తెలంగాణ నినాదాన్ని తలకెత్తుకోవటానికి ముందు కొన్ని నెలలపాటు తెలంగాణ తప్ప మరి దేనిగురించీ కేసీఆర్ ఆలోచించేవారు కాదు. మేధావులు, ఉద్యమకారులు, ప్రొఫెసర్లు, కళాకారులతో ఎడతెగని చర్చలు జరుపుతూ తెలంగాణకు సంబంధించిన సకల అంశాలనుఆకళింపు చేసుకొని రంగంలోకి దిగారు. ఆ తర్వాత కూడా ప్రజలను ఉద్యమంలోకి తీసుకురావటం దగ్గరి నుంచి రాజకీయ పార్టీల మద్దతు సమీకరించటం వరకూ, ప్రెస్మీట్ల నుంచి కళాబృందాల వరకూ ప్రతీ ఒక్కటీ అత్యంత పకడ్బందీగా వ్యూహ రచన చేస్తూ ముందుకు సాగారు. స్వరాష్ట్రమనే లక్ష్యాన్ని సాధించారు. ఇప్పుడు భారతదేశం దిశను మార్చే విషయంలో కూడా అదే కేసీఆర్ను చూస్తున్నాం.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణం చేసి అప్పటికింకా ఏడాది కూడా పూర్తికాలేదు. ప్రపంచబ్యాంకు సంస్కరణలలో భాగంగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలైతే తెలంగాణలో బోర్లు, బావుల కింద సాగుచేస్తున్న లక్షలాది మంది రైతుల వ్యవసాయం నిలిచిపోతుంది. చంద్రబాబు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆగస్టు 28న అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బారికేడ్లతో పోలీసులు బషీర్బాగ్ వద్ద వారిని అడ్డుకున్నారు. ఘర్షణ జరిగింది. ఆ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఈ సంఘటనలతో కలత చెందిన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ హోదాలో సెప్టెంబర్ 6న ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ‘విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే తెలంగాణ రైతుకు ఉన్న గోచీ కూడా ఊడిపోతది’ అని ఆ లేఖలో ప్రస్తావించారు.
కేసీఆర్ లేఖను పత్రికల్లో చదివిన తెలంగాణ ఉద్యమకారులు ఆయన్ని కలిసి ‘సమైక్య రాష్ట్రంలో తెలంగాణ బాగుపడలేదు. ప్రత్యేక రాష్ట్రంలోనే ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. రాష్ట్ర సాధనోద్యమానికి మీ నాయకత్వం కావాల’ని కోరినారు. ఆనాటి నుంచి సుమారు 8 నెలల కాలం కేసీఆర్ తెలంగాణ గురించి తప్ప దేని గురించి ఆలోచించలేదు. డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తూనే మిగిలిన సమయమంతా మాతో తెలంగాణలో నెలకొన్న దుర్భర పరిస్థితులు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యలు, సాగునీటి రంగ దుస్థితి వంటి అంశాలపై చర్చించేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ వ్యూహాన్ని అనుసరించాలి? నాయకత్వం పట్ల ప్రజల్లో ఉన్న అపనమ్మకాలను పోగొట్టాలంటే ఉద్యమ ప్రారంభం ఎలా ఉండాలి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రంగాన్ని ఎలా పునర్నిర్మించాలి? తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం పట్ల ఏయే రాజకీయ పార్టీల దృక్పథం ఎలా ఉంటుంది? భావజాల వ్యాప్తి, జన సమీకరణ ఎలా చేయాలి? రాజకీయ పార్టీని బలోపేతం చేయడానికి, అంతిమంగా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టడానికి, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల మద్దతును పొందడానికి అనుసరించవలసిన వ్యూహం ఏమిటి? ఇలాటి అంశాల పట్ల స్పష్టత కోసం రాత్రింబవళ్లు ఎంతోమంది మేధావులతో, ఉద్యమకారులతో చర్చించేవారు కేసీఆర్.
కేసీఆర్ ఆలోచనా సరళి గురించి ప్రొఫెసర్ జయశంకర్ మాట్లాడుతూ.. ‘నేను కె.వి.రంగారెడ్డి నుంచి ఇంద్రారెడ్డి వరకు ఎంతోమంది నేతలతో తెలంగాణ గురించి చర్చించాను. కేసీఆర్ లాగ ఒక్కో అంశం మీద ఇంత లోతుగా, సీరియస్గా అధ్యయనాన్ని ఎవరూ చేయలేదు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధిస్తామనే నమ్మకం సంపూర్ణంగా ఏర్పడింది’ అని అన్నారు.
