తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. తన బిడ్డలను ఉద్యమం వైపు నడిపించి తెలంగాణ తల్లి విముక్తి కోసం వారు చనిపోతుంటే కడుపు కోతను అనుభవించింది. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి ఉస్మానియా విశ్వవిద్యాలయమే ప్రధాన కారణం. నూతన ఉత్తేజం కలిగిన నాయకత్వాన్ని కూడా ఈ రాష్ర్టానికి, దేశానికి అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీది. తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపటంలోఉద్యమానికి వెన్నుదన్నుగా నిలబడ్డది కూడా ఉస్మానియా విద్యార్థి నాయకులే. అంతటి చరిత్ర గల ఉస్మానియా విద్యార్థులను అడ్డా కూలీలంటూ చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్రెడ్డి విద్యార్థిలోకానికి క్షమాపణ చెప్పాలి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటేనే ఉద్యమాల పురిటి గడ్డ. ఇక్కడి విద్యార్థి నాయకులెందరో తెలంగాణ సమాజ భవితవ్యాన్ని నిర్దేశించే స్థాయికి ఎదిగారు. 1921లోనే ఉస్మానియా యూనివర్సిటీలో గ్రంథాలయ ఉద్యమం మొదలైంది. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపింది ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులే. వారి త్యాగం వారి పోరాట పటిమ గురించి తెలియని వారుండరు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణలో ఎలాంటి పోరాటానికి పిలుపు వచ్చినా ముందుండి పోరాడిన వారు ఉస్మానియా విద్యార్థులు . కేసీఆర్ 2009లో ఆమరణ నిరాహారదీక్ష చేస్తే వారికి తోడుగా నిలబడి నాటి సీమాంధ్ర పాలకులకు వెన్నులో వణుకుపుట్టించింది యూనివర్సిటీ విద్యార్థులే. గత్యంతరం లేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం చేస్తున్నామని ఢిల్లీ పెద్దలు చెప్పేలా ఒత్తిడి తీసుకువచ్చింది.
ఇంతటి చరిత్రగల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో చాలా పరుష పదజాలంతో మాట్లాడారు. ‘ఓయూ విద్యార్థి నాయకులు అడ్డామీద కూలీలు , కేటీఆర్ డబ్బులు ఇస్తే బీర్ తాగి, బిర్యానీ తిని కూలీల్లాగ వ్యవహరిస్తున్నారని’ అవమానకరంగా మాట్లాడారు. ఇలా తెలంగాణకు తలమానికంగా ఉన్న ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను చులకన చేసి మాట్లాడటం వారి అహంకారపూరిత ధోరణికి నిదర్శనం.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద రేవంత్ చేసిన వ్యాఖ్యలు విద్యార్థి లోకాన్ని అవమానపరిచేలా ఉన్నాయి. ఉస్మానియా విద్యార్థుల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడమంటే తెలంగాణ అస్తిత్వాన్ని అవహేళన చేసినట్టే.
ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయం జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ అనాలోచిత విధానాలు, కుట్రపూరిత రాజకీయాల మూలంగా ఎంతమంది విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారో మన కండ్ల ముందే ఉన్నది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో విద్యార్థుల మీద రబ్బరు బుల్లెట్లు , బాష్ప వాయు గోళాలు, లాఠీ దెబ్బలతో విచక్షణా రహితంగా వ్యవహరించింది నాటి కాంగ్రెస్ పాలకులే. నాడు తెలంగాణ విషయంలో ద్రోహం చేసి విద్యార్థుల ఆత్మబలిదానాలకు కారకులయ్యారు. అదే విధంగా నేడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉస్మానియా విద్యార్థులపై విషం చిమ్ముతున్నాడు.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను తమ అవసరాలకు వాడుకున్నది కాంగ్రెస్ పార్టీనే. రేవంత్రెడ్డి చరిత్ర మరిచి వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఓయూ విద్యార్థులను వాడుకొన్న కాంగ్రెస్ వారికి ఎలాంటి పదవులు ఇచ్చి గౌరవించలేదు. అదేవిధంగా నేడు కూడా కాంగ్రెస్లో అనేక మంది విద్యా ర్థి నాయకులకు పార్టీ టికెట్ ఇస్తామని మభ్యపెట్టి గొంతు కోశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందరో విద్యార్థి నాయకులకు ప్రత్యక్ష , పరోక్ష రాజకీయాల్లో అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థి నాయకుల్లో కొంతమందికి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా అవకాశం కల్పించారు. విద్యా ర్థులకు కాంగ్రెస్ చేసి ందేమీ లేకపోగా ఉస్మానియా విద్యార్థులను అవమానించేలా మా ట్లాడిన రేవంత్రెడ్డి విద్యార్థిలోకానికి క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో రేవంత్రెడ్డికి తగి న బుద్ధి చెప్పడానికి విద్యార్థు లు సిద్ధంగా ఉన్నారు.
– రాజేష్ నాయక్ జీ 9603579115