‘చేత గోరమాయె బతుకు బారమాయే చేసేదేమీ లేక సంచారం బోతున్న, బతుకుదెరువుకాని అమ్మా మాయమ్మా, బొంబాయి వోతున్న అమ్మ మాయమ్మా’ అంటూ ఒకనాడు తెలంగాణలో ఉపాధి లేక, ఉన్నత చదువులకు అవకాశం లేక, చదువులు మధ్యలోనే ఆపేసి పల్లెలన్నీ ముంబాయి, దుబాయి బాట పట్టినయి.
వ్యవసాయంలో నష్టమొచ్చి అప్పులై, కరువుతో అల్లాడిన నేలన పిల్లలకు సరైన చదువులు చదివించలేని స్థితి తెలంగాణ ప్రజలది. ఇంటర్ చదివితే అదే గొప్ప అనే స్థితిలో పేద పిల్లల బతుకులు ఉండేటివి. ఒకవేళ డాక్టర్ అవ్వాలనే కల ఉంటే అది కలగానే మిగిలిపోయేది. కానీ పెదవాడి కలను నిజం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి హరీశ్రావు మార్గనిర్దేశనంలో వైద్య విద్యలో విప్లవం మొదలైంది.
ఒకనాడు ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే స్థితి నుంచి సర్కా రు దవాఖానలోనే మెరుగైన వైద్యం అందుతుందని జనం నమ్మకంతో వచ్చే రోజులు తెచ్చింది తెలంగాణ సర్కార్.ప్రస్తుత రోజుల్లో పేదవారు కూడబెట్టిన సంపదలో 70 నుంచి 80 శాతం వరకు విద్య, వైద్యానికే ఖర్చు చేస్తున్నారు. తద్వారా పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారు. కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం అంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి దాపురించింది. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వైద్యరంగం పెను సంచలనాలను సృష్టిస్తున్నది. అద్భుతమైన ఆవిష్కరణలు తీసుకురావడంతో వైద్యరంగం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. అందుకు ఉదాహరణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న కాన్పులే అని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి హరీశ్రావు ప్రభుత్వ వైద్య ఆవశ్యకతను, సిజేరియన్ వల్ల కలిగే నష్టాన్ని, తల్లిపాల ప్రాధాన్యాన్ని ఆడబిడ్డలకు చక్కగా వివరించారు. ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చేలా చర్యలు చేపట్టారు..హెల్త్ డైరెక్టర్ నుంచి ఆశ వర్కర్ వరకు చిత్తశుద్ధితో పనిచేసేలా కృషిచేశారు. ‘మనం ప్రజలకు జీతగాళ్లం మాత్ర మే, వారికి సేవ చేసి మనసులు గెలుచుకుందామంటూ’ సందేశాన్నిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. వైద్య సిబ్బందికి సరైన వసతులు, వేతనాలు అందించడం వల్ల వారు మరింత అద్భుతంగా పనిచేసి ఫలితాలు చూపిస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు, తర్వాత బేరీ జు వేసుకుంటే తెలంగాణ వైద్య విద్యారంగం అద్భుత పురోగతి సాధించింది..ఒక నాడు మెడికల్ సీటు అంటే అందని ద్రాక్ష, ఎంబీబీఎస్ చేయాలంటే, మెడికల్ సీటు కావాలంటే లక్షల్లో ముచ్చట. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులుజేసి ఢిల్ల్లీ, విదేశాల్లో సీట్లు కొనుక్కునే పరిస్థితి. కానీ కేంద్రం మొండిచేయి చూపినా కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి వైద్య విద్యను ఎక్కడికో వెళ్లి నేర్చుకునే అవసరం లేకుండా సొంత జిల్లాలోనే ఉచితంగా మెడికల్ సీటు సాధించుకునే విధంగా చర్యలు చేపట్టారు. తెలంగాణలో జిల్లా కో మెడికల్ కాలేజీ ఉండాలని సంకల్పించారు. ఒకనాడు 2850 ఉన్న మెడికల్ సీట్లు నేడు 3 రెట్లు పెరిగి 8,515 సీట్లకు చేరుకున్నాయి. 850 మాత్రమే ఉన్న ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు 4 రెట్లు పెరిగి 3,690కు పెంచుకున్నాయి. ఇవే కాకుండా పీజీసీట్లు, సూపర్ స్పెషాలిటీ సీట్లు ఇలా అన్ని విభాగాల్లో 3 నుంచి 4 రెట్ల పురోగతిని సాధించింది తెలంగాణ వైద్యరంగం.
