అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తనదైన ఎత్తుగడలతో పావులు కదుపుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఆపసోపాలు పడుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న కమలదళం ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న ది. అయినప్పటికీ కేసీఆర్ వేసే ఎత్తులతో వారి ఆశలు అడియాశలుగానే మిగులుతాయనడంలో సందేహం లేదు. ఒకవైపు రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ముందుకువెళ్తూనే, మరోవైపు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి ఆ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని నడుం బిగించారు కేసీఇర్.
ఈ ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సమయంలో కేసీఆర్ వ్యూహాల ముందు ప్రతిపక్షాలు వెనుకబడ్డాయన్న అభిప్రాయం వినబడుతున్నది. ఎన్నికలకు ముందు నాయకులు చేసే పాదయాత్రలు ఓటర్లను ప్రభావితం చేస్తాయన్న ఓ నమ్మకం తో ప్రతిపక్ష నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. పాపం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కష్టనష్టాలకోర్చుకుంటూ చేసిన పాదయా త్ర కావచ్చు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తు న్న ‘హాత్ సే హాత్ జోడో’ వాక్థాన్ కావచ్చు.. అవి ఏ యాత్రలైనా కేసీఆర్ వ్యూహాల ముందు దిగదుడుపే.
కేసీఆర్ను గద్దె దింపాలన్న కాంగ్రెస్, బీజేపీల కోరికకు వ్యతిరేకంగా పలు సర్వేల నివేదికలు వస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలు నిరాశపడుతున్నా, బ యటికి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్త్తూడాంబికాలు పలుకుతున్నారు. సర్వేల్లో కనీసం ఈ సారి తెలంగాణలో హంగ్ ప్రభుత్వానికై చోటు ఉం డదా? అంటూ వేసే ప్రశ్నలకూ ప్రజల నుంచి వా రూహించిన సమాధానం రావటం లేదు. మళ్లీ ఈ సారీ ప్రజలు కేసీఆర్కే పట్టం కడతామని కుండబద్దలు కొట్టినట్లు సమాధానాలిస్తుంటే.. ప్రతిపక్షాలకు దిమ్మ తిరుగుతోంది.. బీఆర్ఎస్ ఆవిర్భావం సంద ర్భంగా ఏర్పాటుచేసిన ఖమ్మం మహాసభతో పాటు, పలు అభివృధ్ధి పథకాల సంధర్భంగా వివిధ జిల్లాల్లో సుడిగాలి పర్యటలను చేస్తూ, సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రసంగాలతో సామాన్యులు మళ్లీ కేసీఆర్కే పట్టం కట్టాలన్న నిర్ణయానికి వచ్చారు.
పోడు భూమికి పట్టాలిస్తామని, కానీ అడవులకు ఇదే ఆఖరు కావాలంటూ.. అడవి బిడ్డలను ఆదుకోవటానికి అవసరమైతే దళితబంధులా, గిరిజనబం ధు పథకాన్ని అమలుచేస్తామంటూ కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం ప్రతిపక్ష నాయకులకు చెమటలు పట్టించింది. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల స్మృత్యర్థం నిర్మిస్తున్న అద్భుతమైన అమరవీరుల స్మారక చిహ్నం, రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, చారిత్రాత్మక కట్టడాలను తలదన్నేట్లు నిర్మించిన కొత్త సచివాలయ నిర్మాణం, ఆపై దానికి డాక్టర్ అంబేద్కర్ భవన్గా నామకరణం చేయడం కేసీఆర్ వ్యూహాం లో భాగమే.
ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమాలతో కేసీఆర్ సృష్టించిన బలీయమైన ఓటు బ్యాంకును తట్టుకుని బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఢీ కొట్టలేవన్నది నగ్న సత్యం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కి ట్, కంటివెలుగు వంటి అనేక సంక్షేమ పథకాలు బీఆర్ఎస్కు నిబద్ధత కలిగిన ఓటర్లను తెచ్చి పెట్టాయన్నది నిర్వివాదాంశం. ఈ ఏ డాది బడ్జెట్లో అన్నివర్గాల సంక్షేమానికి పెద్దపీట వేయడం కేసీఆర్ వ్యూహంలో మరో మైలురాయి. ఎన్నికల వేళ పెద్ద ఎత్తున దళితబంధు అమలు చేయడంతో పాటు, ఇంటి జాగ ఉన్న 2 లక్షల 63 వేల మందికి సొంతింటి కల నెరవేర్చుకోవడానికి రూ.3 లక్షలు అందించే పథకం అమలుచేయాలన్న నిర్ణ యం, మధ్యతరగతి ప్రజలకు, రైతుల రుణమాఫీ పథకం రైతంగానికి పెద్ద ఊరటనిచ్చింది.
మరోవైపు కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపన, విస్తరణ వ్యూహాలు రాజకీయ నాయకులకూ మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించి, ఇతర రాష్ర్టాల్లో పార్టీని విస్తరించడం మీద కేసీఆర్ దృష్టిపెట్టా రు. ముందుగా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, గుజరాత్ రాష్ర్టాలతో పాటు ఆప్ లాంటి బీజేపీ వ్యతిరేక పార్టీలతో మైత్రీ బంధం పెంచుకుంటా. ముఖ్యంగా వ్యవసాయ ప్రధాన ప్రాంతాలైన పంజాబ్, హర్యానా, యూపీ లాం టి రాష్ర్టాల్లో ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీజేపీ వ్యతిరేక పార్టీల విజయానికి తన వంతు కృషిచేయడానికి అడుగులు వేస్తున్నారు.
– మఠం బిక్షపతి
95424 23242
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)