అవయవదానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 13వ తేదీని ప్రపంచ అవయవదాన దినోత్సవంగా జరుపుకుంటారు. అవయవాలను దానం చేయమని ప్రజలను ప్రోత్సహించడానికి ఏటా ఈ రోజును అవయవదాన దినంగా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో అవయవ వైఫల్యం ఒకటి.
ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి గుండె, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చేతులు, ముఖం, కణజాలం, ఎముక మజ్జ, మూలకణాలను దానం చేయడం ద్వారా 8 మంది ప్రాణాలను కా పాడవచ్చు. అవయవాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ఎవరైనా అవయవ దానం కోసం తమను తాము నమోదు చేసుకోవచ్చు. మరణించినవారి కండ్లను తక్కువ సమయంలో సేకరించడం ద్వారా మరొకరికి అమర్చడానికి అవకాశం ఉన్నది.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. తన పుట్టుకకు కారకులైన తల్లిదండ్రులను, తోబుట్టువులను, హితులను, సన్నిహితులను, పచ్చటి ప్రకృతిని, ప్రకృతిలోని వింతలను, అందాలను చూసుకోలేని స్థితి బహుదుర్భరం. అటువంటిది-ప్రపంచంలోని 195 దేశాల్లో సుమారు నాలుగున్నర కోట్లమంది అంధులే. మన దేశానికి ప్రతి ఏడాదికి సుమా రు మూడు లక్షల మంది నేత్ర దాతల అవసరమున్నది. కానీ అతికష్టం మీద యాభై వేల మంది మాత్రమే లభిస్తున్నారు. మరణాల సంఖ్య అధికంగా నమోదవుతున్నా, అవయవదానం చేసేవారి సంఖ్య ఆ స్థాయిలో ఉండటం లేదు. వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు గల సాంప్రదాయపు ఆలోచనలు, ఆచారాలు, కట్టుబాట్లు, అవగాహనాలోపం తదితర కారణాల వల్ల నేత్రదానం చేయడానికి అందరూ అంగీకరించకపోవడం వల్ల పవిత్రమైన అవయవదాన ప్రక్రియకు అవాంతరాలు ఎదురవుతున్నాయి.
ప్రతి ఏడాది మాదిరిగానే, ఈ ఏడాది కూ డా అవయవ దాన ఆవశ్యకతను గురించి గుర్తింపు పొందిన ప్రైవేట్, ప్రభుత్వ దవాఖానలు, నోటో (National Organ and Tissue Transplant Organization) వంటి ప్రభుత్వ సంస్థలు, మోహన్ ఫౌండేషన్వంటి ఎన్జీవోలు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రకటనల రూపంలోనూ, ఆర్టికల్స్ రూపంలోనూ గుర్తుచేయడం పరిపాటి. ఇటువంటి అవగాహన కార్యక్రమాలకు ఎంతో కొంతమంది ప్రభావితులై, నేత్రదాన లేదా సంపూర్ణ అవయవ దానానికి ముందుకు వస్తున్నారు. పలు రంగాల ప్రముఖులతో పాటు సామాజిక అవగాహన ఉన్నవారు అవయవదానం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
అవయవ దానం జీవించి ఉన్న దాత నుం చి లేదా బ్రెయిన్ డెడ్ అయిన దాత నుంచి జరగవచ్చు. బ్రెయిన్ డెత్ అనేది రోడ్డు ప్రమాదా ల్లో తలకు గాయం కావడం వల్ల లేదా మరే కా రణం చేతనైనా మెదడులో రక్తనాళం చిట్లడం వల్ల సంభవిస్తుంది. శాశ్వతంగా మెదడు పని చేయకపోవడాన్ని బ్రెయిన్డెత్గా నిర్ధారిస్తారు.
మనందరికీ తెలిసినట్టుగా, మెదడు మొత్తం శరీరానికి నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది. కాబట్టి మెదడు సరిగ్గా పనిచేయకపోతే మొత్తం శరీరం పనిచేయకుండా పోతుంది. కొన్ని వైద్య పరీక్షల ద్వారా, మెదడు మరణాన్ని నిర్ధారించవచ్చు. రోగి మెదడు అప్పటికే మరణించినట్టు చట్టపరమైన ప్రకటన ఉంటే అవయవ మార్పిడి ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తారు.
అవయవ దానం మానవ శరీర పరిశోధన కు ఉపకరిస్తుంది. వైద్య విద్యార్థులకు శరీరం లోని అవయవాల పని తీరుపై అవగాహన కల్పిస్తారు. వైద్యశాస్త్ర అభివృద్ధికి ఉపకరిస్తుం ది. అవయవ దానం ద్వారా కొత్త జీవితం లభిస్తుంది. అవయవ దానం రెండు రూపాలను కలిగి ఉంటుంది. దాత జీవించి ఉన్నప్పుడు ప్రత్యక్ష దానం (కిడ్నీ, ఊపిరితిత్తులు), మర ణం తర్వాత శవ దానం లేదా శరీర భాగాలు దానం చేయవచ్చు. ఏదైనా అవయవ సంబంధిత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి అవసరమైన అవయవ దానం చేయడం వల్ల వారికి కొత్త జీవితాన్ని ఇచ్చినట్టవుతుంది. అవయవాలను దానం చేయడం కంటే పెద్ద దానం మరొకటి లేదు. అవయవాలను దానం చేయ డం వల్ల ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చు.
అవయవ దానం అవశ్యకత ను దాని ప్రాముఖ్యతను విరివి గా ప్రచారం చేయాల్సిన అవస రం ఉన్నది. దాతగా మారాలనే నిర్ణయం ఎనిమిది మంది జీవితాలను కాపాడుతుంది. అవయవ దానం చేయడం వల్ల ఇతరులకు ఆనందాన్ని, చిరునవ్వులను అందించవచ్చు. కేవలం ఒక అవయవాన్ని దానం చేయ డం ద్వారా మరణించిన వారు సైతం శాశ్వతంగా జీవించవచ్చు.
అవయవదానం చేసినవారికి ప్రత్యేక రా యితీలు కల్పించడం ద్వారా అవయవదానానికి మరింత మందిని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. అవయవదానానికి అంగీకరించిన వారికి ప్రైవేట్ దవాఖానల్లో పొందిన సేవల ఫీజుల్లో కనీసపు రాయితీ ఇవ్వాలి. దాత మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ సౌక ర్యం కల్పించాలి.
అవయవదానంపై అన్ని రంగాల వారికి మ రింత అవగాహన కల్పించాలి. మరణించిన వారి పార్థివదేహాలను వైద్య కళాశాలలకు అందించేలా అం దర్నీ ప్రోత్సహించాలి. దానివల్ల వైద్య పరిశోధనలకు స హకరించినవారమవుతాం.
అవయవదానం చేయడం ద్వారా 8మందికి కొత్త జీవితా న్ని ఇచ్చిన వారమవుతా ము. లేదంటే ప్రాణాలను విడిచిన శరీరాలు నిరుపయోగంగా మట్టిలో కలిసిపోతాయి.
అవయవదానంపై అన్ని రంగాల వారికి మరింత అవగాహన కల్పించాలి. మరణించిన వారి పార్థివదేహాలను వైద్య కళాశాలలకు అందించేలా ప్రోత్సహించాలి. దానివల్ల వైద్య పరిశోధనలకు సహకరించినవారం
అవుతాము. అవయవ దానం చేయడం ద్వారా ఎనిమిదిమందికి కొత్త జీవితాన్ని ఇచ్చిన వారమవుతాము.
(ఆగస్టు 13న ప్రపంచ అవయవదాన దినోత్సవం)