భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పాలపీక వెతుక్కునే స్థాయికి దిగజార్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. అనేక ప్రజా సమస్యలకు ఒకటే మంత్రం జపిస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే. లేని ముస్లిం భూతాన్ని ప్రజలకు మాయావి కాషాయ కండ్లద్దాల్లో చూపించటం, దేశం కోసం , ధర్మం కోసం అనే శుష్క నినాదం ఒకటి జపించటం, ఉత్తుత్తి మన్ కీ బాత్ ప్రజల చెవుల్లో ఊదరగొట్టి దేశాన్ని గుండుగుత్తగా అంబానీ, అదానీలకు అంటగట్టటమే వీరి పాలనా ఎజెండా. వీరు అపర దేశ భక్తులని గానీ, పూర్తి దైవ భక్తులని గానీ ఈ దేశప్రజలు విశ్వసించటం లేదు. ఈ తొమ్మిదేండ్ల సుదీర్ఘకాలంలో వీరు ప్రజలకు చేసింది శూన్యం గనుక.
ఓ చిన్నకథ-ఒక క్లాస్ టీచర్ పిల్లలకు వారి సృజ నాత్మక శక్తికి పదును పెట్టే ఉద్దేశంతో గడ్డి
మేస్తున్న ఆవు బొమ్మను దించమని పురమాయించా రు. అరగంట తర్వాత పిల్లలందరూ వారికి తోచిన విధంగా, గడ్డి మేస్తున్న ఆవు బొమ్మను గీసి టీచర్కు చూపించారు. చివరకు ఒక విద్యార్థి బొమ్మ గీయ కుం డా తెల్లకాగితం టీచర్ చేతికిచ్చాడు. టీచర్ ఆశ్చర్య పో యి-నేను గడ్డి మేస్తున్న ఆవు బొమ్మను గీయమన్నాను కదా? నువ్వు బొమ్మ గీయకుండా తెల్ల కాగితం ఇచ్చా వేంటి? అని అడిగారు. అందుకు ఆ విద్యార్థ్ధి నేను గడ్డిమేస్తున్న ఆవు బొమ్మను దించాను టీచర్. గడ్డి మే స్తూ మేస్తూ ఆవు వెళ్ళిపోయింది టీచర్! అని జవాబిచ్చాడంట. నోరెళ్లబెట్టడం టీచరమ్మ వంతయ్యింది. దేశంలో సగటు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు బీజేపీ, మోదీ ప్రభుత్వం ఇస్తున్న జవాబు అచ్చం ఇలాగే ఉన్నది.
సంపదను సృష్టించి, ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందివ్వాల్సిన ప్రభుత్వం, ఆ పని చేయక పోగా, అభూ త కాల్పనిక చరిత్రను వెలికి తీసి విషం చిమ్ముతూ, ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడ్తూ, పబ్బం గడుపుకొంటున్నది. తన గుజరాతీ మిత్ర బృందానికి కోటానుకోట్లు కట్టబెట్టి దేశం ఎల్లలు దాటిస్తూ, వారి పాదసేవ చేస్తూ రుణం తీర్చుకుంటున్నది. ఎన్నాళ్ళీ పాలన? బీ జేపీ పాలకులేమైనా అమృతం సేవించి పుట్టుకొచ్చారా? లేక మరణానికి వీరేమైనా అతీతులా? వీరి ఆయుప్రమాణం అంతం లేనిదా? మనిషన్నాక పాపభీతి ఉండా లి కదా? అది లేకపోతే మనిషికీ మృగానికీ తేడా ఏమి టి? మరికొన్ని మిగిలిన ప్రశ్నల్ని మనిషిగా ఆలోచించే మెదడున్నవారి కోసం వదిలేద్దాం.
