అసెంబ్లీ ఎన్నికలపై రెండు రోజులపాటు హైదరాబాద్లో చింతన్ బైఠక్ జరిపిన కమలనాథుల మేధోమథనంలో ఎమ్మెల్యే అభ్యర్థులకంటే సీఎం అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని తేలినట్టు సమాచారం. 119 నియోజకవర్గాలకుగాను 40 నియోజకవర్గాలకు మాత్రమే కాస్త పేరున్న అభ్యర్థులున్నారట. మిగతా 79 నియోజకవర్గాల సంగతేంటి? అని పరిశీలకులు ప్రశ్నిస్తే… కాస్త ఆగండి ఎన్నికలు దగ్గర పడితే కాంగ్రెస్ దుకాణం ఖాళీ చేసి వారంతా వచ్చి కమలం పంచన చేరుతారని రాష్ట్ర నాయకులు ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. అంటే దీని అర్థం కాంగ్రెస్ పార్టీకి అయితే అన్నిచోట్లా అభ్యర్థులున్నారు. అలా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచేది కాంగ్రెస్ అవుతుంది తప్ప బీజేపీ ఎలా అవుతుందని ప్రశ్నించినట్టు తెలిసింది. సీఎం అభ్యర్థులకు కొదవ లేదు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మాత్రం కొరత ఉన్నదని పరిశీలకులు పెదవి విరిచారట.
– వెల్జాల