గత పాలనలో తెలంగాణ ప్రాంతం రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వెనుకబడింది. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమం ప్రత్యేక రాష్ట్రం ద్వారానే సాధ్యమని భావించారు. స్వరాష్ట్రం కోసం ఉద్యమించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో స్వపరిపాలన సాధన కోసం పోరాడారు. దశాబ్దాల పోరాటం, అమరుల త్యాగ ఫలితంగా సబ్బండవర్ణాలను సమ్మిళితం చేసి స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చుకున్నాం.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆశయాలను అమలుచేస్తూ వస్తున్నది కేసీఆర్ ప్రభు త్వం. వ్యవసాయానికి సాగునీరు అందించాలనే లక్ష్యం చేరుకున్నది. తద్వారా తెలంగాణ రైతు సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాడు.
గడిచిన పదేండ్ల పాలనలో సంక్షేమ తెలంగాణ సాకారమైంది, సబ్బండ వర్గా ల అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగుతున్నది. రాష్ట్రం ఏర్పడితే నష్టపోతామని అవహేళన చేసిన దశ నుంచి దేశంలో అత్యధిక సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రంగా అవతరించింది. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దేశానికి మాడల్గా నిలిచింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పనకూ పెద్దపీట వేసింది ప్రభుత్వం. సాగునీటి వనరుల పెరుగుదలతో అన్నిరంగాల్లో ఊహించని స్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతున్నది.
దేశానికి అన్నం పెట్టే రైతుల సంక్షేమానికి వ్యవసాయరంగంలో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చింది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, రైతుల కోసం అమలుచేస్తున్న పథకాలు, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. గత పాలకుల వివక్ష, నిర్లక్ష్యం వల్ల సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయ రంగానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో నూతన జవసత్వాలు లభిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ పొలాలకు సరిపడా నీరు, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతున్నది.
రైతుబంధు, రైతు బీమా, చెరువుల పునరుద్ధరణ, భారీ సాగునీటి ప్రాజెక్టులు, నాణ్యమైన విత్తనాల సరఫరా, పంటల కొనుగోలు, రైతు వేదికలు తదితర కార్యక్రమాలు, పథకాలతో రైతులలో సేద్యం పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 68.94 లక్షల మందికి రైతుబంధు సాయం అందింది.
1.53 కోట్ల ఎకరాల సాగుకు రూ.7,654.43 కోట్లు ప్రభుత్వం విడుద ల చేసింది. ఈ పథకం కింద రైతులకు ఇప్పటివరకు రూ.72,910 కోట్ల సాయా న్ని సర్కార్ అందించింది. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం లోసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతున్నది. నిరుడు రబీలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈ ఏడాది 56 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
2014 నాటికి సాగు విస్తీర్ణం 1 కోటి 34 లక్షల ఎకరాలు కాగా, నేడు అది 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది కాకుండా 11.50 లక్షల ఎకరాల్లో ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెరిగింది. 2014-15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, 2021-22 నాటికి 2.49 కోట్ల టన్నులకు చేరింది.
అన్ని పంటల ఉత్పత్తి కలిపి 3.50 కోట్ల టన్నులకు చేరుకున్నది. 2014-15 లో పత్తి సాగు విస్తీర్ణం 41.83 లక్షల ఎకరాలు ఉండగా, 2020-21 నాటికి 44. 70 శాతం వృద్ధితో 18.70 లక్షల ఎకరా లు పెరిగి 60.53 లక్షల ఎకరాలకు చేరుకున్నది. 2014-15లో పత్తి దిగుబడి 35.83 లక్షల బేళ్లు ఉండగా, 60.44 లక్ష ల బేళ్లకు చేరుకున్నది. పామాయిల్ సాగు ద్వారా ఎకరానికి దాదాపు లక్షా 50 వేల రూపాయల వరకు రైతులకు ఆదాయం వస్తుంది. ఆయిల్పామ్ సాగు విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచే దిశగా ప్రభు త్వం అడుగులు వేస్తున్నది.
2023- 2024 సంవత్సరానికి గాను అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతుల రుణమాఫీకి రూ. 6,385 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. వ్యవసాయ రంగానికి ఏకంగా రూ.26,831 కోట్లు కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముం దు వ్యవసాయానికి, దాని అనుబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం రూ.7,994 కోట్లు మాత్రమే నిధులు ఖర్చుచేయగా, తెలంగాణ ప్రభుత్వం రూ.1,91,612 కోట్లు ఖర్చు చేస్తున్నది.
రైతు పండించిన ధాన్యాన్ని ఎటువంటి పరిమితులు లేకుండా కొనుగోలు కేంద్రా ల ద్వారా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ ఏర్పాటు నుంచి నేటివరకు రూ. 1,07,748 కోట్ల విలువైన 6 కోట్ల 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని ప్రభుత్వం సేకరించి, రైతుల ఖాతాల లో డబ్బు జమచేసింది. రైతులకు ఉచిత 24 గంటల కరెంటు అందిస్తున్న ఏకైకరాష్ట్రం తెలంగాణ. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. రైతులకు ఉచిత ఎరువులు, వ్యవసాయ సామగ్రిలకు రాయితీలు కల్పిస్తున్నది. అనుకోకుండా రైతు మరణిస్తే ఆ కుటుంబానికి ఐదు లక్షల జీవితబీమా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.
వ్యవసాయరంగంలో సాధించిన ప్రగ తి కూడా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుదలకు దోహదం చేసింది. రైతులకు ఆధునిక సేద్య, సస్యరక్షణ పద్ధతుల గురించి చైతన్యపరిచేందుకు ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని ప్రభుత్వం నియమించింది.
పంటలకు గిట్టుబాటు ధర కోసం ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పి 6.66 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తెలంగాణ
వ్యవసాయరంగం దేశానికే ఆదర్శంగా పురోగమిస్తున్నది.
-తీగల అశోక్ కుమార్
79891 14086