మహాకవి గుంటూరు శేషేంద్రశర్మ 16వ వర్ధంతి సాహిత్య సదస్సు ఈనెల 30న జేఎన్టీయూహెచ్లోని ఆడిటోరియంలో జరుగుతుంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సదస్సులో ‘ఆత్మ’, కాఫీటెబుల్ బుక్ ‘తెలంగాణ’, ఆధునిక మహాభారతం పుస్తకాలు ఆవిష్కరిస్తారు.
– శేషేంద్ర మెమోరియల్ ట్రస్ట్
వచన కవిత, కథ, విమర్శ అనువాద పక్రియల్లో రచయిత్రుల తొలిపుస్తకాన్ని సొంత నిధులతో ముద్రించాలని సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ నిర్ణయించింది. ప్రతులను జూన్ 15 లోగా తెలంగాణ సారస్వత పరిషత్, బొగ్గులకుంట, హైదరాబాద్-1 చిరునామాకు పంపాలి. వివరాలకు 99490 28935, 9440049323 నంబర్లలో సంప్రదించగలరు.
-సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్