మొన్నటి ప్లీనరీలో కేసీఆర్ భారతదేశవ్యాప్తంగా ఉన్న భూమి, జల వనరులు, విద్యుత్తు, వ్యవసాయం, నిరుద్యోగం, జీడీపీ, స్వాతంత్య్రానంతరం దేశాన్ని పాలించిన పార్టీల విధానాలు.. మొదలైన అంశాలపై గణాంకాల సహితంగా వివరిస్తున్నప్పుడు తెలంగాణ కోసం ఎంతైతే లోతైన అధ్యయనం చేశారో దేశ పరిస్థితుల గురించి కూడా అంతే సీరియస్గా ఆలోచిస్తున్నారని ఆయనతో సన్నిహితంగా గడిపిన నాలాంటి వాళ్ళకు సులభంగానే అర్థమైంది.
జలదృశ్యంలో 2001లో కేసీఆర్ చేసిన తొలి ప్రసంగం నుంచి మొన్నటి 21వ ప్లీనరీ ప్రసంగం దాకా దాదాపు అన్ని ఉపన్యాసాలను నేను విన్నాను. ప్లీనరీలో కేసీఆర్ భారతదేశం గురించి చేసిన ప్రసంగం.. 2001 మే 17న సింహగర్జన సభలో ఆవేశాన్ని అణచుకుంటూ ఎంతో నిబ్బరంగా తెలంగాణ గురించి చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసింది.
తెలంగాణ దుస్థితికి సమైక్య పాలకుల వివక్ష కారణమని నాడు చాటిచెబితే.. ‘దేశ దుస్థితికి ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్, భాజపాలకు విజన్ లేకపోవడమే కారణం’ అని ఇప్పుడు చెప్పారు. తెలంగాణ వనరుల గురించి ఒక్కో అంశాన్ని సింహగర్జన సభలో గణాంకాలతో సహా ఎలా ప్రస్తావించారో.. ఈ దేశంలో అందుబాటులో ఉన్న స్థాపిత విద్యుత్శక్తి సామర్థ్యం, అందుబాటులో ఉన్న వ్యవసాయ భూములు, జలవనరులు, వాటిని వినియోగిస్తున్న తీరు గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. ఆనాటి సింహగర్జన సభలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలా దిశానిర్దేశం చేశారో.. మొన్నటి ప్లీనరీ ఉపన్యాసంలో దేశ ప్రజల భవిష్యత్తుకు మార్గదర్శనం చేశారు.
క్షణకాలం కూడా దృష్టి మరల్చకుండా నిశితంగా కేసీఆర్ ముఖకవళికలను పరిశీలిస్తూ ప్రసంగం మొత్తాన్ని విన్న నాకు వెంటనే అన్పించింది ఏమంటే.. కేసీఆర్ దేశ గతిని మార్చడానికి కచ్చితమైన నిర్ణయం తీసుకొని, అన్నివిధాలా, సిద్ధపడి, పక్కాప్రణాళికతో ముందుకు సాగుతున్నారని!
కేసీఆర్ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే గమ్యాన్ని చేరుకునేదాకా వెనక్కి తగ్గరు. ఇంతటి మొండితనాన్ని మనం జాతిపిత మహాత్మాగాంధీలో చూడగలం. విదేశీ పాలకుల నుంచి సానుకూల ప్రకటన వచ్చేదాకా ఆమరణ దీక్షలను గాంధీజీ ఎలా కొనసాగించేవారో.. కేసీఆర్ 2009 చివర్లో అలాగే తన దీక్షను తెలంగాణ ప్రకటన వచ్చేదాకా విరమించలేదు. మహత్తర లక్ష్యాలను సాధించాలంటే ఇంతటి మొండితనం అవసరమే.
కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించిన ‘ప్రాసెస్’లో అనేక అంశాలుంటాయి. తెలంగాణ ఉద్యమకాలంలో రాష్ట్ర సాధన కోసం ఆయన నిర్వహించిన ప్రక్రియలో ఒక్కోరంగంపై స్పష్టమైన అవగాహన, విజన్ కలిగి ఉండేవారు. ఒక్కో వర్గపు ప్రజలను ఎలా ఎప్పుడు ఉద్యమంలోకి తీసుకురావాలో స్పష్టతను ఏర్పర్చుకునేవారు. చిన్నా పెద్ద సభలలో, మీడియా సమావేశాలలో ఉపయోగించవలసిన భాష, సామెతలు, మేధావులను ఆకట్టుకోగల ప్రత్యేక ప్రసంగాలు ఆయన చేసేవారు. ప్రజలను ఆకర్షించగల కళారూపాలు, పాటలు, వివిధ సాహితీ ప్రక్రియలు రూపొందించేవారు. ప్రతి ఎత్తుగడ, ప్రతి సభ విజయవంతమయ్యేలా ఆయన ఆచరణ పకడ్బందీగా ఉంటది. వివిధ పార్టీల, నాయకుల బలాలు, బలహీనతలపైన స్పష్టత, ఏ రాజకీయ పక్షాన్ని ఎప్పుడు ఏ అవసరం కోసం కలుపుకోవాలో, ఎప్పుడు ఎందుకు వదులుకోవాలో ముందే అవగాహనను కేసీఆర్ ఏర్పర్చుకునేవారు. ఉద్యమానికి, పార్టీ నిర్వహణకు అవసరమైన నిధులను, బలగాలను సమకూర్చుకునేవారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమంలో పేర్కొన్నట్లు ‘బొంతపురుగునైనా ముద్దు పెట్టుకుంటా’, ‘కుష్టురోగినైనా కౌగిలించుకుంటా’.. అంటూ ఉద్యమావసరాలకు తగ్గట్లుగా ఏ నినాదాన్ని ఎప్పుడివ్వాలో, ఎక్కడ తగ్గాలో తెలిసి అందుకు అనుగుణంగా ఎత్తుగడలు రూపొందించి అమలు చేసేవారు. ఇవన్నీ కేసీఆర్కు తెలిసినంతగా దేశంలో మరే రాజకీయ నాయకునికీ తెలియదంటే అతిశయోక్తి ఏ మాత్రం కాదు.
తెలంగాణ ఉద్యమంలోకి వచ్చేనాటికి కేసీఆర్ కేవలం మెదక్ జిల్లాకే పరిమితమైన నాయకుడు. ఈనాటి కేసీఆర్ ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రి. స్వాతంత్య్రానంతర భారతదేశంలో గాంధీయన్ పద్ధతిలో అహింసాత్మక ఉద్యమాన్ని నిర్వహించి విజయం సాధించిన గొప్పవ్యక్తి. కాళేశ్వరం, యాదగిరిగుట్ట వంటివి నిర్మించి ప్రపంచమే విస్తుపోయేలా చేసిన మహనీయుడు. తెలంగాణలో కేవలం ఏడేండ్లలో ఆకలిని, వలసలను, ఆత్మహత్యలను ఆపి బీళ్ళుగా మారిన యాభై లక్షల ఎకరాలకు పైగా భూముల్లోకి గోదావరి జలధారలను ప్రవహింపజేసి కోట్ల టన్నుల ధాన్యరాశులను సృష్టించిన గొప్ప పరిపాలనాదక్షుడు. దేశంలో బీజేపీ తర్వాత అత్యంత ఎక్కువ నిధులు, ఆస్తులు కలిగి ఉన్న పార్టీ టీఆర్ఎస్కు అధినేత. అరవై లక్షల మంది సైనికుల వంటి కార్యకర్తలు, రాష్ట్రంలో ఎనభై శాతం మంది ప్రజాప్రతినిధులను కలిగి వున్న గొప్ప సేనాని. కోట్లాది ప్రజల బతుకులు మార్చిన విధాత.
స్త్రీవాద ఉద్యమకారిణి, కవయిత్రి జయప్రభ అన్నట్లుగా భారతీయులంతా కేసీఆర్కు అండగా నిలవాలి. దేశ జనాభాలో 65 శాతానికి పైగా ఉన్న యువత మోదీపై భ్రమలు వీడుతూ ఈ దేశ దుస్థితిని ప్రశ్నిస్తున్నది. దేశంలో రాజకీయ శూన్యత నెలకొంది. సూర్యుని కోసం ఉదయం ఎదురుచూస్తున్నట్లు కేసీఆర్ వంటి మహానేత, దార్శనికుని కోసం ఈ దేశం ఎదురుచూస్తున్నది. యావత్ తెలంగాణ మన ప్రియతమ నేతకు బాసటగా నిలవాలి. దేశానికి దిశ చూపాలి. అది మనకెంతో గర్వకారణం!
(వ్యాసకర్త: టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు )
భారతదేశ స్వాతంత్య్రం కోసం 62 ఏండ్లు పోరాడి స్వాతంత్య్రానంతరం సుమారు యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉండి కూడా, దేశానికి దిశ చూపించడంలో ఘోరంగా విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్య్ర ఫలాలను ప్రజలకు అందించలేకపోయింది.
