మా పార్టీ (నేషనల్ కాన్ఫరెన్స్) ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలో చేరుతారని, జమ్ము కశ్మీర్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ నిరాధారమైన వార్తలు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ తన పాత మిత్రపక్షం బీజేపీకే ఓటు వేసింది. ఈ సంగతిని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ గుర్తుంచుకోవాలి.
– ఒమర్ అబ్దుల్లా, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి