దొంగే, ‘దొంగా.. దొంగా’ అని అరిచినట్టుగా ఉన్నది ఎన్సీపీ అధినేత శరద్పవార్ వైఖరి. హిండెన్బర్గ్ రిపోర్టుతో అదానీ వ్యవహారం బయటపడటంతో అదానీ-అంబానీ సంబంధాలపై విపక్షాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) డిమాండ్ చేశాయి. జేపీసీని వ్యతిరేకించి బీజేపీకి పరోక్షంగా శరద్పవార్ మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత అదానీ స్వయంగా శరద్పవార్తో భేటీ అయిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన సంకీర్ణ సర్కార్లో రేపో, మాపో ఎన్సీపీ చేరబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతున్నది. బీజేపీకి లోపాయికారిగా ఒకవైపు మద్దతు ఇస్తూనే బీజేపీకి బీ-టీమ్గా మారిన శరద్పవారే, బీఆర్ఎస్పై బీ-టీమ్ ముద్ర వేయడమంటే ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’అన్నట్టుగా ఉంది వ్యవహారం