45 ఏండ్లు తెలంగాణను పాలించింది కాంగ్రెస్ పార్టీ. అయి నా ముస్లిం, మైనారిటీల బతుకులను బాగు చేయలేదు. కానీ తాజాగా ముస్లిం డిక్లరేషన్ పేరుతో మరోసారి ఆ సామాజికవర్గాన్ని మోసం చేయజూస్తు న్నది. తెలంగాణ అవతరించక ముందు ముస్లిం మైనారిటీలను తమ శాశ్వత ఓటు బ్యాం కుగా మార్చుకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఒకచాన్స్ ఇవ్వండంటూ మభ్యపెట్టాలనుకుంటున్నది.
దళితుల కన్నా ముస్లింలు దుర్భర దారిద్రాన్ని అనుభవిస్తున్నారని నిక్కచ్చి గా తేల్చిచెప్పిన రాజేంద్ర సచార్ మాటలతో ఏకీభవించారు సీఎం కేసీఆర్. తెలంగాణలో 18 శాతంగా ఉన్న ముస్లిం మైనారిటీల జీవితాల్లో వెలుగులు నింపనిదే తాను కలలు కన్న బంగారు తెలంగాణ అసాధ్యమని గ్రహించారు. తద్వారా ఆ సామాజిక వర్గ అభ్యున్నతికి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి చూపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 మైనారిటీ గురుకులాలు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 240కి పెరిగింది.
విదేశీ విద్య కూడా మైనారిటీ పిల్లలకు అందుబాటులోకి తేవాలని భావించిన ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు వెచ్చిస్తూ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట ఇప్పటివరకు 2900 మంది విద్యార్థులను అమెరికా ఆస్ట్రేలియా, యూరప్ తదితర దేశాలకు పంపించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. ఇలాంటి సెక్యులర్ పాలనలో ఒక్క చాన్స్ పేరుతో ముస్లింలను బురిడీ కొట్టించాలని చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ. సస్యశ్యామల, శాంతి భద్రతల తెలంగాణలో స్కాముల కాంగ్రెస్ పార్టీని ఆదరించే అవసరం ముస్లిం సమాజానికి లేదు. అందరి మాట ఏమంటే.. సారుదే సర్కారు, కేసీఆర్ వెంటే ముస్లింలంతా…
– ఎస్ కే అబ్దుల్ నబీ