ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో పుట్టిన గొప్ప ఆలోచనే ‘దళిత బంధు’ పథకం. ఏండ్ల తరబడి సమాజంలో అట్టడుగున ఉన్న దళితులు వెనక్కి నెట్టివేయబడ్డారు. నేటికీ దళితుల పట్ల వివక్ష కొనసాగుతున్నది. దుఃఖాన్ని దిగమింగుకొని జీవితాలను నెట్టుకొస్తున్న తీరును గమనించిన కేసీఆర్ దళిత బంధు పథకానికి రూపమివ్వడం విశేషం.
దళితవర్గాల ఉన్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన ప్రణాళికలను స్వాగతించాల్సిన సమ యం ఇది. ఈ సందర్భంగా దళిత బంధు పథకాన్ని సమాజ బంధువు అని చెప్పాలిన అవసరం ఉన్నది. దళి త సాధికారతకు కనీస మద్దతులేనప్పుడు వారు అభివృద్ధి చెందడం అసంభవం. దళితుల దగ్గర డబ్బు లేదు, పలుకుబడి లేదు, పెట్టుబడి అంతకంటే లేదు. కాబట్టి ప్రభుత్వమే తనకుతానుగా ముందుకువచ్చి అర్హులైన దళిత కుటుంబాలకు రూ.10 లక్షల మూలధనాన్ని సమకూరుస్తామని నిర్ణయించడం ముదావహం.
‘దళిత బంధు’ పథకం ద్వారా దళితులు వ్యాపారవేత్తలుగా ఎదిగి, పలురంగాల్లో ఉపాధిని సృష్టించే అవకా శం ఉంటుంది. దళితుల అభివృద్ధి పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న దూరదృష్టిని మనం ఇక్కడ గమనించాలి. ఈ పథ కం అమల్లో లోపాలు లేకుండా విధివిధానాలను రూపొందిస్తామని, నిరంతర పర్యవేక్షణ, జాగరూకతతో అమలు పర్చేవిధంగా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించటం గమనార్హం.
ప్రభుత్వం ‘దళిత బంధు’ పేర ఇచ్చే మూలధనాన్ని ఎన్నో రంగాల్లో పెట్టుబడులుగా పెట్టొచ్చు. చిన్నతరహా పరిశ్రమలను సైతం నెలకొల్పవచ్చు. ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటుచేసి దళితులే యజమానులుగా మారితే వారి ఆర్థిక పురోభివృద్ధికి బాటలు పడుతాయి. దళితుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. వ్యాపారరంగంలో దళిత ప్రాతినిధ్యం పెరగటానికి దళితబంధు దోహదం చేయనున్నది. దళితులు గణనీయ ఆర్థిక పరిపుష్ఠి సాధించే అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధి సూచికల్లో కూడా గొప్ప మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. కొత్త వినియోగదారులు ఆర్థిక వ్యవస్థలోకి వస్తారు. ఆర్థికవ్యవస్థకు, దాని పురోగతికి ఊతమవుతారు. సమాజంలో ఉత్పత్తి ప్రక్రియ సజావుగా సాగి నిస్తేజం నుంచి ఉత్తేజం దిశగా నిలవనున్నారు.
మార్కెట్లో ఉండే మందగమనాన్ని తగ్గించాలంటే ఎప్పుడూ కొత్త ఉత్పత్తిదారులు, వినియోగదారులు వస్తూనే ఉండాలి. దీంతో నాణ్యమైన వస్తుసేవల ఉత్పత్తితో పాటు ఆ వస్తువులకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే సప్లయి ప్రక్రియ ముందుకు కదులుతుందో ఉత్పత్తి ప్రక్రియ నిరాటంకంగా సాగుతుంది. దళితులు ఉత్పత్తి, సేవల రంగాల్లోకి రావడమంటే ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసినట్టే. సమాజంలో కిందిస్థాయిలో ఉన్న దళితులు వినియోగ మార్కెట్లోకి ప్రవేశించనున్నారు. దీంతో వారి ఆదాయం పెరిగి తిరిగి పెట్టుబడిగా మలిచే వీలుంటుంది. అంటే దళిత బంధు పథకం వ్యవస్థలో కదలిక తీసుకువచ్చే మార్పుగా మారనుంది.
దళిత బంధు ద్వారా వచ్చే ఫలితాలు భావి ఆర్థికవ్యవస్థకు దిక్సూచిలా మారనున్నాయి. ఈ పథకం దళితుల ఆర్థిక ఉన్నతికి దోహదం చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. తమ ఓట్లు వాడుకొని, తమ అభివృద్ధిని పట్టించుకోని నాయకులను చూసిన దళిత సమాజం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో సంతోషంగా ఉన్న ది. దళితుల పట్ల ఆయనకు ఉన్న దార్శనికతకు ‘దళిత బంధు’ పథకం గొప్ప నిదర్శనమంటూ కీర్తిస్తున్నది.
సుంకర రమేశ్