హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలో జరగబోయే ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎక్కడచూసినా హుజూరాబాద్ రాజకీయాలే మాట్లాడుకుంటున్నారు. అయితే రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నంలో నిమగ్నమైనాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా బహుజన బిడ్డ, ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించింది.
తెలంగాణ ఉద్యమంలో గెల్లు శ్రీనివాస్ చురుకుగా పాల్గొన్నారు. ఆయనపై వందకుపైగా కేసులు నమోదయ్యాయి. అనేకసార్లు పోలీసులు అరెస్టు చేశారు. చర్లపల్లి, చంచల్గూడ సెంట్రల్ జైళ్లలో 36 రోజులు జైలు జీవితం గడిపారు.
గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో పాలొ ్గన్నారు. డిగ్రీ చదువుతున్న కాలం నుంచే విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. హైదరాబాద్ అంబర్పేట్లోని ప్రభుత్వ బీసీ హాస్టల్లో ఉంటూనే విద్యార్థుల సమస్యలపై పోరాడారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమానికి, ఆయ న ప్రసంగాలకు ఆకర్షితుడయ్యారు. నాటినుంచి నేటివరకు అదే ఉత్సాహంతో టీఆర్ఎస్ పార్టీలో నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తున్నారు.
2003-06లో హైదరాబాద్లోని ఏవీ కాలేజీ టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విద్యార్థుల ఫీజు పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపి అరెస్టయ్యారు. చివరికి కాలేజీ యాజమాన్యం ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ సాధించడంలో విజయం సాధించారు. 2003-04 సంవత్సరంలో బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇందిరాపార్కులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ శాతాన్ని పెంచాలని ఆర్థిక మంత్రి రోశయ్య ఇల్లు ముట్టడికి ధర్నా నిర్వహించి అరెస్టయ్యారు. 2006 సెప్టెంబర్ 19న సోమాజిగూడ ప్రెస్క్లబ్లో లగడపాటి రాజగోపాల్కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు జరిపిన నిరసన ర్యాలీలో అరెస్టయ్యారు. 2006 సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికల్లో విద్యార్థి విభాగం ఇన్చార్జిగా హరీశ్రావు నాయకత్వంలో పనిచేశారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి(2008)గా ఎర్రోళ్ల శ్రీనివాస్ నాయకత్వంలో పనిచేశారు. 2009 సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేశారు. 2010, జనవరి 18న ‘తెలంగాణ విద్యార్థి మహా పాదయాత్ర’ ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి 650 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వేలమంది విద్యార్థులను, యువకులను తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేసిన ఘనత గెల్లు శ్రీనివాస్ది. 2010 హుజూరాబాద్ ఉప ఎన్నికలో స్టూడెంట్ ఇన్చార్జిగా బస్సుయాత్ర (ప్రజా చైతన్య యాత్ర)లో పనిచేశారు. కేటీఆర్ నాయకత్వంలో 2011 మార్చి 1న మౌలాలి రైల్వేస్టేషన్లో 48 గంటల రైల్రోకో నిరసన కార్యక్రమాన్ని వందల మంది విద్యార్థులతో కలిసి విజయవంతం చేశారు.
2011, మార్చి 10న టీఆర్ఎస్వీ ఓయూ అధ్యక్షుడిగా టీజేఏసీ పిలుపు మేరకు ‘మిలియన్ మార్చ్’ కార్యక్రమంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 2011, జూలై 21న యాదిరెడ్డి ఆత్మహత్యకు నిరసనగా బంద్కు పిలుపునిచ్చి ఓయూ నుంచి తెలంగాణ భవన్కు ర్యాలీ నిర్వహించారు. సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడ జైల్లో బంధించారు. 2011 నవంబర్ 1న జరిగే ఏపీ అవతరణ దినోత్సవాన్ని నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి గన్పార్క్ దాకా ‘చలో గన్పార్క్’ కార్యక్రమానికి వందలాది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కేటీఆర్ నాయకత్వంలో 2011 నవంబర్ 16 నుంచి 22 వరకు జరిగిన వికారాబాద్, కుత్బుల్లాపూర్ చౌరస్తా పాదయాత్రలో పాల్గొన్నారు. 2012 సెప్టెంబర్ 30న ‘సాగర హారం ప్రోగ్రాం’కు వందలాది ఓయూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. 14 ఎఫ్ క్లాజ్ను తొలగించాలని ఓయూలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమాల్లో ఆరితేరిన వ్యక్తి గెల్లు శ్రీనివాస్ అయితే, అవినీతి ఆరోపణలతో టీఆర్ఎస్కు, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసిన వ్యక్తి ఈటల. ఇప్పుడు ప్రధానంగా వీరి మధ్యే పోటీ నడుస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన చరిత్ర హుజూరాబాద్ ప్రజలకు ఉన్నది. గెల్లు శ్రీనివాస్యాదవ్కే హుజూరాబాద్ ఓటర్లు పట్టం కడుతారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
(వ్యాసకర్త: జర్నలిస్టు)
కిరణ్ ఫిషర్