BJP | గడిచిన దశాబ్దకాలంలో 5 శాతం మం ది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ప్రభుత్వం ఇటీవల గొప్పగా ప్రకటించింది. 2011-12 కుటుంబ వినిమయ వ్యయ సర్వేతో పోలుస్తూ.. నీతి ఆయోగ్ తన నివేదికలో ఈ విధంగా పేర్కొం ది. కానీ, 2011-12 సర్వేలోని ప్రమాణాల ను పరిగణనలోకి తీసుకోకుండా.. ప్రస్తుత ఆదాయం, ఋణాలు, ప్రభుత్వ ఉచిత పథకాల ఆధారంగా పేదరికం తగ్గిందని ప్రకటించడం గమనార్హం. ఈ విధానం ఏ మాత్రం సమంజసం కాదని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, అధిక ధరలు.. పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తుంటే ‘పేదరికం తగ్గింది’ అని బీజేపీ సర్కార్ గొప్పలకు పోవడం ఏమిటని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేనివిధంగా ఈ మధ్యకాలంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఏటా లక్షల మంది యువత డిగ్రీ, బీటెక్ పట్టాలు తీసుకొని జాబ్ మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక కోట్ల మంది నిరుద్యోగులు రోడ్ల వెంట తిరుగుతున్నారు. ఆకలికి అలమటిస్తున్నారు. ఈ వాస్తవాలను విస్మరిస్తున్న కేంద్రం పేదరికం తగ్గిందని చెప్పడం హాస్యాస్పదం. విగ్రహాలు నిర్మిస్తూ, సామాన్యులకు అందుబాటులో లేని వందేభారత్ రైళ్లను ప్రవేశపెడుతూ.. ఇదే అభివృద్ధి అని ప్రజలను పాలకులు మభ్యపెడుతున్నారు. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరిస్తుందని చెప్తూ పేదరికంపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రజల కనీస అవసరాలైన కూడు, గూ డు, గుడ్డ కూడా లేకుండా కోట్ల మంది భారతీయులు ఇప్పటికీ దీనావస్థలో బతుకుతున్నారు. అందువల్లనే అటు కేంద్రం, ఇటు రా ష్ట్ర ప్రభుత్వం ఉచిత, సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్నాయి. రేషన్ బియ్యం అందిస్తున్నా యి. వాస్తవానికి ప్రజలు పేదరికం నుంచి బ యటపడితే ఉచిత, సంక్షేమ పథకాలు తగ్గాలి కదా! మరి రోజురోజుకు పెరగడం ఏమిటి?
నిజంగా పేదరికం తగ్గితే వలసలు ఆగాలి కదా? రోజురోజుకు అంతర్గత, అంతర్జాతీయ వలసలు పెరగటం దేనికి సంకేతం? కనీసం తాగునీరు కూడా దిక్కులేని ఆవాసాలు నేటికీ అనేక రాష్ర్టాల్లో కనిపిస్తుండటం విచారకరం. ఇప్పటికీ గిరిజనులు డోలీలను ఆధారం చేసుకొని ప్రయాణిస్తున్నారు. విద్యుత్తు సరఫరాకు నోచుకోక లక్షల ఇండ్లు అంధకారంలోనే మగ్గుతున్నాయి. ఆకలి సూచీలో మన స్థానం ఏంటో అందరికీ తెలుసు. నిత్యావసర సరుకులు, డీజిల్, పెట్రోల్ ధరలు ఎలా మండుతున్నాయో.. ఆ మంటల్లో మన వేతనాలు ఎలా కరిగిపోతున్నాయో పాలకులకు తెలియడం లేదా? కేవలం సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు రికార్డు స్థాయిలో రాణించడం, ప్రతీ నెలా రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదైతే దేశం అభివృద్ధి చెందినట్టా? ‘మేడిపండు చూడ మేలిమై ఉండు’ అన్నట్టు ఉంది మన దేశ ఆర్థిక పరిస్థితి. పేద, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయో ఇకనైనా పాలకులు గ్రహించాలి. ప్రభుత్వ అనుకూల సంస్థల లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న అంతరాన్ని తెలుసుకోవాలి.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనూ వ్యవసాయ రంగానికి తక్కువ నిధులు కేటాయించారు. రాయితీలపై కోత విధించారు. ఉన్నత విద్యా రంగానికి కేటాయింపులు అంతంతమాత్రమే. ప్రత్యేకించి యూజీసీకి 60 శాతం మేర నిధులు తగ్గించారు. నేటికీ మన దేశ ఆర్థికవ్యవస్థకు వెన్నెముక వ్యవసాయ రంగమే. అటువంటి రంగానికి నిధుల్లో కోత విధించడం ఆందోళనకరం. దేశ రాజధానిలో తమ న్యాయపరమైన హక్కుల కోసం రైతులు అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. వారి ప్రధాన డిమాండ్ అయిన కనీస మద్దతు ధరకు నేటికీ మోదీ సర్కార్ భరోసా ఇవ్వడం లేదు. దీన్నిబట్టే రైతులకు పాలకులు ఇస్తున్న ప్రాధాన్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికైనా రైతులు, దేశ ప్రజలు వాస్తవాలను గ్రహించాలి. సామాన్యులు, రైతులు, యువత ఆశయాలను నెరవేర్చే పార్టీలకు ప్రజలు అండగా నిలవాలి. ఓటును సద్వినియోగం చేసుకోవాలి. పేదరికం లేని భవిష్యత్తు భారత్ను నిర్మించే దిశగా అడుగులు వేయాలి. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడేవారికి అండదండలు అందించాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేవారి పక్షాన నిలబడాలి. అప్పుడే రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతిరూపంగా నవ భారత్ ఆవిష్కరిస్తుంది.