దేశమంతా గులాబీ పరిమళాలు వెదజల్లే వేదికగా ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భవన్ రూపుదిద్దుకున్నది. దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచేలా, రాష్ర్టాల హక్కుల కోసం సాగించే చర్చలకు, దేశ ప్రజల ఆకాంక్షల కోసం సమాలోచన చేసే వేదికగా బీఆర్ఎస్ భవన్ నిలువబోతున్నది. ఢిల్లీలోని వసంత విహార్లో బీఆర్ఎస్ భవన్ నిర్మాణం పూర్తయింది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేదమంత్రాల నడుమ ప్రారంభించారు.
దేశ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే మహోజ్వల శక్తిగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చారిత్రాత్మక సమాలోచన దిశగా పురుడు పోసుకున్నది. దేశ అస్తిత్వాన్ని ఇనుమడింప జేసే వేదికగా ఢిల్లీ గడ్డపై గులాబీ పతాక ప్రజ్వరిల్లింది. దేశహితం కోసం బయలుదేరిన కేసీఆర్ అడుగులను స్వాగతిస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీ జాతీ య కార్యాలయంగా బీఆర్ఎస్ భవన్ ప్రారంభమైంది. ఇక నుంచి బీఆర్ఎస్ కార్యకలాపాలు దేశ వ్యాప్తంగా మరింత విస్తరించనున్నాయి. దేశ ప్రజల ఆకాంక్షల కోసం ఢిల్లీ వేదికగా బీఅర్ఎస్ సమరశంఖం పూరించనున్నది.
తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమానికి హైదరాబాద్లోని తెలంగాణభవన్ కేంద్రంగా ఉన్నది. ఎన్నో ఉద్యమ పాఠాలు, వ్యూహాలు, అస్తిత్వ పునాదులను నిలబెట్టిన ఘనత హైదరాబాద్ తెలంగాణ భవన్కు దక్కుతుంది. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ నాయకత్వంలో జలదృశ్యం లో గులాబీ జెండా రెపరెపలాడింది.
కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు టీఆర్ఎస్ మొ దటి వేదికైంది. కేసీఆర్ ఉద్యమాన్ని ముందు కు తీసుకెళుతున్న సమయంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం తన విషపూరిత చర్యలతో టీఆర్ఎస్ కార్యాలయం లేకుండా జలదృశ్యం నుంచి ఖాళీ చేయించింది. అనంతరం కృష్ణానగర్లో కొద్ది రోజులు టీఆర్ఎస్ ఆఫీసును నిర్వహించారు. తెలంగాణ ప్రజల అస్తిత్వం కాపాడుకునేందుకు సొంత కార్యాలయం ఉండాలని భావించి తెలంగాణభవన్ నిర్మింపజేశారు కేసీఆర్. పార్టీ కార్యాలయం అంటే ఉద్యమ భావజాలానికి గ్రంథాలయంలా ఉండాలనేలా హైదరాబాద్ నడి బొడ్డున చరిత్రాత్మక తెలంగాణభవన్ను నిర్మించారు.
కేసీఆర్ మొక్కవోని దీక్షతో శాంతియుతంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. తన మేధో సంపత్తిని పాయలుగా విభజించి తెలంగాణ ఉద్యమాన్ని నలుదిశలా వ్యాపింపజేసి పోరాటాన్ని పతాక స్థాయికి చేర్చారు. ఢిల్లీ గడపలో ప్రతి పార్టీ ఆఫీసు తలుపు తట్టి, తెలంగాణకు జై కొట్టించి దేశంలోని అన్నీ పార్టీల మద్దతు సంపాదించి లేఖ లు తెచ్చి తెలంగాణకు రూపం వచ్చేలా చేశారు. జంతర్మంతర్ వద్ద దీక్ష చేశారు. ఆ సమయం లో ఢిల్లీకి పోతే తెలంగాణ వారికి నిలువనీడ కూడా ఉండేదికాదు. ఎంపీగా ఉన్న కేసీఆర్కు ఇ చ్చిన ఇల్లే ఢిల్లీలో తెలంగాణ ఉద్యమానికి వేదికైంది. అప్పుడే హైదరాబాద్ లాగే ఢిల్లీలోనూ ఒక భవనం నిర్మించాలని ఆలోచన చేశారు కేసీఆర్. ఇపుడు భవన నిర్మాణం పూర్తయ్యింది. ఢిల్లీలో నిర్మించిన బీఆర్ఎస్ భవన్ భారత జాతిని జాగృత పరచడానికి వేదిక కానున్నది. భారత జాతీయ రాజకీయాల్లో సరికొత్త విప్లవానికి
పునాది కానున్నది.
