అర్ధరాత్రి వరకూ మేల్కొని ఉంటున్న యువత
స్మార్ట్ఫోన్ ఫీవర్కు బానిసలు
భవిష్యత్లో నిద్రలేమి సమస్యలు
కొండపాక, నవంబర్ 27;రాత్రి 12.. 1.. 2.. గంటలు దాటినా యువత మేల్కొని ఉంటోంది. స్మార్ట్ఫోన్, ట్యాబ్, కంప్యూటర్ మాయలో పడి సమయాన్ని మరిచిపోతున్నది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్నిచోట్ల యువతకు రాత్రి వేళల్లో నిద్ర కరువవుతున్నది. చిన్న పిల్లలు సైతం ఈ జాఢ్యానికి బానిసలవుతున్నారు. రాత్రి 10.. 11.. 12.. ఒంటి గంట ఇలా పెంచుకుంటూ పోతున్నారు. ఇంటర్నెట్లో విహారం.. ఫోన్లో కబుర్లు.. చాటింగ్.. ఫేస్బుక్.. ట్విట్టర్.. వాట్సాప్లో చక్కర్లు కొడుతూ నిద్రను దాటవేస్తున్నారు. మున్ముందు అదే వారికి పెనుశాపంగా మారే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ, ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ఎయిమ్స్ సర్వే ప్రకారం దేశ రాజధానిలో ఏకంగా 70శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. రాత్రి వీలైనంత వరకు త్వరగా పడుకోవాలని, ఓ గంట ముందు టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్ల వాడకాన్ని కట్టేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మీ పిల్లలు ఎప్పటి వరకు మేల్కొని ఉంటున్నారో.. మీరు ఎప్పుడైనా గమనించారా..? అసలు రోజులో ఎన్ని గంటలు విశ్రాంతి తీసుకుంటున్నారో పరిశీలించారా..? స్మార్ట్ఫోన్.. ట్యాబ్.. కంప్యూటర్ వాడకం ఏ స్థాయిలో ఉంటుందో కన్నేయకపోతే, మీ ఇంట్లో ప్రమాద గంటలు మోగుతున్నట్లే.. మెట్రో పాలిటన్ నగరాల్లో ఇప్పటికే 50మంది ఇన్సోమియా(నిద్రలేమి) ఇంపుల్స్ కంట్రోల్ డిజార్డర్, మూడ్ డిజార్డర్(స్తబ్ధత)తో బాధపడుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇక పట్టణాలు, పల్లెలోనూ ఇంటర్నెట్ వినియోగం, స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడంతో రాత్రి వేళల్లో నిద్ర కరువవుతుంది. నిత్యం ఫోన్ పైనే దృష్టంతా.. తరగతి గదుల్లోనూ.. పడుకున్న తర్వాత దుప్పటి ముసుగులోనూ.. దాంతో ఆటాపాట.. చాలా మంది నిద్రపోయే సమయాన్ని సైతం త్యాగం చేస్తున్నారు.
ఆసక్తికర అంశాలెన్నో..
పట్టణాల్లోనూ.. పల్లెల్లోనూ.. కంప్యూటర్లో లేని ఇండ్లలో యువత, చిన్నారులు సెల్ఫోన్లోనే అంతర్జాలం వినియోగిస్తున్నారు. 16ఏండ్ల లోపు ఉన్న వారు చాలా వరకు తమ తల్లిదండ్రులు ఫోన్లోని ఇంటర్నెట్ను వాడుతున్నారు. వీరు ఆన్లైన్ గేమ్స్తో పాటు ఫేస్బుక్ ఎక్కువగా వాడుతుండడం గమనార్హం. సెల్ఫోన్ చేతిలో లేకుంటే అసలు ఏమి తోచని పరిస్థితి ఏర్పడుతోంది. విద్యార్థి తరగతి గదిలో ఉన్న దృష్టిని అంతా జేబులోని సెల్ఫోన్ పైనే ఉంచుతున్న విద్యార్థులు రోజు రోజుకు అధికమవుతున్నారు. సెలవు రోజుల్లో 50 శాతం మంది విద్యార్థులు, యువత టీవీ, సెల్ఫోన్, కంప్యూటర్లలో మునిగిపోతున్నట్లు పరీక్ష సమయంలోనే పుస్తకాలపై దృష్టి సారిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
అతి సర్వత్రా వర్జయేత్..
ఏ విషయంలోనైనా మితి మీరితే అవస్థలు అనివార్యం కాకతప్పదు.. అందుకే ‘అతి సర్వత్రా వర్జయేత్’ అన్నారు పెద్దలు. పరిధులు, పరిమితులు దాడితే ఉపయోగం కన్నా, లేనిపోని సమస్యలు తప్పవు. మన పెద్దలు ఏనాడో చెప్పిన ఈ సూత్రమే నేటి ఆధునిక యుగంలో స్మార్ట్ఫోన్లకు నూటికి నూరుపాళ్లు వర్తిస్తుంది. సాధారణ ