తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడిని నియమించడం దాదాపు ఖాయమని ఆ పార్టీ నేతలు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అందుకే ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశాలకు హాజరుకావడం లేదని చెప్తున్నారు. గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి డుమ్మా కొట్టిన పార్టీ ముఖ్యనేతలు పీజేఆర్ వర్ధంతి కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. రేవంత్రెడ్డిని మార్చుతారన్న గ్యారంటీ ఏముందని ప్రశ్నిస్తే, మార్చడం ఖాయమని తెలిసే ఇండస్ట్రీలో థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న తనకు టీపీసీసీ ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వాలని మాజీ మంత్రి కొండా సురేఖ దరఖాస్తు చేసుకున్నారని గుర్తుచేస్తున్నారు.