మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలపై ఒక కమిటీని వేసింది. బీజేపీ రెండవ విడత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ జమిలి ఎన్నికలపై సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పూర్వ ముఖ్య ఎన్నికల అధికారి హయాంలో జమిలి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. దాదాపు నెల కింద ఎన్నికల సంఘం తన వైఖరి మార్చుకొని జమిలి ఎన్నికలు సాధ్యం కావని, ఆ ప్రతిపాదనను విరమించుకుంటున్నట్టు ప్రకటించింది.
రాజ్యాంగం గురించి కొద్దిపాటి అవగాహన ఉన్నవారెవరైనా ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం జమిలి ఎన్నికలు సాధ్యం కావని చెప్పగలరు. అయినా నాలుగేండ్లుగా ఇటు ప్రభుత్వం, అటు ఎన్నికల సంఘం రెండు కూడా చాలా తెలివిగా ముసాయిదా విధానం ప్రకటించకుండా కేవలం జమిలి ఎన్నికలు చర్చించవలసిన అంశం అనే సంకేతాలు వదులుతూ వస్తున్నారు.
ఇన్నాళ్లు ఏ ఆలోచన లేకుండా ఇప్పుడు ఎన్నికల ముందర హడావుడిగా కమిటీ ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కాదు. రాజ్యాంగ నిపుణులకే కాదు రాజకీయ పార్టీలకూ కూడా ఈ వ్యవహారం సందేహాస్పదంగానే ఉన్నది.
మోదీ అన్నట్టుగా ప్రతి రెండు నెలలకొకసారి ఎన్నికలు రావడం, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడం, వనరుల వృథా నిజమే. ప్రస్తుతం ఒకేసారి అన్ని ప్రభుత్వాలను రద్దుచేసి (అసా ధ్యం అయినప్పటికీ) జమిలి ఎన్నికలకు వెళ్లినా, బీజేపీ భ్రమ ప్రకారం అన్నిచోట్లా సంకీర్ణ ప్రభుత్వాలు కాకుండా ఏక పార్టీ ప్రభుత్వాలు రావాలని ఏం లేదు. బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పక్షానికి సంపూర్ణ ఆధిక్యత రావడమ నేది కల్ల. విశ్వాసం కోల్పోయి ప్రభుత్వం కూలిపోతే మళ్లీ మధ్యంతర ఎన్నికలు తథ్యం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో జమిలి ఎన్నికలు జరిపినప్పటికీ కొద్ది కాలానికి మళ్లీ ప్రభుత్వాలు యథాస్థానానికి చేరుకుంటాయి. మరి జమిలి ఎన్నికల వల్ల ప్రయోజనమేమిటి? ప్రభు త్వం పరిపాలన కాలంలో మధ్యలో విశ్వాసం కోల్పోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధాన విశిష్టత. అది ప్రజల అభిప్రాయానికి సూచిక. బలహీనత మాత్రం కాదు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థ నుంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. శాసనవ్యవస్థ నేరుగా ప్రజల ద్వారా ఎన్నుకోబడినందున అది చట్టబద్ధత కలిగి ఉంటుంది. కాబట్టి శాసన వ్యవస్థ ఐదేండ్లు అధికారంలో ఉంటుంది. ప్రభుత్వాలు శాసనవ్యవస్థ నుంచి ఏర్పడి వాటి విశ్వాసం ఉన్నంతకాలం మాత్రమే అధికారంలో ఉంటాయి. లేనప్పుడు అదే సభ నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది.
లేనిపక్షంలో ఏకంగా శాసనసభ రద్దవుతుంది. అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నేరుగా ప్రజల నుంచి ఎన్నుకోబడుతుంది. అధ్యక్ష ప్రజాస్వామ్యంలో చట్టబద్ధత అన్నది నేరుగా ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి శాసనసభ విశ్వాసంతో పనిలేకుండా ప్రభుత్వం పూర్తిగా ఐదేండ్ల కాలం పదవిలో ఉంటుంది. అది పార్లమెంటరీ వ్యవస్థ లో సాధ్యం కాదు.
మన దేశం విభిన్న జాతుల కలయిక. దేశం లో ఒక వ్యక్తికి కాకుండా విభిన్న వర్గాల నుంచి ఏర్పడినటువంటి శాసనవ్యవస్థకు మన రాజ్యాం గ నిర్మాతలు చట్టబద్ధత కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం కాకుండా పార్లమెంటు ప్రజాస్వామ్యా న్ని ఎంచుకున్నది. ఎంత నియంతలైనప్పటికీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థ విస్తృత పరిమితులకు లోబడే పని చేయాల్సి ఉంటుంది. మూలాధికారం ఒక వ్యక్తికి కాకుం డా విభిన్న వర్గాల కలయిక, సామూహిక జ్ఞానం కలిగిన శాసన వ్యవస్థకు ఇచ్చాం. తద్వారా దేశంలో ఐక్యత, సమగ్రతను పెంపొందించేలా రాజ్యంగాన్ని పొందుపరుచుకున్నాం. రాజ్యాంగమంతా పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఫ్రేంవర్క్లో రచించబడింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మన రాజ్యాంగ మూల స్వభావం కంటే ఎక్కువ. ఇప్పుడు చర్చిస్తున్నట్టు ఐదు రాజ్యాంగ సవరణలు సరిపోవు. నేరుగా ప్రజా మద్దతు ఉన్న ప్రభుత్వానికి శాసనవ్యవస్థపై వీటో అధికారాలను నిర్వచించవలసి వస్తుంది. అది సాధ్యమయ్యే అవకాశాలు లేవు.