పేదపిల్లలకు వైద్యవిద్య ఎంత చేరువైందో చెప్పటానికి ఉదాహరణ మారుమూల ప్రాంతమైన నర్సంపేటకు, ఏజెన్సీ ప్రాంతమైన ములు గు జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయ డం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ ప్రాం తం పిల్లలు గతంలో ఉన్నత విద్య కోసం నానాతంటాలు పడేవారు.అలాంటి చోట మెడికల్ కళాశాల మంజూరు చేయడం హర్షణీయం.. ములుగు, నర్సంపేట మెడికల్ కళాశాల పనులు మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నారు. పేదలకు విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తేవ టం ద్వారా వాళ్ల ఖర్చు తగ్గి జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుందనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సంకల్పం.
మనసుంటే మార్గముంటది. కానీ దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన పరాయి పాలకులు ఈ దిశగా ఆలోచించలేకపోయారు.
తెలంగాణలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మితమవుతున్న దవాఖానలు, పెంచిన పడకలు చూస్తుంటే తెలంగాణ ఒక పదేండ్ల ముందు వచ్చుంటే బాగుండేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.. 2014లో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో 17,000 పడకలు మాత్రమే అందుబాటులో ఉండేవి.
కానీ నేడు అవి రెట్టింపై 34,000 పడకలకు చేరుకున్నాయి. ప్రజలకు చేరువగా డయాలసిస్ సెంటర్స్, తల్లీ బిడ్డా క్షేమం కోసం అమ్మఒడి వాహనాలు, కేసీఆర్ కిట్ ఇలా అనేక వసతులు కల్పించి ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచారు సీఎం కేసీఆర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ఆపద వచ్చినా ఎంజీఎం ను పేదలు ఆశ్రయిస్తారు. ఇప్పుడు అక్కడే సూ పర్ మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం పూర్తికావస్తున్నది. ఈ దవాఖాన ద్వారా పేదలకు మరింత మెరుగైన వైద్యం అందుతున్నది.
పెద్ద రోగమస్తే ముందుగా ఆర్థికంగా కుదేలయ్యేది పేద లే. అలాగే వైద్య విద్య అభ్యసించాలని పేద పిల్లలకు ఆశ ఉంటుంది. ఎంబీబీఎస్ అం టే సమైక్య పాలనలో డబ్బులున్నోళ్ల చదువుగానే పరిగణించబడింది. కాంట్రాక్టులు, కమిషన్లే ప్రాతిపదికగా చూశా రు గత పాలకులు. ప్రజలను ఓటుబ్యాంక్ గానే భావించారు. కానీ ప్రజల మనసు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముం దుగా వ్యవసాయం,సాగునీటి రంగంపై దృష్టిపెట్టి వ్యవసాయాన్ని రైతాంగానికి పండుగ చేశా రు. వ్యవసాయం దండుగ అన్న చోట రైతు సంతోషంగా పంటలు పండించేలా చర్యలు చేపట్టారు. అనంతరం వైద్యరంగంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. మారుమూల ప్రాంతాలకు కూడా నాణ్యమైన వైద్యం అందటం, పేదింటి బిడ్డలకు ఉచిత వైద్య విద్య అందేందుకు సంస్కరణలు తీసుకువచ్చారు. దానికి చిత్తశుద్ధ్దితో పనిచేసే హరీశ్రావును వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని చేసి మంచి ఫలితాలు రాబట్టారు. నర్సంపేట, ములుగు లాంటి ప్రాంతాల్లో మెడికల్ కళాశాల అంటే ఏజెన్సీ బిడ్డలు సైతం తమ ప్రాంతంలోనే వైద్య విద్యను అభ్యసించే అవకాశం దొరుకుతుంది.అదే సమయంలో పేదలు పెద్ద రోగమస్తే సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా హైదరాబాద్లో అందే వైద్యం స్థానికంగా అందేలా చర్యలు చేపట్టి పేదలకు బాసటగా నిలుస్తున్నారు.
ఇదేమి పట్టని,వారి పాలనలో చేయలేని, చేతకాని దద్దమ్మలు ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే ప్రభు త్వ ధ్యేయం..మారుమూల పల్లెల్లో వైద్య విద్య విప్లవాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, వైద్య ఆరోగ్యశా ఖ మంత్రి హరీశ్రావుకు వరంగల్ జిల్లా ప్రజల పక్షాన శతకోటి శనార్థులు.