మహారాష్ట్ర జనం బీఆర్ఎస్ సారథి కేసీఆర్ బాట పడుతున్నరు. చిన్నా, పెద్ద అంతా బీఆర్ఎస్తో మమేకం ఐతున్నరు. మరాఠా పబ్లిక్లో కేసీఆర్ పిలుపు నరనరాన ప్రేరణ రాజేస్తున్నది. ఎంతటి పాలకులనైనా, ప్రభుత్వాలనైనా మన చేతిలో ఉన్న ఓటు అనే తిరుగులేని ఆయుధంతో కాలగర్భంలోకి తోసేయవచ్చని అక్కడి ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నారు కేసీఆర్. సభల్లో కేసీఆర్ ఉపాన్యాసాలు సరికొత్త సంచలనం అవుతున్నయి. మహత్తరమైన ఆ ఓటు శక్తినిచ్చింది అదే మహారాష్ట్ర నేలపై జన్మించిన బాబా సాహెబ్ అంబేద్కర్ అని ఉటంకిస్తూ వారిలో కొత్త స్ఫూర్తిని రగిలిస్తున్నారు.
తెలంగాణ సర్కార్ తరహా సమూల, సమగ్ర వికాసం తాలూకు మార్పు(విప్లవం)పై చర్చ, ఆలోచన ఒకరి నుంచి మరొకరికి బట్వాడా (పంపిణీ) అవుతూ టాప్ గేరుతో స్పీడ్ అందుకొన్నది. మహారాష్ట్రలో ఒక్కో దశను చకచకా దాటుతూ బీఆర్ఎస్ ప్రబ ల శక్తిగా పట్టు బిగిస్తున్నది. బ్రహ్మాండమైన బహిరంగ సభలు ఓ వైపు నిర్వహిస్తూనే, ఊరూరా పార్టీ కమిటీలతో బీఆర్ఎస్ మహా నిర్మాణానికి సమాయత్తం అవుతున్నది. బేస్ లెవెల్ టు స్టేట్ మొత్తం పటిష్ఠమైన బీఆర్ఎస్ సౌధానికి కార్యాచరణ ఖరారు చేసింది.
గ్రామ కమిటీలకు మే తొలివారం నుంచి జూన్ మొదటి వారం దాకా ముహూర్తం ఫిక్స్ చేసింది. జనాన్ని ఒక ప్రాంగణానికి చేర్చే మీటింగ్స్ స్థాయిని దాటి జనం వద్దకే పార్టీ వెళ్ళే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఏకంగా లక్షల మందితో కిసాన్ మహా ర్యాలీ నిర్వహణకు బీఆర్ఎస్ పూనుకుంటున్నది. మహారాష్ట్రలో సింహభాగమున్న గ్రామీణ ప్రజానీకం భాగస్వామ్యమయ్యే జిల్లా పరిషత్ ఎన్నికల కదన రంగంలోకి బీఆర్ఎస్ దూకనున్నది. తద్వారా మహారాష్ట్రలో పట్టు సాధించాలని పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.
పేరులోనే మహారాష్ట్ర. పరిపాలనా వైఫల్యాల తీరు తో చిన్నబోయిన రాష్ట్రం. ప్రజలేమో అమాయకులు. కష్టజీవులు.ఎంతో మర్యాదస్తులు. తాము పస్తులుండై నా అతిథుల కడుపు నింపే ఆత్మ బంధువులు. అపారమైన దేశభక్తి, దైవభక్తి గలవారు. స్వచ్ఛమైన గోదావరి జీవనది పుట్టిన నేలపై అంతే స్వచ్ఛమైనది మహారాష్ట్ర సమాజం. రాష్ట్రంలో వనరులు పుష్కలం. ప్రజల జీవ న ప్రమాణాల పరిరక్షణకు తగిన సదాలోచనలు, రాజకీయ సంకల్పాలు మాత్రం శూన్యం.
ప్రపంచ మేధావి బాబా సాహెబ్ అంబేద్కర్, వీరా ధి వీరుడు ఛత్రపతి శివాజీలను కన్న పుణ్యభూమి మీద, ఎందరో మహానుభావులు నడయాడిన నేల మీద ఈ పాలకుల నిష్క్రియపరత్వం చాలదన్నట్టు..ఈ మధ్య కాలంలో ఊగిసలాటలతో దిన దిన గండంలా అస్థిర ప్రభుత్వం. రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యం.
అభివృద్ధి సంక్షేమం పరంగా అంధకారం అలుముకున్న క్లిష్ట తరుణంలో ఆ దైవమే పంపించినట్టుగా బీఆర్ఎస్-కేసీఆర్ రూపంలో అజేయమైన ఆశాకిరణం మహారాష్ట్రలో మెరుస్తున్నది. మరాఠాల మదిలో విశ్వా స ముద్ర వేసుకుంటున్నది. చూస్తున్నంతలోనే వరుస బహిరంగ సభలతో మహారాష్ట్ర మొత్తం లోతుగా బీఆర్ఎస్ తో అల్లుకుపోతున్నది. సమీప రోజుల్లో జిల్లా పరిషత్ ఎన్నికలతో బీఆర్ఎస్ బోణి కొట్టి, అసెంబ్లీ-పార్లమెంటు దాకా గులాబీ ప్రాతినిథ్యానికి మహారాష్ట్ర కార్యోన్ముఖం అవుతున్నది.