బిల్లుల ఆమోద ప్రక్రియ మొత్తం కూడా అధ్యక్ష పరిపాలన సిద్ధాంతాలకు అనుగుణంగా నిర్వచించాలి. లేదంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న ఘర్షణ రేపు ముక్కోణపు ఘర్షణలకు దారి తీయవచ్చు. న్యాయంగా, సమగ్రంగా చేయాలంటే రాజ్యాంగ సవరణ కూడా పనికిరాదు మొత్తం రాజ్యాంగాన్నే మార్చాల్సి ఉంటుంది.
అలా కాకుండా కేవలం ఇప్పుడున్న ఏర్పాట్లతో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే మధ్యలో ప్రజా విశ్వా సం కోల్పోయిన ప్రభుత్వానికి అధికారం ఉంచ టం అసాధ్యం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరు ద్ధం. కానీ ఈ పేరుతో మిగిలిన కాలానికి గవర్నర్ పాలన సాగించడం అనే కుట్ర దాగి ఉన్నది. అంటే రాజభక్తి ప్రదర్శించే మన వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని వంద అడుగుల లోతులో పాతిపెట్టడంతో సమానం. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించడమే.
జమిలి ఎన్నికలు విజయవంతానికి అధ్యక్ష ప్రజాస్వామ్యమొక్కటే మార్గం. అలా అయితేనే ఐదేండ్ల పాటు ప్రభుత్వం అధికారంలో ఉండగల దు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లో ఇది ఆసాధ్యం.
అయితే దీనికి మేలైన ప్రత్యామ్నాయం కూడా ఉన్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పనిచేస్తూనే కనీస రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేకుండా క్రమబద్ధంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం మనకున్నది. అదెలాగంటే మన రాజ్యాంగం ప్రకారం ఏదైనా ఖాళీ స్థానానికి విధిగా ఆరు నెలల సమయంలో ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుం ది. ఇది రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు. కాబట్టి మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు నిర్వహించకుండా ఏడాదిలో రెండుసార్లు మాత్రమే నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
రెండు రోజులు నేషనల్ ఎలక్షన్స్ డేస్గా ప్రకటించి దేశం మొత్తం అన్నిరకాల ఎన్నికలను నిర్ది ష్ట తేదీల్లో నిర్వహించాలి. ఆ నెల మొదటి వారం లో దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ ఇచ్చి, నామినేషన్లను స్వీకరించాలి. పది రోజులపాటు ప్రచారా నికి సమయం ఇవ్వాలి. తర్వాత రెండవ శనివా రం, ఆదివారం ఎన్నికలు నిర్వహించి నాలుగో ఆదివారం ఫలితాలు విడుదల చేయాలి. అలా చేస్తే 52 వారాలు ఉన్నటువంటి ఎన్నికల హడావుడి తగ్గి దాదాపు ఆరు వారాల్లో ఎన్నికలు ము గుస్తాయి. తద్వారా మనం ప్రభుత్వ పనిదినాల ను, ప్రభుత్వ వనరులను ఆదా చేసిన వాళ్లమవు తాం. మధ్యలో ఎవరైనా సభ్యుడు మరణిస్తే ఆరునెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం కూలిపోయినా ఆరునెలల్లో ఎన్నికలు జరిగి, రెండు నెలల్లో ప్రభుత్వం ఏర్పడుతుంది. దీంతో గవర్నర్ పాలన నిరోధించవచ్చు.
దీనికోసం జమిలి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ పద్ధతి కేవలం ప్రభుత్వం చెబుతు న్న వనరుల దుర్వియోగం, నిరంతర ఎన్నికల కోడ్, డబ్బు ఆదా కోసం ఉద్దేశించినయితే ఇంత సులువైన ప్రత్యామ్నాయం దగ్గర ఉంచుకొని ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన చేయకపోవటం విడ్డూ రం. ఈ విధానం వల్ల ఒకేసారి ఎన్నికలు జరిగి దేశమంతా ఏక కాలంలో ప్రభుత్వాలు కొలువుతీరే అవకాశం ఉన్నది. కాబట్టి ఎన్నికల విధానం జోలికి పోకుండా కేవలం ఎన్నికల వ్యయం ,సమయం, వనరులు ఆదా పైన దృష్టి పెట్టి వాటిని పరిష్కరిస్తే సరిపోతుంది.
మన దేశం విభిన్న జాతుల కలయిక. దేశంలో ఒక వ్యక్తికి కాకుండా విభిన్న వర్గాల నుంచి ఏర్పడినటువంటి శాసన వ్యవస్థకు మన రాజ్యాంగ నిర్మాతలు చట్టబద్ధత కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం కాకుండా పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్నది. ఎంత నియంతలైనప్పటికీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థ పరిమితులకు లోబడే పని చేయాల్సి ఉంటుంది.
– వంశీకృష్ణ జోషి 99494 30918