ఒకే ఒక్కడు…గులాబీ దళపతి. ఆయనే ఒక సైన్యం. రాజకీయ రణరంగంలో శత్రు శిబిరాన్ని మాటల తూటాలతో ఎదుర్కొంటూ రాకెట్లా దూసుకెళ్తున్న సైన్యాధిపతి. ఆయన ఒక నిఫా తుఫాన్..రాజకీయ వాయుగుండంలా..రోజుకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నారు. నిర్ధిష్టమైన, నిర్మాణాత్మకమైన రాజకీయ కార్యాచరణతో లక్ష్యాన్ని చేరుకోవాలని తలపోస్తున్నారు.
సీఎం కేసీఆర్ రోజుకు మూడు సభల్లో పాల్గొంటూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేలా ఉపన్యసిస్తూ సబ్బండ వర్గాలను ఆకర్షిస్తున్నారు. కొన్ని సభల్లో ఉద్వేగ భరితంగా ప్రసంగిస్తూ పార్టీ శ్రేణుల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. మరికొన్ని సభల్లో జోష్గా మాట్లాడు తూ ఊపు తెప్పిస్తున్నారు. అదే సందర్భంలో విపక్షాలపై నిప్పులవర్షం కురిపిస్తున్నారు. ఏ ప్రాంతం వెళ్ళినా ఏ నియోజక వర్గం దరిచేరినా.. ఏ జిల్లాలో ఆడుగు పెట్టినా పార్టీ శ్రేణులు, సామాన్య వర్గాలు ‘మీ అడుగులో అడుగేసి ప్రయాణిస్తాం, మీకే పట్టం కడుతా’మంటూ గులాబీ దళపతి కేసీఆర్కు భరోసా ఇస్తున్నా రు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల ప్రగతి ఫలాల గురించి ప్రజలకు వివరిస్తూనే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హమీలను కేసీఆర్ ఏకరవు పెడుతుండటంతో ఎత్తిన జెండా దించకుండా సభల్లో పాల్గొన్న జన వాహిని సమరోత్సాహంతో కేసీఆర్కు జేజేలు పలుకుతున్నది. ఏ సభ చూసినా వేలు, లక్షల్లో గులాబీ సైన్యం తరలి రావడం చూస్తే సంచలన విజయంతో హ్యాట్రిక్ సాధించే దశగా బీఆర్ఎస్ జగన్నాథ రథం ముందుకు సాగుతున్నది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజక వర్గం నుం చి కేసీఆర్ ప్రచార జైత్రయాత్రకు అంకురార్పణ చేశా రు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత టీఆర్ఎస్ 2014లో 66 స్థానాల్లో విజయభేరి మోగించి తొలిసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నది. 2018 లో వ్యూహత్మక రాజకీయ ఎత్తుగడతో ముందస్తూ ఎన్నికల గోదాలోకి దిగిన గులాబీ బాసు 88 సీట్లు సాధించి రెండవసారి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. కేసీఆర్కు రెండు ఎన్నికల్లోనూ హుస్నాబాద్ కలిసి రావడంతో మూడవసారి మళ్లీ సెంటిమెంట్ అయిన హుస్నాబాద్ గడ్డ నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తొలివిడత ఎన్నికల సభలన్నీ విజయవంతమయ్యాయి. ఏ సభలో ప్రసంగించినా కొత్త కొత్త విషయాలు, సంభాషణలు, సామెతలతో ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు.
సభలో కేసీఆర్ చెప్తున్న సామెతలు నవ్వుల పువ్వులు పూ యిస్తుండటంతో కార్యకర్తలు చప్ప ట్ల వర్షం కురిపిస్తున్నారు. కేసీఆర్ తనదైన విభిన్న శైలిలో ప్రసంగం ప్రా రంభించగానే జనం నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఏ ప్రాం తంలో సభ నిర్వహించినా స్వ చ్ఛందంగా గులాబీ జెండాను చేబూని జనం తండోపతండాలుగా తరలివస్తూ మీ వెంట ఉంటాం అంటూ కదం తొక్కి పదం పాడుతున్నారు.
ప్రస్తుతం అమలు చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, రైతు బీమా, దళిత బందు, అమ్మఒడి, కేసీఆర్కిట్టు, భరోసా, న్యూ ట్రిషన్, దివ్యాంగులకు, బీడీ కార్మికులకు పింఛన్లు, ముఖ్యమంత్రి సహాయనిధి వంటి పథకాలను ప్రతి సభలో కేసీఆర్ లెక్కల వారిగా వివరిస్తుండటంతో ప్రగతి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న ప్రదాత కేసీఆర్ అంటూ జెండాను రెప రెప లాడిస్తున్నారు.
తెలంగాణలోని 3 కోట్ల 50 లక్షల మంది జనాభాలో ప్రతి ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రగతి శీల పథకాలను అందుకుంటున్న విషయాన్ని కేసీఆర్ సభల్లో గుర్తు చేస్తుండటంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా అన్ని వర్గాల జనం మళ్ళీ మాకు ముఖ్యమంత్రి మీరే కావాలంటూ కేసీఆర్కు బాసటగా నిలుస్తున్నారు.
శాసనసభ ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే ఏయే సంక్షేమ పథకాలు అమలు చేస్తారో సభల్లో ప్రకటిస్తుండటంతో సబ్బండ వర్గాలు బ్రహ్మరథం పడుతున్నాయి. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ.400 లకే గ్యాస్ సిలెండర్, దివ్యాంగులకు రూ 6 వేల పింఛన్, ఎకరానికి 16 వేలు రైతుబంధు, ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లు రూ.2 వేల నుంచి దశల వారిగా రూ.5 వేలకు పెంపు, ఆరోగ్యశ్రీ పథకం రూ.15లక్షలకు పెంపు ఇలా కొత్తగా అమలు చేసే పథకాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ వివరిస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో ,ప్రజల్లో ఎనలేని ఉత్సాహం మనో ధైర్యం కనిపిస్తున్నది.
ప్రచార పర్వంలో కేసీఆర్ దూ సుకెళ్తుండటంతో విపక్షాల్లో వణుకుపుడుతున్నది. కేసీఆర్ రోజుకు మూడు, నాలుగు బహిరంగసభ ల్లో పాల్గొంటూ మాటల తూటా లు సంధిస్తుండటంతో ప్రధాన రా జకీయ పక్షాలు బెంబేలెత్తి పోతున్నాయి. ఎన్నికల నాటికి మరిన్ని సభల్లో పాల్గొననున్న కేసీఆర్ ఉ త్తేజభరిత ప్రసంగాలతో రాజకీయ తుఫాన్ సృష్టించనున్నారు.
– గుర్రం రాంమోహన్ రెడ్డి 79810 18644