కుతుబ్షాహీల పాలన అంతరించిన తర్వాత తెలంగాణ సాహిత్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అప్పటివరకూ రాజాశ్రయం లభించిన తెలుగు కవులకు, పండితులకు ఆ తర్వాత కొంతకాలంపాటు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. కుతుబ్షాహీల తర్వాత పాలనలోకి వచ్చిన అసఫ్జాహీలు సాహిత్యాన్ని అందులోనూ తెలుగు సాహిత్యాన్ని అంతగా ఆదరించలేదు. వీరి పాలన 200 ఏండ్లకు పైగా నడిచింది. ఈ సమయంలో తెలంగాణలో తెలుగు సాహిత్యానికి నిజాం రాజ్యంలోని తెలుగు రాజుల సంస్థానాలు పెద్దదిక్కుగా నిలిచాయి. వీటిలో ఎన్నదగినది గద్వాల సంస్థానం.
నిజాంల కాలంలో తెలుగు భాష ఉనికిని, సాహిత్యాన్ని కాపాడింది మహబూబ్నగర్ జిల్లాలోని సంస్థానాలే. మరీ ముఖ్యంగా గద్వాల సంస్థానం గొప్ప చేయూతను అందించింది. అందుకే గద్వాల ‘విద్వద్ గద్వాల’గా ప్రసిద్ధి చెందింది.
తెలంగాణ ప్రజలకు భాష ఓ పిలుపు మాత్రమే కాదు. చరిత్ర మారినా చెదరని అస్తిత్వం. అందుకే తెలంగాణ ఘన సాహిత్యానికి పెద్దపీట వేస్తూ చెలిమెను నిర్వహిస్తున్నది మన పత్రిక. అలసిసొలసిన వేళల్లో కళారూపాలైనా, పోరుబాటల్లో పాటలా మారినా, ఆత్మగౌరవాన్ని కథతో నినదించినా… తనదైన శైలి తెలంగాణది. ఆ సాహిత్యంలో మీకు ఎలాంటి అభిరుచి ఉన్నా, కలాన్ని కదిలించండి. ఆసక్తిగా, సూటిగా తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన రచనలు చేయండి…
మరింగంటి వంశం వాడైన సింగరా చార్యులు (క్రీ.శ.1520-90) ప్రసిద్ధ కవి. మల్కిభరాముని చేత వాడపల్లి ఆగ్రహారాన్ని పొందిన వాడు. ‘వరదరాజ స్తుతి’, ‘శ్రీరంగ శతకం’, ‘రామకృష్ణ విజయం’ అనే ద్వర్థి కావ్యాలను రచించాడు. ‘దశరథ రాజనందన చరిత్ర’ అనే ‘నిరోష్ఠ్య’ కావ్యాన్ని కూడా రచించాడు. పదహారేండ్ల వయసులోనే ‘నల యాదవ రాఘవ పాండవీయం’ అనే నాలుగు అర్థాలతో కూడిన కావ్యాన్ని రచించాడు. ‘దశరథ రాజనందన చరిత్ర’, ‘సీతా కళ్యాణం’ అతని రచనల్లో ముద్రితమైనాయి. ఇతని వంశానికే చెందిన వెంకట నర్సింహాచార్యులు ‘చిలువ పడగరేని పేరణము’ అనే అచ్చ తెనుగు కావ్యాన్ని రచించాడు. మరింగంటి వంశ కవులు నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతానికి చెందినవారు. ఆ వంశానికి ‘మరింగంటి’ అనే పేరు ఎలా వచ్చిందో సింగరాచార్యులు తన ‘దశరథరాజ నందన చరిత్ర’ కావ్యంలో చెప్పాడు. స్వయంగా శ్రీరంగనాథుడే.. రామానుజాచార్యులతో ఈ క్రింది విధంగా అన్నట్లుగా సింగరాచార్యులు పద్యం రాశాడు..