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్చక్ హిందీ నేషనల్ ఇండిపెండెంట్ యూ ట్యూబర్ అయిన అభిసార్ శర్మ, భారత ప్రధానిని ఉద్దేశించి ఒక ఆలోచించదగిన హితబోధ చేశారు (ప్రెస్మీట్లో కాదు సుమా. మన ప్రధానికి ప్రెస్మీట్ అంటే పత్యం కదా). అదేంటంటే-‘మాననీయ ప్రధాని దామోదర్ దాస్ మోదీ జీ… మన భారతదేశంలో ప్రధానమంత్రి పదవికంటే ఉన్నతమైన పదవి ఇంకోటేదైనా ఉన్నదా? అలాంటి ఉన్నతమైన పదవిలో ఈ దేశ ప్రజలు మిమ్మల్ని రెండు దఫాలు కూర్చోబెట్టారు. మీకు ఇంకేం కావాలి? ఇప్పుడైనా ఈ అమానవీయ మత వైషమ్యాలను రెచ్చగొట్టి చేస్తున్న చెత్త రాజకీయాలను పక్కనబెట్ట్టి, మానవతను పాదుకొల్పి, దేశ ప్రజలకు సుపరిపాలనను అందివ్వం డి. చరిత్రలో నిలిచిపోతారు!’అని. పాపం అది అరణ్య ఘోషేనని అభిసార్ శర్మ అనుకొని ఉండరు.
కానీ అంతరాత్మ పీడనకు ఎవరూ అతీతులు కారు. తప్పు చేసినవారిని అది అనుక్షణం ప్రశ్నిస్తూ, పీడిస్తూనే ఉంటుంది. ఎంత కృత్రి మ గాంభీర్యం ప్రదర్శించినా… ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ ! అంటారు. గతంలోని ప్రధాని మోదీ ముఖ గాంభీర్యాన్ని, ఇప్పటి మోదీ ముకుళిత ముఖ కవళికలను గమనించిన వారికెవరికైనా, మోదీలో లోలోపల అంతరాత్మ పీడన, లేదా భవిష్యత్ భయం మొదలైనట్లూ, ఫేస్ రీడింగ్ తెలిసిన వాళ్ళెవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది.
ఇన్నాళ్లు ఇరువైపులా ఒకే బొమ్మ ఉన్న నాణెంతో ఇటు ప్రతిపక్షాలతో, అటు ప్రజలతో ఆడుకున్నది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు వారి కండ్ల ముందు ఆచరణ సాధ్యంకాని భ్రమల తెర ఒక్కొక్కటిగా తొలగి పోతుం టే, ఇంకా అవసరానికి మించిన అనాగరిక తప్పులు చేస్తూనే వస్తున్నది బీజేపీ, దాని అంధశ్రేణులు. కాలం అత్యంత శక్తివంతమైనది. ఏదో ఒకనాడు న్యాయం, ధర్మం సమతుల్యం చేస్త్తుంది. అది ప్రకృతి ధర్మం కూడా. చేసిన తప్పులన్నీ పేరుకు పో యి బీజేపీని, మోదీని వెంటాడుతున్నాయి. దీంతో స్వీయ ఆత్మరక్షణలో పడింది బీజేపీ ప్రభుత్వం. ఎవ్వరూ నమ్మినా, నమ్మకపోయినా ఇదే సత్యం. కొంతకాలం కొందరిని మోసగించవచ్చు కానీ, ఎల్లకాలం ఎవ్వరూ అందరినీ మోసగించలేరు. దేశంలో ప్రజలు మేల్కొంటున్నారు.
ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే…
నడుస్తున్న రాజకీయ లోతులు వివిధ కోణాల్లో పరిశీలించి, మదించాల్సిన సమయం ఆసన్నమైందిప్పుడు.ఘోరాతిఘోరమైన తప్పులూ, అబద్ధపు నినాదాలూ, అమానవీయ చర్యలే ఎజెండాగా పాలనాధికారం చేపట్టిన బీజేపీ, ఇప్పుడు స్వీయ రక్షణలో పడి ఆక్సిజన్ వెతుక్కుంటుందనేది వాస్తవం. ఆచరించలేని అబద్ధపు వాగ్దానాల ఆర్భాటాలతో గుజరాత్ నుంచి ఢిల్లీ పీఠం దాకా సాగిన మోదీ రాజకీయ ప్రస్థానంలో అన్నీ అవకతవకలే. ఒక తప్పును కప్పిపెట్టే ప్రయత్నంలో మరో తప్పు…ఆ తప్పును మరుగుపర్చే ప్రయత్నంలో ఇంకో తప్పు, తడిసి మోపెడైన తప్పుల్ని నెత్తికెత్తుకొని మూలుగుతుందిప్పుడు.
