బీఆర్ఎస్ ప్రభుత్వం నిస్సందేహంగా రైతు ప్రభుత్వమే. అన్నదాతకు తెలంగాణ ప్రభుత్వం పంట సహాయం కోసం ఏర్పాటుచేసిన రైతుబంధు పథకం డబ్బులు పడకుండా కాంగ్రెస్ కుట్రలు పన్నింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిన రైతుబంధు పథకంలో దళారులు లేరు. నేరుగా రైతు ఖాతాల్లోనే పంటసాయం డబ్బు జమవుతుంది. పైరవీలు లేవు. దరఖాస్తులు లేవు.
రైతులందరికీ ఏకరీతిన పంట సాయం అందుతుంది. ఈ విధంగా రైతును అక్కున జేర్చుకున్న రాష్టం దేశంలో ఎక్కడా లేదు. రైతాంగాన్ని ఇంతగా కడుపులో దాచుకున్న సర్కారు స్వతంత్ర భారత చరిత్రలో మరొకటి లేదు అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇలా రైతాంగానికి బీఆరెస్ సర్కారు దగ్గర కావడం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, అధికారం కోసం తపిస్తున్న కాంగ్రెస్కు కంటగింపుగా మారిపోయింది. జనం సమస్యలు పక్కన బెట్టి రాజకీయాలు చేసే ఈ పార్టీలకు తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెప్పే రోజు వచ్చింది.
రైతుబంధు ద్వారా ఏటా రెండు సార్లు 63 లక్షల మంది రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. 2018లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా అందిన పెట్టుబడి సాయం రైతు బంధు, సాగునీటిప్రాజెక్టులు, 24 గంటల కరెంటు, మద్దతుధర రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అత్యంత లాభదాయకంగా మార్చాయి. రాష్ట్రంలో వ్యవసాయం చేసేవారి సంఖ్య పెరిగింది. సీఎం కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధు ద్వారా అన్నదాతలకు అందిస్తున్న పంట పెట్టుబడి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతును రాజును చేసింది. నవతరాన్ని సైతం సాగువైపు మళ్లించేలా స్పూర్తినిచ్చింది రైతుబంధు. వ్యవసాయంలో స్వాతంత్య్రానంతరం ఇంతటి సంస్కరణ రాలేదు.
దేశానికే మార్గదర్శకంగా రైతుబంధు పథకం. రైతు కోసం ఇంత మొత్తం వెచ్చించింది తెలంగాణే. సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు ద్వారా అన్నదాతలకు అందిన వరం.
దేశంలో తొలిసారిగా ప్రభుత్వమే పెట్టుబడి పెడుతూ,వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి,రైతును రాజును చేసి, నవతరాన్ని సైతం సాగువైపు మళ్లించేలా స్పూర్తినిచ్చింది రైతుబంధు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండాలనే లక్ష్యంతో రైతు బంధు పథకం ద్వారా వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందిస్తుండడంతో పాటూ రైతు బీమా ద్వారా బాధిత కుటుంబాలకి భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతునేస్తంగా నిలుస్తున్నారు.
-ఆలేటి రమేష్
9948798982