ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ కనీస బాధ్యత. గత ప్రభుత్వాలు ఈ బాధ్యతను పూర్తిగా ప్రైవేటుకు ధారాదత్తంచేసి చేతులు దులిపేసుకున్నాయి. పేదలు ఎంతో నమ్మకంతో అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వస్తారు. వారికి ఎలాంటి ఖర్చు లేకుండా, ఎంత ఖరీదైన వైద్యమైనా అందించాలి. కానీ ఉమ్మడి పాలనలో అది జరగలేదు. అందుకే ప్రభుత్వ దవాఖానకు వచ్చిన వారిని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి పంపాలన్న లక్ష్యంతో స్వరాష్ట్రంలో పదేండ్లలోనే వైద్యారోగ్యశాఖలో సమూల మార్పులు తెచ్చి రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చింది ప్రభుత్వం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తున్నది. వైద్య రంగంలో నూతన విప్లవానికి తెలంగాణ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జిల్లా కు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసింది .
గత ప్రభుత్వాలు రాష్ట్రంలో 60 ఏండ్లలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, పదేండ్లలోనే 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతోపాటు, రాష్ట్ర విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 4440 మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పి స్త్తూ, తగినంత వైద్య సిబ్బందిని నియమించింది. నేడు ప్రభుత్వ దవాఖానల్లో మొత్తం 35 వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్స్ ఉన్నాయి. దీంతో ప్రజలకు మంచి వైద్యం అందుబాటులోకి వచ్చింది. స్వరాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగు పరిచేందుకు బడ్జెట్లో కేటాయింపులు గణనీయంగా పెంచారు సీఎం కేసీఆర్. 2015-16లో వైద్యారోగ్య శాఖకు రూ.4,932 కోట్లు కేటాయించగా. 2023-24 నాటికి అది రూ. 12, 161 కోట్లకు పెరిగింది. అంటే పదేండ్లలో హెల్త్ బడ్జెట్ రెండున్నర రెట్లు పెరిగింది. తలసరి వైద్య బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
2019-20లో వైద్యారోగ్య రంగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ర్టాల జాబితాలో తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. అంధత్వ రహి త తెలంగాణ సాధన కోసం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించింది. మొదటి విడత లో భాగంగా కోటిన్నర మందికి పరీ క్షలు నిర్వహించారు. రెండో విడత’ కార్యక్రమాన్ని ప్రభుత్వం మొత్తం 1500 ప్రత్యేక బృందాలతో నిర్వ హించింది. 100 రోజులు లక్ష్యంగా పెట్టుకోగా.. రికార్డు స్థాయిలో 80 రోజుల్లోనే కోటిన్నర మందికి పరీక్షలు పూర్తయ్యాయి.
సూపర్ స్పెషాలిటీ సేవలంటే ఇప్పటికీ గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలే దిక్కు. దీంతో ఆయా దవాఖానలపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సూపర్ స్పెషాలిటీ సేవలను పెంచాలని, ఈ మేరకు హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు శ్రీకారం చుట్టారు. అల్వాల్, గచ్చిబౌలి, ఎల్బీనగర్, సనత్నగర్ల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటికితోడు వరంగల్ హెల్త్ సిటీలో సూప ర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తున్నారు. నిమ్స్లో అదనంగా 2000 సూపర్ స్పెషాలిటీ పడకలను విస్తరిస్తున్నారు. ఈ పనులు కొనసాగుతున్నాయి. వరంగల్ హెల్త్ సిటీని దసరా నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు.
హైదరాబాద్లో 350, మున్సిపాలిటీల్లో 150 కలిపి 500 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమా రు 370 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తున్నాయి. మరో 50 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఏటా సుమారు 50 లక్షల ఓపీ నమోదవుతున్నది. బస్తీ దవాఖానలతో గాంధీ, ఉస్మానియా, నిమ్స్లలో ఓపీ భా రం గణనీయంగా తగ్గింది. ఫలితంగా వైద్యులు స్పెషాలిటీ సేవలపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు.
సామాన్యుడికి వైద్యం ఖర్చు తడిసి మోపెడు అవుతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రజలకు ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానలపై నమ్మకాన్ని కల్పించింది. మెడికల్ కాలేజీలు, ్త వైద్యులు, వైద్య పరికరాలు, అవసరాలకు తగినట్ట్టు ప్రజా ఆరోగ్యం కోసం అడిగినవన్నీ వెంట నే సర్కారు మంజూరు చేస్తున్నది. పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లోనూ వైద్యరంగంలో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది బీఆర్ఎస్ సర్కార్.