పరువుదేముంది? పోతే పోయింది… కానీ ఇంటింటికీ తన పేరు తెలిసిందని బీజేపీ పరివార్ నేత బీఎల్ సంతోష్ మహా సంబురపడిపోతున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుకు ముందు తన పేరు ఎవరికి తెలియదు, దాని తర్వాతనే అందరికి తెలిసిందని అన్నారు. బీఎల్ సంతోష్ కర్ణాటక వాడైనప్పటికీ, అక్కడ కూడా ఆయన గురించి ఎవరికి తెలియదట. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు తర్వాతనే మూడేండ్ల కిందట తన ప్రభుత్వాన్ని కూల్చింది కూడా ఇదే సంతోష్ అని తాజాగా కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి వాపోయారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీఎల్ సంతోష్ ఉన్నారా? లేదా? అనే అనుమానం అవసరం లేదు. హైదరాబాద్కు వచ్చి ఆయన పార్టీ ఫిరాయింపుల కమిటీతో సమావేశం కావడంతోనే ఫిరాయింపుల సెల్కు జాతీయ ఇంచార్జీగా తేలిపోయిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కొత్త లాజిక్ లేవదీశారు.