ఇది 80స్ నాటి ఒక తెలుగు సినిమాలో నూతన్ ప్రసాద్ చెప్పిన పాపులర్ డైలాగ్. స్పిరుచ్యువల్ కమెడియన్ కేఏ పాల్ కూడా అప్పటివాడే కాబట్టి ఈ డైలాగ్ను మళ్లీ పాపులర్ చేయాలని చూస్తున్నారు. దేశం ప్రస్తుతం చాలా క్లిష్టపరిస్థితిలో ఉందని తాను ఏకంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు చెప్పినట్టు పాల్ మీడియాకు తెలిపారు.
ఎప్పటికప్పుడు దేశం లో ఏం జరుగుతుందో తాను మోదీకి, అమిత్ షాకు రిపోర్టు చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. ‘నా మాటలపై నమ్మకం లేకపోతే చెప్పండి, వారితో క్షణాల్లో అపాయింట్మెంట్ ఇప్పిస్తా. మీరే చూడండి’ అని పాల్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఇంతకు పాస్టర్గా ఉండే పాల్… బీజేపీ అగ్రనేతలకు పీఎస్గా ఎప్పుడు మారారని ఆయనంటే గిట్టనివారు ప్రశ్నిస్తున్నారు.
– వెల్జాల