మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఒక అవకాశం ఇవ్వాలని నేను ఓటర్లకు సూచిస్తున్నాను. సూర్యాపేటలో జన్మించిన నేను కాలిఫోర్నియాకు కమిషనర్ అయిన మొదటి ప్రవాస భారతీయుడిని. కాలిఫోర్నియా కమిషనర్ హోదాలో నేను వ్యక్తిగతంగా చాలాసార్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ను, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జగదీశ్రెడ్డిని కలిశాను. వారు ఎంత అంకితభావంతో, కర్తవ్య నిష్ఠతో, క్రియాశీలంగా పని చేస్తారో దగ్గరగా చూశాను. ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు.
విపక్షం ఇచ్చిన హామీలతో పోలిస్తే అధికారపక్షానికి అంకితభావం ఎక్కువ ఉం టుంది. ఎక్కువ వనరులుంటాయి. ఈ ఉప ఎన్నికలో తాము గెలిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత తనదని కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటువేయడం వివేకవంతమైన నిర్ణయం. దీనివల్ల రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి ఇద్దరూ కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్కు ఒక అవకాశం ఇచ్చి మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డిల నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఓటర్లకు నా విజ్ఞప్తి.
– రఘు రెడ్డి (కాలిఫోర్నియా కమిషనర్, అమెరికా)