తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ ‘మరుగుజ్జులు కాదు, సిసలైన ప్రజా నాయకులు’ శీర్షికతో ఓ పత్రికలోని పేజీ నిండా అసత్యాల వ్యాసం రాశారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్రను తక్కువచేసి చూపే ప్రయత్నం చేస్తూ, దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పథకాలను, ప్రాజెక్టులను పనిగట్టుగొని విమర్శించారు తప్ప వాస్తవాలు చెప్పలేదు. రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని నిర్వచిస్తూ చెప్పిన విషయాలు అక్షర సత్యం. కండ్ల ముందు కనబడుతున్న అభివృద్ధే ఆయన చెప్పారు. అధికారం అందలేదని తెలంగాణ నినాదం అందుకున్న వ్యక్తి కాదు కేసీఆర్.. ఎన్నో పదవులను గడ్డిపోచల్లా వదిలేసుకున్న ఉద్యమనాయకుడు.
ఆంధ్రా వలస పాలకుల కుట్రలను, వివక్షను, తెలంగాణ భాష, సంస్కృతి మీద జరుగుతున్న దాడిని నిలదీసి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి స్వరాష్ట్ర కాంక్షను పెంచిన ఉద్యమ నినాదం కేసీఆర్. 1969 ఉద్యమం తర్వాత ఇక తెలంగాణ రాదని ప్రజలు నిరాశ చెందుతున్న సమయంలో ‘ప్రత్యేక’ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చే లక్ష్యంతో కేసీఆర్ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటుచేశారు. అలా ఒక్క నాయకుడితో మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆ తర్వాత మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలను ఒక్కతాటికిపైకి తెచ్చింది. సబ్బండ వర్గాలను ఒక్కటి చేసి కదనరంగంలోకి దింపిన ఘనత కేసీఆర్దే. పార్టీ ఆరంభమే కేసీఆర్ రాజీనామాతో మొదలైంది. 2001 ఏప్రిల్ 27న టీడీపీకి, తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్కు అంకురార్పణ చేశారు. ప్రజల ఆశయ సాధనే ఏకైక లక్ష్యంగా 2008 మార్చి 3న కేసీఆర్తోపాటు నలుగురు ఎంపీలు రాజీనామా చేశారు. అలాగే 2008 మార్చి 4న 16 మంది శాసనసభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. అయినా సర్కారు దిగిరాకపోవడంతో తన ప్రాణాన్ని పణంగా పెట్టేందుకు నాడు కేసీఆర్ సిద్ధపడ్డారు. తెలంగాణలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా తెలంగాణ తెచ్చింది కేసీఆరేనని ముక్తకంఠంతో చెప్తాడు.
సీఎం కేసీఆర్ తన తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం, స్వపరిపాలనలో రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. కాంగ్రెస్, బీజేపీ తదితర ప్రతిపక్ష నేతలు అభివృద్ధిపై అవినీతి బురద జల్లుతున్నారు. సంక్షేమ పథకాలను బదనాం చేస్తున్నారు. కాళేశ్వరం మొత్తం వ్యయమే రూ.80,190 కోట్లయితే.. మన ప్రతిపక్ష నాయకులు లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం మరుగుజ్జుతనం కాకుంటే ఇంకేమిటి? ఎవరు ఒప్పుకొన్నా.. ఒప్పుకోకపోయినా.. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరువు. దాదాపు 13 జిల్లాల రైతాంగానికి సాగునీటితోపాటు హైదరాబాద్కు తాగునీరు, పరిశ్రమలకు నీళ్లిస్తున్న ది. గ్రామాల్లో వరి ఉత్పత్తి పెరగడానికి కారణం కాళేశ్వరం నీళ్లు కాదు, వర్షాలే అని అన్నాడు రచయిత. 2014కు ముందు కూడా ఇంతకంటే ఎక్కువ వర్షాలు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అప్పుడెందుకు పండలేదు ఇంత ధాన్యం? తెలంగాణలో గత కొన్నేండ్లుగా ఏటా వానకాలం, యాసంగి కలిపి కోటి ఎకరాలకు పైగా వరి సాగవుతుండగా, 2.5 కోట్ల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తున్నది. చెరువులను బాగు చేసి, రిజర్వాయర్లను నిర్మించి కాళేశ్వరం నీళ్లతో నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. వాటి ఫలితాలే నేటి ఈ ధాన్యం దిగుబడులు. ఈ వాస్తవాలు గుర్తించకపోవడం కురుసతనమే అవుతుంది.
