ సాధనకు రూపకల్పన చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆయన చెప్పిన మాటలు.. ఇచ్చిన వాగ్దానాలు.. ఆయన పాలనలో తు.చ. తప్పకుండా అమలు చేసిన విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అందుకే ప్రజలకు ఆయనపై ఉన్న గౌరవాన్ని రెట్టింపు చేసింది.
కేసీఆర్ సాధించుకున్న కీర్తి తెలంగాణకే పరిమి తం కాలేదు. దేశ వ్యాప్తమైంది. పొరుగు రాష్ర్టాలతో ఎంత పెద్ద సమస్యనైనా స్నేహపూర్వకంగా పరిష్కరించడం ఆయన రాజకీయ సామర్థ్యానికి ప్రతీకగా నిలిచాయి. ఇవి ఆయన ఖ్యాతిని దేశవ్యాప్తం చేశాయి. ఈ పనితీరుతోనే ఆయన నాయకత్వాన్ని దేశమంతా కోరుకుంటున్నది.
కేసీఆర్ సాధించుకున్న కీర్తి తెలంగాణకే పరిమి తం కాలేదు. దేశ వ్యాప్తమైంది. పొరుగు రాష్ర్టాలతో ఎంత పెద్ద సమస్యనైనా స్నేహపూర్వకంగా పరిష్కరించడం ఆయన రాజకీయ సామర్థ్యానికి ప్రతీకగా నిలిచాయి. ఇవి ఆయన ఖ్యాతిని దేశవ్యాప్తం చేశాయి. ఈ పనితీరుతోనే ఆయన నాయకత్వాన్ని దేశమంతా కోరుకుంటున్నది.
ఇవన్నీ.. కేంద్ర పాలకులకు మింగుడు పడని విషయాలే. అందుకే నెమ్మదిగా కేసీఆర్ను టార్గెట్ చేయడం ప్రారంభించింది కేంద్రం. అందులో భాగంగానే తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించడం. తెలంగాణ సాధనలో ముందున్న ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి నిందలు, ఈడీ వేధింపులు.. అరెస్టు బెదిరింపులు. వీటీ లక్ష్యం ఒక్కటే కేసీఆర్ను దెబ్బతీయడం. తెలంగాణలో ఉన్న అధికారాన్ని లాక్కోవడం. కానీ కేంద్రం కుయుక్తులేం తెలంగాణలో పారవు. మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా అంతే సమర్థత, చతురతతో దేశంలోని అన్ని రాజకీయపక్షాలను ఏకం చేస్తూ తన ప్రభావాన్ని చూపిస్తున్నారు కేసీఆర్.
తెలంగాణ పురోగతి ఆయన శ్వాస.. తెలంగాణ ప్రజలే ఆయన బలం, బలగం. ఆ ప్రజలు ఇప్పుడు ఆయనను దేశ నాయకుడిగా చూడాలనుకుంటున్నారు. తెలంగాణ సాధన.. ప్రగతితో తానేంటో నిరూపణ చేసుకున్నారు కేసీఆర్. అందుకే ఇప్పుడు ఆయనకు బ్రహ్మరథం పట్టడానికి ఒక్క తెలంగాణ ప్రజలే కాదు యావత్ దేశ ప్రజలూ సిద్ధంగా ఉన్నారు.
డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు 92465 26899
(వ్యాసకర్త: మాజీ ప్రధాన సమాచార కమిషనర్, ఉమ్మడి ఏపీ)