ఈ వంశంలో బహుగ్రంథకర్తలైన కవులెందరో అనేక ప్రక్రియల్లో రచనలు చేశారు.
మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు దండయాత్రతో గోలకొండ ప్రభువులైన కుతుబ్షాహీల పాలన 1687లో ముగిసింది. ఆ తర్వాత కొన్నేండ్లపాటు సుస్థిరమైన పాలన లేక.. రాజ్యంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం 1734లో అసఫ్జాహీల (నిజాం రాజుల) పాలన మొదలైంది. ఢిల్లీ సుల్తానుల కాలంలో గోలకొండ రాజ్యం ‘దక్షిణ సుభా’గా ఉండేది. వారు రాజధానిగా ఔరంగాబాద్ను చేసుకున్నారు. నిజాం ఉల్ముల్క్ స్వతంత్రుడైన తర్వాత తన రాజధానిని హైదరాబాద్కు మార్చాడు. నిజాం రాజులు తెలంగాణను 214 ఏండ్లపాటు పాలించారు. వారు అనేక ప్రజాహిత కార్యాలు చేసినా, సాహిత్య పోషణపై దృష్టిపెట్టలేదు. కుతుబ్షాహీల వలె తెలుగు సాహిత్యాన్ని అభిమానించి, ఆదరించలేదు. అయితే, వారి పాలన కింద ఉన్న వివిధ సంస్థానాల ప్రభువులు తెలుగు సాహిత్యాన్ని పోషించారు.
నైజాంలో సంస్థానాలు.. మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువగా ఉండేవి. గద్వాల, వనపర్తి వంటి సంస్థానాలు కుతుబ్షాహీ ల కాలం నాటి నుంచే ఉన్నాయి. సంస్థానాలు ఉన్న జిల్లాల్లో తెలుగు భాష బోధన, తెలుగులో చదవ టం, రాయటం ఎక్కువగా కనిపిస్తుంది. ఇతర జిల్లాల్లో తెలుగు భాష ప్రాధాన్యం అంతగా లేదు. నిజాంల కాలంలో తెలుగు భాష ఉనికిని, సాహిత్యాన్ని కాపాడింది మహబూబ్నగర్ జిల్లాలోని సంస్థానాలే. మరీ ముఖ్యంగా గద్వాల సంస్థానం గొప్ప చేయూతను అందించింది. అందుకే గద్వాల ‘విద్వద్ గద్వాల’గా ప్రసిద్ధి చెందింది. గద్వాల కోట ను నిర్మించిన పెద సోమ భూపాలుడు (1663-1712) జయదేవుని అష్టపదులకు సంస్కృతం, తెలుగు భాషల్లో వ్యాఖ్యానం రాశాడు. ఇది అముద్రితం. సోమభూపాలుడు కుతుబ్షాహీల నుంచి ‘దేశముఖ్య’ అనే పాలనా గౌరవాన్ని పొం దాడు. ఈ ‘దేశముఖ్య’నే తర్వాత కాలంలో ‘దేశముఖి’గా మారింది.
