విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నతాధికారుల మెప్పు పొందిన అధికారి భద్రాద్రిజిల్లా చండ్రుగొండ ఫారెస్ట్ అధికారి చలమల శ్రీనివాసరావు. అడవిని నరికి పోడు వ్యవసాయం చేయడాన్ని అడ్డుకొన్నందుకు ఆయనను గుత్తికోయలు హత్య చేయడం అత్యంత దారుణం. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విధులు నిర్వహిస్తున్న ఒక అధికారిని నరికి చంపడం అన్ని శాఖల ప్రభుత్వ అధికారులను కలచివేసింది.
ఫారెస్ట్ అధికారులు, గుత్తికోయల ఘర్ష ణకు చండ్రగుంట మండలం బెండలపాడు రక్తసిక్తమైంది. ఎర్రబొడు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు నాటిన మొక్కలను తొలగించేందుకు స్థానిక గిరిజనులైన గుత్తికోయ లు గతంలో పలుమార్లు ప్రయత్నించారు. తాజా గా తిరిగి ఆ మొక్కలను తొలగించేందుకు యత్ని ంచారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాసరావుతోపాటు అధికారులు అక్కడికి వెళ్లి అడ్డుకొన్నారు.ఈ క్రమంలో గుత్తికోయలు కత్తులతో దాడి చేయడంతో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలారు.
ప్రభుత్వ,అటవీ భూములు కాపాడుతూ విధి నిర్వహణలో రాజీ పడకుండా,ఎన్నో అవార్డులు అందుకున్న ఘనత శ్రీనివాసరావుది. అలాంటి నిఖార్సయిన అధికారి హత్యతో అటవీ శాఖ ఉద్యోగుల్లో ఒకింత భయం నెలకొన్నది. తమ ప్రాణాలను అడ్డుపెట్టి అటవీ భూములను రక్షిస్తున్న అధికారుల్లో ఈ చర్య ఒక రకంగా ఆందోళన కలిగించే అంశమే. పోడు సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు ప్రయత్నిస్తుండగా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఇరువర్గాలకు ఇబ్బందికరమే.
తమ వ్యక్తిగత భద్రతకోసం ఆయుధాలు ఇవ్వాలని అటవీశాఖ అధికారులు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలను అడుగుతున్నారు. అయితే అడవుల్లో ఉండే గుత్తికోయలు, ఇతర గిరిజన తెగలు, అడవిజంతువుల సంరక్షణను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఆ ప్రయత్నాల ను విరమించుకున్నా యి. దీంతో అటవీ అధికారులు అడవుల్లో క్రూ రమృగాలతో పాటు గిరిజనజాతుల నుంచి ప్రమాదాలను ఎదుర్కొ ంటున్నారు. ఈ పోడు సమస్య గిరిజనులకు జీవన పోరాటంగా, అటవీ శాఖాధికారులకు కర్తవ్య నిర్వహణ అంశ ంగా మారింది. గత కొన్నేండ్లుగా ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాలుస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాల మంజూరు ప్రక్రియ చేపట్టింది. ఈ సమయంలో స్థానిక గిరిజనుల కంటే ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గుత్తికోయలు తమకే అటవీభూములు దక్కాలన్న పట్టుదలతో ఉన్నారు. వీరితోనే అధికారులకు ప్రమాదం పొంచి ఉన్నదని తెలుస్తున్నది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 150 కి పైగా గుత్తి కోయల గ్రామాలున్నాయి. 30 వేల మంది గిరిజనులు అనేక ఏండ్లుగా అడవుల్లో నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. వీరు చర్ల, మణుగూరు, బూర్గంపాడు, పాల్వంచ, ములకల పల్లి, చండ్రుగొండ, వాజేడు, వెంకటాపూర్, పినపాక, టేకులపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో ఇం డ్లు నిర్మించుకొన్నారు. అడవులను నరికి వేలాది ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. పోడు వ్యవసాయం వల్ల అటవీ అధికారుల నుం చి వీరిపై ఒత్తిడి పెరుగుతూ వస్తున్నది. మరోవైపు తమకు పట్టాలు వస్తాయో రావో అనే అనుమానం కూడా వారిలో నెలకొన్నది. ఆ కోపాన్ని అధికారులపై చూపిస్తున్నారని స్థానిక అధికారులు అంటున్నారు.
ఈ ఏడాది మంచిర్యాల, సిరిసిల్ల, నల్గొండ, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలలో కూడా పోడు సమస్యపైనే అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య రగడ జరిగింది. ప్రతి ఏడాది పోడు వ్యవసాయం ప్రారంభమయ్యే సమయంలోనే ఈ వివాదం చోటు చేసుకుంటున్నది. దీని పరిష్కారానికి ఓ వైపు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ సమయంలో అటవీ అధికారులు, గిరిజన తెగలు సంయమనం పాటించి సమస్య పరిష్కారానికి సహకరించాలి. శ్రీనివాస రావు మృతితో అటవీ అధికారులు మనో నిబ్బరం కోల్పోవద్దు.వారి ఆత్మకి శాంతి కలగాలని అందరం కోరుకుందాం.
కామిడి సతీశ్ రెడ్డి
98484 45134