గత ఇరువై ఏండ్లలో జరిగిన అతిపెద్ద రైలు దుర్ఘటన ఉద్దేశపూర్వకంగా చేసిందా, కాదా అని తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ను ఆదేశించింది. కుట్ర కోణంలో దర్యాప్తును సీబీఐకి అప్పగించడం రైల్వే అధికారుల నిర్లక్ష్యంగానే భావించాలి. అయితే రెండు రైళ్లు ఢీకొనడాన్ని నివారించడానికి రైళ్లలో ‘కవచ్’ అనే యాంటీ-కొలిషన్ సిస్టమ్ను ఏర్పాటుచేసినట్లు రైల్వే మంత్రిత్వశాఖ ప్రచారం చేస్తున్నది.
దేశంలోని 97 శాతం రైళ్లలో ‘కవచ్’ అమలుకాలేదు. ప్రమాదానికి గురైన సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఈ వ్యవస్థ లేదు. సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడమనేది రైల్వేలకు ఏండ్ల తరబడి ఒక క్లిష్టమైన సమస్య. సిగ్నల్స్ లోపభూయిష్ట సమస్యపై లోకో పైలట్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఒక్క ఏడాదిలోనే 51,238 సార్లు సిగ్నల్ ఫెయిల్యూర్ నమోదైందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో కనిపిస్తున్నది. భారతీయ రైల్వేలకు నాణ్యత లేని రక్షణ పరికరాలను పలు ప్రైవేట్ సంస్థలు సరఫరా చేస్తున్నాయి.15 వేల కి.మీ. రైల్వే ట్రాక్లు లోపభూయిష్టంగా ఉన్నాయి. వాటికి తక్షణమే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్నది.
ఏటా అదనంగా 4,500 కి.మీ. రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు కారణమవుతున్నది. కానీ, ఏటా 2,000 కి.మీ. మాత్రమే పునరుద్ధరించబడుతున్నది. కార్మికుల కొరత కారణంగా ట్రాక్ తనిఖీలో 30 శాతం నుంచి 100 శాతం లోటు ఉంటున్నది. ఇలాంటి లోపభూయిష్టమైన, ప్రమాదకరమైన ట్రాక్లపై రైళ్లు అధిక వేగంతో నడుస్తున్నాయి. తద్వారా వేలాది మంది ప్రయాణికులు, రైల్వే కార్మికులు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుంటున్నారు.
గూడ్స్ రైల్ ట్రాక్ల కోసం సిఫారసు చేసినా అవికూడా ఓవర్లోడ్తో ప్రయాణిస్తున్నాయి. ఇతర దేశాల్లో సూపర్ఫాస్ట్ రైళ్ల కోసం ప్రత్యేక కొత్త ట్రాక్లను ఏర్పాటుచేస్తారు. మన దేశంలో పాత ట్రాక్లపైనే అతివేగంతో సూపర్ఫాస్ట్ రైళ్లను నడపాల్సి వస్తున్నదని లోకో పైలట్ యూనియన్లు ఫిర్యాదు చేస్తున్నాయి. 2022 డిసెంబర్లో పార్లమెంటులో సమర్పించిన నివేదిక ప్రకారం.. భారతీయ రైల్వేలో నాలుగేండ్లలో 1,129 పట్టాలు తప్పాయి. ఈ పట్టాలు తప్పినవాటిలో ఎక్కువ భాగం గూడ్స్ రైళ్లు ఉండటంతో ప్రజలకు తెలియడం లేదు. మీడియా కూడా ఎక్కువగా దృష్టిపెట్టడం లేదు. ఇదిలా ఉంటే రైల్వే వంతెనలూ శిథిలావస్థకు చేరుకోవటం విషాదం.
