చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
73 మందికి చెక్కుల పంపిణీ
మల్యాల, జూలై 5: ఆడబిడ్డల పెళ్లికి కల్యాణలక్ష్మి పథకం అండగా నిలుస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన 73 మంది లబ్ధిదారులకు రూ.73,08,468 లక్షల విలువ గల చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశా రు. అనంతరం మాట్లాడుతూ, ప్రజాధనాన్ని ప్ర జలకే ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నదన్నారు. కరోనాతో యావత్ ప్రపంచ దేశాలు సైతం ఆర్థికంగా కుదేలయ్యాయని, ఇటువంటి వి పత్కర పరిస్థితులలో సైతం సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రంలో కోతలు లేకుండా అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. అనంతరం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొండపలుకుల రామ్మోహన్రావు, ఎంపీపీ మిట్టపల్లి విమల, మండల ప్రత్యేకాధికారి సురేశ్కుమార్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో శైలజ, నాయబ్ తహసీల్దార్ చిలుకల కృష్ణ, సహకార సం ఘం అధ్యక్షుడు అయిల్నేని సాగర్రావు, సర్పంచులు మిట్టపల్లి సుదర్శన్, గడికొప్పుల రమేశ్, రా సమల్ల హరీశ్, సుంకె లచ్చయ్య, బద్దం తిరుపతిరెడ్డి, కట్కూరి తిరుపతి, కో ఆప్ష్షన్ సభ్యుడు అజహర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు గడ్డం మల్లారెడ్డి, ఆగంతం వంశీ, అయిల్నేని కోటేశ్వర్రావు, మారంపల్లి నారాయణ, అశోక్, పొన్నం మల్లేశం, కొమురయ్య, శ్రీనివాస్గౌడ్ , మ్యాక లక్ష్మణ్, రవివర్మ, బుచ్చయ్య, జున్న సురేందర్, నగేశ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.