గుజరాత్ గోద్రా మారణకాండ మొదలు, అప్పటి గుజరాత్ హోం మినిస్టర్ హరేన్ పాండ్య హత్య కేసు లో తేలని మిస్టరీ, జస్టిస్ లోయా మరణంలో తేలని రహస్య కోణం, గుజరాత్ మారణకాండపై బీబీసీ రిపోర్ట్, ఆప్త మిత్రుడు అదానీపై హిండెన్ బర్గ్ రిపోర్ట్, మోదీ డిగ్రీ సర్టిఫికెట్పై బట్టబయలైన నిజాలు, ఇప్పటికీ క్లారిటీ లేని పుల్వామా సైనిక మారణకాండ, బాబ్రీ మసీదుపై తీర్పు చెప్పిన అప్పటి న్యాయమూర్తులకు పునరావాస బహుమతులు. బిల్కిస్ బానో కేసు నిందితుల విడుదల, ఇంకా వేలకువేల కోట్ల దేశ ప్రజల సొమ్మును మింగి ఇతర దేశాలకు జెండా ఎత్తేసిన మోదీ గుజరాత్ ఆప్త మిత్రుల భాగోతం చిట్టా, వివిధ రాష్ర్టాల్లో జరుగుతున్న అకారణ, ఏకపక్ష మత ఘర్షణల మారణకాండ. పెట్రోలు, వంట గ్యాస్ మొదలు, ఆకాశం అంచులు దాటిన ధరల పెరుగుదల, పెరిగిన ఆర్థ్థిక మాంద్యం. కుంటుపడిన చిన్న వ్యాపారాలు. దేశంలో అల్లకల్లోలానికి గురైన సగటు జీవుల జీవన ప్రమాణాలు. ప్రభుత్వపు జవాబుదారి లేనితనం. ఇవన్నీ బీజేపీ మోదీ ప్రభుత్వ డొల్ల పాలనలోని ఘనకార్యాలు. ఇవన్నీ రేపు రాబోయే లోక్సభ ఎన్నికలకు మోదీ మెడకు గుదిబండలే.
ప్రజలూ, విపక్షాలు కోరుకుంటున్నట్టు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల వాడకం రద్దు చేయ బడి, ఎన్నికల నిర్వాహణ బ్యాలెట్ పేపర్ ద్వారా జరి గితే, వాటి ఫలితం ఎలా ఉంటుందో, రాజకీయ పరిజ్ఞానం లేనివారికి కూడా అర్థమవుతుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో బీజేపీకి మిగిలింది.. స్వీయ ఆత్మరక్షణ పథకం అమలు పర్చకోవటం మినహా చేయగలిగిందీ ఏమీలేదు.
మరోవైపు ప్రత్యేక తెలంగాణ పోరాట యోధుడు, రాజకీయ ధురంధరుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేతృత్వంలోని బీఆర్ ఎస్ శరవేగంగా దేశంలో విస్తరించటం బీజేపీకి కును కు పట్టకుండా చేస్తున్నది. అలాగే రైతు నల్ల చట్టాలు తెచ్చి వారి చావుకు కారణమైన మోదీపై రైతులు గుర్రు గా ఉన్నారు. మరోవైపు కేసీఆర్ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదం అందిపుచ్చుకొని, తెలంగాణాలో సాధించిన అభివృద్ధి పథకాలను దేశ ప్రజల ముందుంచటం బీజేపీకి సంకటంగా మారింది. కేసీఆర్ విపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు. కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్, కుమారస్వామి, ఉద్దవ్ఠాక్రే, మమతాబెనర్జీ లాంటి నాయకులను ఏకతాటి మీదకు తీసుకొచ్చే దిశగా కేసీఆర్ ఎత్తుగడలు చూసి బీజేపీ తడబడుతున్నమాట నిజం.