తెలంగాణ అస్తిత్వం కాపాడినట్టే, భారత దేశ ఔన్నత్యాన్ని, అస్తిత్వాన్ని, అన్ని వర్గాల ప్రజల ఆ త్మగౌరవాన్ని కాపాడే దిశగా బీఆర్ఎస్ పయనిస్తున్నది. ఈ వేదిక జాతీయ రాజకీయాలకు ఉద్య మ పాఠాలు నేర్పనున్నది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత కరెంట్, మి షన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, దళితబంధు వంటి కేసీఆర్ మేధో మథనం నుండి జాలువారిన చారిత్రాత్మక ప్రగతి పథకాలు దేశమంతటా అమల్లోకి వస్తే దేశ ముఖచిత్రమే మారనున్నది.
ఇటీవల దేశానికి ఆదర్శంగా డాక్టర్ బీఆర్ అంబేద్క ర్ సచివాలయం నూతన భవనాన్ని ప్రారంభించుకున్నాం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. మరో పక్క జూన్ 2న తెలంగాణ అమర వీరుల స్ఫూర్తి జ్యోతి వెలుగనున్నది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇవన్నీ చరిత్రలో ఆత్మ గౌరవ సాక్ష్యాలు.
ఖమ్మంలో కదం తొక్కిన బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం.. మహారాష్ట్ర వైపు దూసుకెళ్లింది. అక్కడి నుంచి పెద్ద ఎత్తున నాయకులు, ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి బీఆర్ఎస్లో చే రుతున్నారు. ఇప్పటికే నాందేడ్, లోహ కాంధార్, ఔరంగాబాద్లో జరిగిన బీఆర్ఎస్ సభల రీసౌండ్ దేశమంతా మారు మోగుతున్నది. బీఆర్ఎస్ ప్రభంజనంతో మహారాష్ట్ర రాజకీయ పార్టీ లు బెంబేలెత్తుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయాలతో అక్కడి ప్రజలు విసుగెత్తి పోయా రు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలు మాకూ కావాలని మరాఠీ జనం గొంతెత్తుతున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం దేశమంతా మారుమోగుతున్నది. స మూలమార్పు కేసీఆర్తోనే సాధ్యమనే చర్చ దేశమంతా సాగుతున్నది. ఓట్లు, సీట్లు కాదు ప్రజలను అర్థం చేసుకునే కేసీఆర్లాంటి నాయకుడు కావాలని జనం కోరుకుంటున్నారు. అందుకే హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర మీదుగా బీఆర్ఎస్ ఢిల్లీకి బాటలు వేస్తున్నది.
‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ రైతు రాజ్యం దిశగా కేసీఆర్ ముందుకు పోతున్నారు. గత ఏప్రిల్తో పాటు ఇటీవల కురుస్తున్న రాళ్ళ వానతో నష్ట పోయిన రైతులను చూసి సీఎం కేసీఆర్ చలించి పోయారు. నేనున్నానంటూ ఎకరా కు 10 వేల నష్ట పరిహారం ప్రకటించారు. ‘తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తాం. మీరు ధైర్యంగా ఉండం డి. మీ కోసమే కేసీఆర్ ఉన్నా డు’ అంటూ భరోసా నిచ్చారు. సీఎం కేసీఆర్. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఆదుకోవటం ప్రభుత్వ బాధ్యత ఆ బాధ్యతను తలకెత్తుకున్నాడు కనుకనే కేసీఆర్ను ఈ రోజు యావత్ భారతజాతి కోరుకుంటున్నది.
చిటుకుల మైసారెడ్డి, 9490524724
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్ )