ఇప్పుడాయన ఒట్టి ఒమ్రికానే. దగ్గు, పర్శంతో రెండు రోజులకు అదే పోతుంది. అందుకే ఆయనను లైట్ తీసుకున్నట్టు ఓ పెద్ద నాయకుడు కామెంట్ చేయడమే రాజీనామాకు సిద్ధపడ్డ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గుస్సాకు కారణమట. టీపీసీసీకి అధ్యక్షుడిగా నియామకమైన కొత్తలో కొందరు రాద్ధాంతం చేయడంతో కరోనాకు భయపడినట్టు భయపడ్డానని, ఇప్పడు వాళ్లే ఒర్లి…ఒర్లీ ఒమిక్రాన్ లా తయారుకావడంతో పట్టించుకోనవసరం లేదని సదరు నాయకుడు కామెంట్ చేశారట. ఇది జగ్గారెడ్డి చెవిన పడటంతో పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారట. ఎవరిమీద అయితే కోపంతో రాజీనామాకు సిద్ధపడ్డారో, సదరు నాయకుడే తాజాగా జగ్గన్నకు అండగా ఉంటానని ప్రకటించడంతో వివాదం ‘టీ కప్పులో తుఫాను’లా చల్లబడింది. దీంతో జగ్గారెడ్డి ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇప్పటికైతే.. సంశేషమే!