వలస పాలన నుంచి స్వపాలన దాకా తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ప్రాణానికి ఎదురొడ్డి చేసిన త్యాగాలను, భరించిన అవమానాలను, దుర్మార్గమైన విమర్శలను తలచుకుంటే హృదయమున్న ఎవరికైనా కన్నీరు తన్నుకరాక మానదు.
త్యాగాలతో దశాబ్దాల కాలం కరిగిపోంగ, వలస పాలనలో పరాయీకరణకు గురై, ఏదీ నాది కాదనే నిరాశా నిస్పృహలతో రాజకీయ నిర్వీర్యతకు గురైంది తెలంగాణ. అటువంటి సంధికాలంలో ముందటికి వచ్చింది ‘కేసీయారిజం’ అనే ఒక రాజకీయ పంథా. అప్పటిదాకా మెయిన్ స్ట్రీం పాలిటిక్స్లో అణచివేయబడి గుండె గొంతుకలో కొట్లాడుతున్న తెలంగాణ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అస్తిత్వ భావనను పెకిలించి శంఖారావం పూరించి, వేయి గొంతుకల ప్రకటన చేసిన రణనినాదం వినిపించిండు కేసీఆర్.
నాడు దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ మహాత్ముని బాటలో నడిచి, శాంతియుత పద్ధతుల్లో తెలంగాణను నడిపించి స్వయం పాలన సాగించిండు. ఉద్యమం చేస్తూనే ఒక పక్క ఇంటిపోరు, మరోపక్క బయటిపోరును తట్టుకొని నిలబడటం సామాన్యులతో అయ్యేపని కాదు. కానీ కేసీఆర్కు సాధ్యమైంది. ఈ తన్లాట స్వరాష్ట్రంలో కూడా వెన్నంటింది. ఆరంభంలోనే స్వయం పాలనను కూలదోయడానికి విఫల ప్రయత్నం చేసిన తెలంగాణ ద్రోహుల గుంపు తమ కుట్రలకు, కుతంత్రాలకు పదునుపెడుతూ.. తమ స్వార్థ రాజకీయాల కోసం ఏకమై గుంటనక్కల మాదిరి మోపైండ్రు. ద్రోహులకు సద్దులు మోసే తెలంగాణ ఇంటి దొంగలు కేసీఆర్ను పడగొట్టాలని గుంటనక్క పన్నాగాలను తలచుకుంటే తెలంగాణ హృదయాలు నేటికీ తల్లడిల్లుతున్నయి. గాలి వార్తలను సృష్టించి అమాయకపు తెలంగాణ ప్రజలను గోల్మాల్ తప్పి అధికారం గద్దెనెక్కుదాం అని ఆత్రపడుతున్న విద్వేష వాదులకు భంగపాటు తప్పదు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను తెర్లు గాకుంట కాపాడుతున్న కేసీఆర్ పట్టుదలను భగ్నం చేయాలని చూస్తున్న ఈ బానిస తొత్తులకు నవంబర్ 30 నాడు తమ ఓటుతో బుద్ధిచెప్పాలని తెలంగాణ సమాజం నిశ్చయించుకున్నది. కేసీఆర్ చేసే ప్రతి పనినీ తప్పుపడుతూ, ప్రతిదాన్నీ వ్యతిరేకిస్తూ, గుంపులు గుంపులుగా మీడియా మాధ్యమాల ద్వారా గుప్పుతున్న అబద్ధాలను, అర్ధ సత్యాలను పసిగట్టి తిప్పకొట్టేందుకు సిద్ధంగా ఉంది తెలంగాణ. సోషల్ మీడియా పేరుతో నడుపుతున్న గోబెల్స్ ప్రచారాన్ని తెలంగాణ సోయితో అర్థం చేసుకుంటూ ఏది సత్యం.. ఏది అసత్యమో తెలుసుకుంటున్నరు.
తెలంగాణ ప్రగతి ప్రస్థానం మరింతగా పురోగమించాలంటే.. మరింత రాజకీయ పాలన స్థిరత్వం అనివార్యం. అందుకే ఈ ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్నే గెలిపించుకుంటం. కేసీఆర్నే మళ్లా ముఖ్యమంత్రిని చేసుకుంటం అంటున్నారు ప్రజలు. ఇందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ‘మేము రాజకీయ జ్ఞానానికి వచ్చినం.. ఓ మహాత్మా.. ఓ మహర్షీ మీ బాటే సత్యం, మీ మాటే నిత్యం.. మీ అడుగుజాడల్లోనే నడుస్తం’ అంటున్నది యావత్ తెలంగాణ సమాజం.
-రమేశ్ హజారి
93909 19090