తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా బాలల్లో సాహిత్య అభిరుచి పెంపొందించి, తద్వారా వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థుల నుండి కథలను ఆహ్వానిస్తున్నామని సుగుణ సాహితి సమితి కన్వీనర్ భైతి దుర్గయ్య తెలిపారు. విజేతలక్లు ప్రథమ బహుమతి రూ.1,500, రెండు ద్వితీయ బహుమతులు రూ.1,000 వంతున, మూడు తృతీయ బహుమతులు రూ.500 వంతున, రూ.300 వంతున 16 ప్రత్యేక బహుమతులను ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు మర్పడగ చెన్నకృష్ణారెడ్డి అందజేస్తారని తెలిపారు.
హామీ పత్రంతో పాటు విద్యార్థులు తాము రాసిన కథలను ‘కన్వీనర్, ఉగాది కథల పోటీ, ప్రతిభ డిగ్రీ కళాశాల, మెదక్ రోడ్, సిద్దిపేట-502103’ అనే చిరునామాకు ఈనెల 20వ తేదీలోగా స్వయంగా, లేదా రిజిస్టర్ పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9959007914 సెల్ నంబర్లో సంప్రదించవచ్చునని సూచించారు.