ఇటీవల ఒడిషా ప్రమాదంలో రిజర్వ్ చేయని కోచ్లో వాటి సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించారు. పెద్ద సంఖ్యలో మరణాలు, గాయాలు నమోదవడానికి ఇదే కారణం. భారతీయ రైల్వేలో 3,12,000 ఖాళీలున్నాయని రైల్వే యూనియన్లు సూచించాయి. ఇందులో సేఫ్టీ క్యాటగిరీలో లక్షలాది ఖాళీలున్నాయి. అదే సమయంలో రైళ్ల సంఖ్య నిరంతరం పెరుగుతున్నది. దీంతో ప్రస్తుతం ఉన్న కార్మికులపై తీవ్ర పని ఒత్తిడి ఉంటున్నది. ఇది లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సిగ్నలింగ్ ఇంజినీర్లు, భారతీయ రైల్వే ట్రాక్లను నిర్వహించాల్సిన ట్రాక్ మెయింటైనర్లపై ఒత్తిడి తెస్తున్నది. లోకో పైలట్లు, గార్డులు విశ్రాంతి లేకుండా రోజుకు 14-16 గంటలు పనిచేస్తున్నారు. ఇది లోకో పైలట్ల ఆరోగ్యానికి, రైలు ప్రయాణికులకు ప్రమాదకరం. లోకో పైలట్ ప్రతి కి.మీ.కు ఒక సిగ్నల్ను ఎదుర్కొంటాడు. అందుకు తగ్గట్టుగా రైలును నియంత్రించాల్సి ఉంటుంది. లోకో పైలట్ల కొరతను సాకుగా చూపిస్తూ పలు జోనల్ రైళ్లు లోకో పైలట్లను నిర్ణీత సమయానికి మించి విధుల్లో ఉండేలా ఒత్తిడి తీసుకువస్తున్నాయి.
ఉదాహరణకు.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం… గత పదేండ్లలో భారతదేశ రైలు ప్రమాదాల్లో 2,60,000 మంది మరణించారు. రైలు ప్రమాదాల సంఖ్య 2022-2023లో 48కి పెరిగింది. రైలు సురక్షితంగా నడిపించడంలో ట్రాక్ మెయింటైనర్లు ముఖ్య పాత్ర పోషిస్తారు. భారతీయ రైల్వే ట్రాక్ల నిర్వహణకు అవసరమైన 4 లక్షల మంది ట్రాక్ మెయింటైనర్లలో రెండు లక్షల మంది మాత్రమే ఉద్యోగంలో ఉన్నారు. వీరిలో చాలామంది కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. ప్రతిరోజు సగటున ఇద్దరు, ముగ్గురు ట్రాక్ మెయింటైనర్లు పనిలో ఉండగానే మరణిస్తుండగా, ఏటా వందల సంఖ్యలో మరణిస్తున్నారు. వారు ఎక్కువ పని చేయడంతో పాటు సిబ్బంది తక్కువగా ఉండటం, కేంద్ర ప్రభుత్వం తగిన భద్రతా పరికరాలను అందించకపోవడం వల్ల ఇది జరుగుతున్నదని తెలుస్తున్నది.
భారత రైల్వేలను ప్రైవేటీకరించే చర్యలో భాగంగా రైల్వే మంత్రిత్వశాఖ ప్రైవేట్ కంపెనీలకు కీలక భాగాల సరఫరాను ఔట్సోర్సింగ్కు అప్పజెప్పింది. రైళ్లను సురక్షితంగా నడిపేందుకు కీలక కోచ్లు, వ్యాగన్ల యాక్సిల్స్ ఇందులో ఉన్నాయి. ప్రైవేటు ఆపరేటర్లు సరఫరా చేసిన యాక్సిల్స్లో నాణ్యత లేని అనేక ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి.
రైలు ప్రయాణికుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని రైల్వే ఉద్యోగుల సంఘాలు ఎత్తిచూపుతున్నాయి. అయితే, ఈ అవసరాలను పరిష్కరించేందుకు వరుసగా వచ్చిన ప్రభుత్వాలు నిరాకరించాయి. రైలు ప్రమాదాలకు రైలు కార్మికులను నిందించడం కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ఆచారం గా మారింది. బాలాసోర్ ఘోర ప్రమా దం వెనుక కుట్ర ఉన్నదనే దర్యాప్తు గురించి మాట్లాడటం ద్వారా ప్రజల దృష్టి మళ్లించాలని కేంద్రం భావిస్తున్నది. భారతీయ రైల్వేలు ప్రైవేటీకరణ, ఔట్సోర్సింగ్, లాభాల వైపు దృష్టి కేంద్రీకరించడంతోనే తరచు ప్రమాదాలు జరుగుతున్నాయనేది జగమెరిగిన సత్యం.
భారతీయ రైల్వేలో 3,12,000 ఖాళీలున్నాయని రైల్వే యూనియన్లు సూచించాయి. ఇందులో సేఫ్టీ క్యాటగిరీలో లక్షలాది ఖాళీలున్నాయి. అదే సమయంలో రైళ్ల సంఖ్య నిరంతరం పెరుగుతున్నది. దీంతో ప్రస్తుతం ఉన్న కార్మికులపై తీవ్ర పని ఒత్తిడి ఉంటున్నది. ఇది లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సిగ్నలింగ్ ఇంజినీర్లు, భారతీయ రైల్వే ట్రాక్లను నిర్వహించాల్సిన ట్రాక్ మెయింటైనర్లపై ఒత్తిడి తెస్తున్నది.