తెలుగు రాష్ర్టాల్లోని నేతన్నల నైపుణ్యాన్ని చాటిచెప్పే అవకాశాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జారవిడుచుకున్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మల ధరించిన చీర గురించి జాతీయ మీడియా ఆఫ్బీట్ స్టోరీ చేసింది. ఆ చీర ఒడిశా నేతన్నలు నేసిందని నేషనల్ మీడియా చెప్పింది. నేతన్నలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్తో సహా ఇతర మంత్రులు కొందరు వారంలో ఒకరోజు కాటన్ షర్ట్ ధరించి నేతన్నలకు బ్రాండ్ అంబాసిడర్లుగా పని చేస్తున్నారు. కానీ, తెలుగింటి కోడలినని గొప్పగా చెప్పుకొనే నిర్మలా సీతారామన్ మాత్రం ఒడిశాకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిం ది. ఉత్తర భారతానికి చెందిన దివంగత సుష్మా స్వరాజ్, ప్రస్తుత కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గద్వాల, నారాయణపేట, పోచంపల్లి, వెంకటగిరి, ఉప్పాడ కాటన్ చీరలను అప్పుడప్పుడు ధరించి తెలుగు రాష్ర్టాల నేతన్నల నైపుణ్యాన్ని ప్రోత్సహించగా, మన తెలుగింటి కోడలి వ్యవహారం మాత్రం ‘పేరు గొప్ప… ఊరు దిబ్బ..’ అనే చందంగా ఉన్నది.
– వెల్జాల