భారతదేశ జాతీయత గురించి, సంస్కృతి గురించి అంకితభావంతో పనిచేస్తున్నట్లు కనిపించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్థాపితమై 96 ఏండ్లు గడిచాయి. స్వాతంత్య్రానంతరం ఆర్ఎస్ఎస్ 1951లో భారతీయ జనసంఘ్ అనే పార్టీని స్థాపించి 1977లో జనతాపార్టీలో విలీనం చేసింది. 1980లో తిరిగి భారతీయ జనతా పార్టీ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పరిచింది. నేటి వరకు సుమారు 20 ఏండ్లపాటు సంకీర్ణ ప్రభుత్వాలకు, సొంత ప్రభుత్వాలకు మార్గదర్శనం చేసిన ఆర్ఎస్ఎస్ కూడా దేశానికో దిశ చూపలేకపోగా ప్రజలను ‘సంస్కృతి’ ముసుగులో మతోన్మాదం వైపు ప్రోత్సహిస్తున్నది. ఎన్నికల్లో గట్టెక్కడానికి పాకిస్థాన్ బూచి చూపి యుద్ధాలను, సర్జికల్ స్ట్రైక్లను సృష్టిస్తున్నది. అవినీతికి తావివ్వం అంటూనే జాతి సంపదలను అదానీలకు, అంబానీలకు అప్పగిస్తున్నది.
కాంగ్రెస్, బీజేపీల మద్దతు లేకుండా స్వతంత్ర భారతావనిలో ఒక్కరోజు కూడా పాలన సాగలేదు. ఈ రెండు జాతీయ పార్టీలకు సంబంధం లేని ప్రధానులు కేవలం రెండేండ్లు దేశాన్ని పాలించినా, ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ మద్దతు లేకుండా వారు ప్రధానులు కాలేకపోయారు. ఈ పార్టీల ప్రయోజనాలు కాపాడలేనందుకు ప్రధాని పదవులను వారు వదులుకోవలసి వచ్చింది. ఈ పార్టీలను పక్కనపెట్టకుండా దేశ దుస్థితిని మార్చలేం.
తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడుతూ ‘ఇప్పుడు కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదు. ఇప్పటికే చాలా వచ్చినయి. కానీ ఏం సాధించినయ్. కావాల్సింది రాజకీయ పునరేకీకరణలు కావు. ఇవాళ దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా. ఒక అద్భుతమైన దేశాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్లే ఎజెండా కావాలి. ఒక్క మాటలో చెప్పాల్నంటే.. చేయగలిగే సామర్థ్యం, సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగే అవకాశం, వసతులు, వనరులు కలిగి ఉన్నది నా భారతదేశం. ఏమీ లేక బాధపడితే వేరు కానీ, కలిగి ఉండీ కట కట పడుతున్నది. దుఃఖపడుతున్నది. దీనికి ఏదో నివారణ జరుగాలె. దీనికోసం ఇవాళ రాజకీయ ఫ్రంట్ ప్రకటిస్తమా? ఇంకోటి ప్రకటిస్తమా? అంటే ప్రాసెస్ జరుగుతది. తెలంగాణ కోసం మనం ఎట్లయితే ప్రాసెస్ చేసినమో? ఏ ప్రాసెస్ ద్వారా తెలంగాణ తెస్తమని నమ్మినమో? అట్లనే అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి కూడా ప్రాసెస్ జరగాలె’ అని స్పష్టం చేశారు.
ఈ ప్రాసెస్ ఏమిటో అర్థం చేసుకోవాలంటే తెలంగాణ కోసం జరిగిన ప్రాసెస్ నేటి తరానికి అర్థం కావాలె. తెలంగాణ ఉద్యమంలో, పార్టీ ఏర్పాటు కోసం జరిగిన ప్రక్రియలో మొదటి నుంచి ఆచార్య జయశంకర్, కేసీఆర్లతో పాల్గొనే అదృష్టం నాకు దక్కింది.
కేసీఆర్ ఆలోచనాసరళి గురించి ప్రొఫెసర్ జయశంకర్ మాట్లాడుతూ.. ‘నేను కె.వి.రంగారెడ్డి నుంచి ఇంద్రారెడ్డి వరకు ఎంతోమంది నేతలతో తెలంగాణ గురించి చర్చించాను. కేసీఆర్ లాగ ఒక్కో అంశం మీద ఇంత లోతుగా, సీరియస్గా అధ్యయనాన్ని ఎవరూ చేయలేదు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధిస్తామనే నమ్మకం సంపూర్ణంగా ఏర్పడింది’ అని అన్నారు.
వి.ప్రకాశ్