నాలుక మడిచి… కనుగుడ్లు ఉరిమింది మిమ్మల్ని (మీడియాను) చూసి కాదు బాబోయ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ లబోదిబో మంటున్నారు. సచివాలయంలో జరిగిన ప్రెస్మీట్లో మంత్రి పొన్నం మీడియా వారిపై నాలుక మడిచి గుడ్లు ఉరిమినట్టు సోషల్ మీడియాలో వైరలైంది.
ఆ మరుసటి రోజు జరిగిన ప్రెస్మీట్లో మంత్రి పొన్నం దీనిపై వివరణ ఇస్తూ, మీరే ప్రత్యక్ష సాక్షులు. ప్రెస్మీట్ జరుగుతుండగా ఐఅండ్పీఆర్ ఉద్యోగి ఒకరు మీకు అడ్డం వచ్చాడని అతనిపై గుడ్లు ఉరిమితే… అది మీ మీద ఉరిమినట్టు ప్రచారం చేస్తుంటే ఎందుకు ఖండించడం లేదని వాపోయారు.