గద్వాలను పాలించిన మరో ప్రభువు చిన సోమ భూపాలుడు. ‘నవభోజుడి’గా ఇతడు ప్రసిద్ధి చెందా డు. ఇతని ఆస్థానంలో ‘అష్టదిగ్గజాల’ పేరుతో ఎనిమిది మంది కవులుండేవారు. కాణాదం పెద్దన సోమయాజి అనే ప్రసిద్ధ కవి ఉన్నాడు. ఈయన ‘ముకుంద విలాసం’, ‘ఆధ్యాత్మ రామాయణం’, ‘బాలకొండ తాత్పర్యం’ మొదలైన గ్రంథాలను రచించాడు. ఇవి గద్వాల సంస్థానం ప్రెస్సులో ముద్రింపబడినాయి. గద్వాల సంస్థానంలో ‘సారంగధరీ యం’ అనే ‘త్య్రర్థి’ కావ్యాన్ని రచించిన పాకూరి కాశీపతి, ‘కృష్ణలీలా తరంగిణి’ని అనువదించిన అప్పలాచార్యుడు ఉన్నారు. పెద సోమ భూపాలుని ఆజ్ఞానుసారం ‘భారత’, ‘ఉద్యోగ పర్వాల’ను యధాశ్లోకానుసారం తెలుగులోకి అనువదించిన కాటికలపూడి వీర రాఘవాచార్యుడు, ‘మైథిలీ పరిణయం’ కావ్యకర్త వాడాల శేషాచార్యుడు మొదలైనటువంటి కవులెందరో ఉన్నారు. గద్వాల సంస్థాన చరిత్రను, కేశవ విలాసాన్ని రచించిన వేంకట కృష్ణ కవి గద్వాల సంస్థానంలోని కవీంద్రుడే.
గద్వాల ప్రభువు రామభూపాలుడు (19వ శతాబ్దం ఉత్తరార్ధం) ‘ఛందోముకురము’అనే సంస్కృత గ్రంథాన్ని రచించాడు. ఈ రామభూపాలుని ఆస్థానాన్ని తిరుపతి వేంకట కవులు సందర్శించి ‘శతావధానం’, ‘చాటుకవితా ప్రదర్శనలు’ చేశారు. తిరుపతి వేంకట కవులకు గద్వాల సంస్థానాధికారి పురాణం నరసింహాచార్యులకు మధ్య శాస్త్ర వాదాలు జరిగేవి. ఈ వాదాల్లో గెలిచిన తిరుపతి వేంకట కవులకు బంగారు కంకణం తొడిగి, జరీ శాలువా కప్పి, ఏనుగు మీద కూర్చుండబెట్టి ఊరేగించి గద్వాల ప్రభువు (1902-46) గౌరవించాడు. ఆ ప్రభువు భార్య ఆదిలక్ష్మీ దేవమ్మ పేరుమీద పుల్ల గుమ్మి శ్రీనివాసాచార్యులు ‘కర్ణ పూరము’ అనే కావ్యాన్ని రచించాడు.
సీతారామ భూపాలుడు అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి నాలుగు గంటలు చెప్పిన ఆశుకవితను విని ఆయన అప్పులను తీర్చాడు. వేదం వెంకటరాయ శాస్త్రి గద్వాలకు వచ్చి ‘శృంగార నైషధం’ వ్యాఖ్యా న్ని ప్రచురించడం కోసం ధనాన్ని పొంది సత్కరింపబడినాడు. కొప్పరపు జంట కవులు, మైసూరు వీణె శేషన్న గద్వాల ప్రభువుల సత్కారాలను పొం దారు. నాటి పండితులు, కవులు, కళాకారులలో గద్వాల ప్రభువుల సత్కారాలను పొందని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఉత్తమోత్తమ పండితులకు వారి జన్మాంతం ‘వార్షికం’ పేరుతో గద్వాల ప్రభువులు ధనాన్ని ఇచ్చేవారు. సీతారామ భూపాలునికి ఆశుకవిత్వం, శతావధానం, అష్టావధానం అంటే ఇష్టం. ఆయన సంగీతజ్ఞులను, కళాకారిణులను కూడా సన్మానించాడు. ప్రసిద్ధ నాటకకర్త ధర్మవరం కృష్ణమాచార్యులకు 1910లో ‘ఆంధ్ర నాటక పితామహ’ అనే బిరుదాన్ని ఇచ్చి గద్వాల ప్రభువులు సత్కరించారు.
కంటిన్ లక్ష్మణ మునివరు,
కంటిన్ కురేశ దేశ స్వామి మదిం
గంటి నదెవ్వరన మరిం,
గంటి మహాశ్రయము
దనరి గణ్యంబగుదున్
ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606