కూతవేటు దూరంలో కనపడుతున్న ఎన్నికల సుడి గుండం నుంచి బయటపడేదెలా? ఎలక్షన్ కమీషన్ ఈవీఎంలను రద్దు చేసి, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే తమ పరిస్థితి ఏమిటి? అనే మీమాంసలో బీజేపీ ఉన్నది.
ప్రజాస్వామ్య దేశాన్ని గతకాలపు రాచరిక వ్యవస్థగా మార్చిన ఘనత బీజేపీదే. అన్ని వ్యవస్థలు తన గుప్పిట్లో పెట్టుకొని తనను తాను రాజుగా పోల్చుకొని మోదీ వెలిగి పోతున్నాడు. ఇదే ఫాసిస్టు పాలన అంటే. చరిత్రలో నియంతలు కాలగర్భంలో ఎలా కలిసిపోయారో మోదీ ఒకసారి మననం చేసుకుంటే బాగుండేది. బీజేపీ ఫాసిస్టు పాలనలో పోలీసు శాఖను వాడు కుంటూ, న్యాయవ్యవస్థను శాసిస్తూ, తమ అంధ, అనాగరిక, అవిద్య కార్యకర్తలు గల బీజేపీని ఎదుర్కోవటానికి, ప్రతిపక్షాలు కూడా మేధావి, కార్యకర్తల విభాగంతో పాటు, అన్ని విద్యల్లో ఆరి తేరిన ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకోవటం అవసరమేనని గుర్తించాల్సి ఉన్నది. దేశంలోని ప్రజల ఆస్తుల్ని ఒక్కొక్కటిగా అమ్ముకుంటున్నదెవరు? ప్రజల సొమ్ముతో దేశం దాటుతున్నదెవరో ప్రజలు చూస్తున్నారు.
కూతవేటు దూరంలో కనపడుతున్న ఎన్నికల సుడిగుండం నుంచి బయటపడేదెలా? ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలను రద్దు చేసి, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే తమ పరిస్థితి ఏమిటి? అనే మీమాంసలో బీజేపీ ఉన్నది.
తెలంగాణ ఏర్పడినాక , ఇక్కడ జరిగిన అభివృద్ధి, అమలవుతున్న అద్భుత ప్రజా ప్రాయోజిత పథకాలు బీజేపీకి కనపడ్తలేవా? ఓర్వలేని కండ్ల మంటలూ, కడుపుబ్బరమేనా వెళ్ళగక్కేదీ? బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ర్టాల్లో వేల కోట్లు ఖర్చుపెట్టి శాసన సభ్యుల్ని కొని ప్రభుత్వాల్ని మారుస్తున్నదెవరూ? ఆ కోటానుకోట్ల డబ్బు బీజేపీకి ఎక్కడిదని ప్రశ్నిస్తూందీ దేశం.
దేశంలో రెచ్చిపోతున్న ఫాసిజాన్ని, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ నిలువరించలేం. భారతదేశ ప్రజా స్వామ్యాన్ని కాపాడుకునేందుకు, బీఆర్ఎస్ పార్టీ అధినేత, దార్శనికతగల కేసీఆర్ వెంట నడవటమే దేశ ప్రజలకు శ్రేయస్కరం. ఇప్పుడు కేసీఆర్ దేశానికి వేగుచుక్క.
దేశంలోని మేధావులు, విజ్ఞులైన ప్రజలు వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి, సెక్యులర్ శక్తులన్నీ ఏకమై మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకునే దిశగా కలిసి నడవాల్సిన తరుణం ఇది. ఫాసిజాన్ని ఎదుర్కునే ఈ రణయాత్రలో ఎక్కడ ఎవరు ఏ తప్పు చేసినా, తప్పుటడుగులు వేసినా రేపటి తరం, రేపటి చరిత్ర క్షమించదుగాక క్షమించదు.
ప్రజలారా పారా హుషార్!
జైహింద్! జై భారత్!
సయ్యద్ గఫార్: 81432 53116