బ్రహ్మాండమైన శుభారంభంగా భారత రాష్ట్ర సమితి నాందేడ్ మీటింగ్ మరాఠ్వాడాలో మార్పు (విప్లవం) బట్వాడాకు నాంది పలికింది. కడపటి కాంధార్సభ మహారాష్ట్ర ఉజ్వల భవితకు సమరశంఖం పూరించిం ది. మహారాష్ట్ర నట్టనడుమన గల నగరం ఇప్పుడు శంభాజీనగర్ గా పిలుస్తున్న ఔరంగాబాద్ లో మూడో బహిరంగ సభతో బీఆర్ఎస్ అంచనాలకు మించి ఫలవంతమైంది.
చెప్పడమే కాదు, చేసి చూపించే అప్రతిహత విజయాల్లో మరో గొప్పనైనదిగా అదే మహారాష్ట్ర భూమి పుత్రుడు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల మహా ప్రతిమ ఆవిష్కరణ ప్రేరణాత్మకంగా నిలిచింది. సామాన్య ప్రజల జేజే లు, రాజ్యాంగ పితామహుడైన అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కితాబు, బ్రిటన్ ఎంపీ వీరేంద్ర శర్మ ప్రశంసలు మరింత ఉత్తేజాన్ని నింపాయి.
తాజా శంభాజీనగర్ బహిరంగ సభ విజయవంతంతో మహారాష్ట్ర ప్రజల్లో కేసీఆర్ పట్ల మరింత విశ్వాసం పెరిగింది. కేసీఆర్ పాలనలో జీవం ఉట్టిప డే సంక్షేమ, సురక్షిత పథకాలు, గుణాత్మక అభివృద్ధి, శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన ఫలాలు అనుభవిస్తున్న తెలంగాణ ప్రజల మాదిరి తమకూ సమీప భవిష్యత్తులో వాటిని అందించే భాగ్యవిధాతను కేసీఆర్లో దర్శిస్తున్నారు. మరాఠా లీడర్లు, ఔత్సాహికులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా బీఆర్ఎస్ ప్రబలమైన శక్తిగా మహారాష్ట్రలో అవతరిస్తున్నది. నేటి తెలంగాణ సీఎం రేపటి భారత ప్రధానిగా దృఢమైన భావనతో ఆ రాష్ట్ర ప్రజానీకం దీవిస్తున్నది. బీజేపీ బరితెగింపు పోకడల పీచమణిచేలా బీఆర్ఎస్ ప్రభావవంతమైన రాజకీయాలు, సమీకరణాలు, మహారాష్ట్రలోనూ మహా మార్పులకు చిహ్నంగా విశ్లేషిస్తున్నారు.
శంభాజీనగర్ బహిరంగ సభ విజయవంతంతో మహారాష్ట్ర ప్రజల్లో కేసీఆర్ పట్ల మరింత విశ్వాసం పెరిగింది.
కేసీఆర్ పాలనలో జీవం ఉట్టిపడే సంక్షేమ, సురక్షిత పథకాలు, గుణాత్మక అభివృద్ధి, శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన ఫలాలు అనుభవిస్తున్న తెలంగాణ ప్రజల మాదిరి తమకూ సమీప భవిష్యత్తులో వాటిని అందించే భాగ్యవిధాతను కేసీఆర్లో దర్శిస్తున్నారు. మరాఠా లీడర్లు, ఔత్సాహికులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు.
బీఆర్ఎస్ నినాదం ఈసారి రైతు ప్రభుత్వం (అబ్ కీ బార్ కిసాన్ సర్కార్) మహారాష్ట్ర వాసుల హృదయాలకు సూటిగా తాకింది. అందుకే, కర్షకులు బీఆర్ఎస్ ను ఓన్ చేసుకుంటున్నారు. మహారాష్ట్రలో 85 శాతం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడినవారు. అక్కడ సేద్యంలో సంక్షోభాలు కల్లోలం రేపుతున్నాయి. రైతు ఆత్మహత్యలు లేని రోజంటూ లేదు. తెలంగాణలో అ మల్లో ఉన్న రైతు బంధు, రైతు బీమా, పొలాలకు జలా లు, ఉచిత విద్యుత్తు, పంట కొనుగోళ్లు వంటివి మహారాష్ట్ర రైతాంగాన్ని ఆకర్షిస్తున్నాయి. ఆసరా పింఛన్లు, దళిత బంధు వంటి బతుకు భరోసా పథకాల కోసం మహారాష్ట్ర వాసులు వేచి చూస్తున్నారు. అధికారంలో కి వస్తే తెలంగాణ పథకాలన్నీ మహారాష్ట్రలోనూ ప్రవేశపెడుతామన్న తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధిపతి కేసీఆర్ సందేశం మరాఠాల మదిలో చెరగని ముద్ర వేసింది.
మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కనీ స సౌకర్యాలు కల్పిస్తే మరాఠా రాజకీయాలు వదులుకొని, మధ్యప్రదేశ్ వెళ్తానని కేసీఆర్ తేల్చి చెప్పడం జనా న్ని ఎంతగానో ఆలోజింపజేస్తున్నది. ఆ సవాల్ అక్కడి పాలకులను ఆత్మరక్షణలోకి నెట్టింది. ఆ ఒక్క మాటతో కేసీఆర్కు, బీఆర్ఎస్కు మరాఠ్వాడా జేజేలు పలుకుతున్నది.
ఇల్లెందుల దుర్గాప్రసాద్: 9440850384
(వ్యాసకర్త: ఇండిపెండెంట్ జర్నలిస్ట్)