రైతుబంధు విషయంలోనూ అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేండ్లలో మొత్తం 10 విడతల్లో రూ. 65,192 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రైతుబంధు కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.15 వేల కోట్లు ఖర్చుచేస్తున్నది.
తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ప్రకారం.. మొత్తం లబ్ధిదారుల్లో అన్ని వర్గాలకు చెందిన ఐదెకరాల్లోపు భూమి గల సన్నకారు రైతులే 59.36 లక్షల మంది (91.33 శాతం). 5 నుంచి 10 ఎకరాల్లోపు గల రైతులు 7.28 శాతం కాగా 10 నుంచి 25 ఎకరాల రైతులు 1.30 శాతం, 25 ఎకరాలకు పైగల రైతులు 0.09 శాతం మాత్రమే. మొత్తం 65 లక్షల మంది లబ్ధిదారుల్లో 51.59 లక్షల మంది (80 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు. మొత్తం 1.48 కోట్ల ఎకరాల భూమి ఉంటే ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన రైతులదే 1.04 కోట్ల ఎకరాలు. ఈ వాస్తవాలు గుర్తించకుండా.. ప్రభుత్వం పెద్ద రైతులకే రైతుబంధు సాయం దోచిపెడుతున్నదని ప్రచారం చేయడం మరుగుజ్జుతనం కాదా?
ఇన్నాళ్లూ దగాపడ్డ దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పూచీ కత్తు లేకుండా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు గ్రాంట్గా ఇస్తున్నది. రాష్ట్రంలో లక్షల కుటుంబాలకు దళితబంధు సాయం అందుతున్నది. ట్రాక్టర్ డ్రైవర్లుగా పనిచేసిన దళిత యువకులు.. ఇయ్యాల యజమానుల య్యారు. వరికోత మెషిన్లు, డెయిరీఫామ్లు, రైస్ మిల్లులు, ఇతర చిన్నతరహా పరిశ్రమలు స్థాపించి దళిత సమాజం వృద్ధిలోకి వస్తున్నది. దళితుల్లో చైతన్యం పెరిగితే తమ ఉనికి ఎక్కడ ప్రశ్నార్థకంగా మారుతుందోనని ప్రతిపక్షాలు, ఆ పార్టీ నాయకు లు భయపడుతున్నారు.
అప్పుల రాష్ట్రంగా మారిందనడమూ అసత్య మే. కేంద్రం శత్రువైఖరితో రాష్ర్టాభివృద్ధికి ఏ మాత్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్ పటిష్ఠ ఆర్థిక ప్రణాళికతో రాష్ర్టాన్ని దేశానికి రోల్ మాడల్ గా నిలుపుతున్నారు. అప్పులు చేసే విషయంలో దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ 23వ స్థానంలో ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతి రూపాయి అప్పును సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తూ మళ్లీ సంపదను సృష్టిస్తున్నది.
అప్పుల రాష్ట్రంగా మారిందనడమూ అసత్య మే. కేంద్రం శత్రువైఖరితో రాష్ర్టాభివృద్ధికి ఏ మాత్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్ పటిష్ఠ ఆర్థిక ప్రణాళికతో రాష్ర్టాన్ని దేశానికి రోల్ మాడల్ గా నిలుపుతున్నారు. అప్పులు చేసే విషయంలో దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ 23వ స్థానంలో ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతి రూపాయి అప్పును సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తూ మళ్లీ సంపదను సృష్టిస్తున్నది.
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏం చేయాలో తోచక, ఏం మాట్లాడాలో పాలుపోక ప్రజల వద్దకు వెళ్లే మొహం లేక.. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రలకు తెరలేపారు. ఉనికి కోసం విమర్శలు చేసే ప్రజా సంఘాల నాయకులు, మంచిచెడుల్లో మంచిని మరిచి చెడు ను పట్టుకువేలాడే సోకాల్డ్ మేధావులు ముమ్మాటికీ మరుగుజ్జులు, కురుస మనుషులే.
మన్నె గోవర్ధన్ రెడ్డి: 98660 87878
(వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జి)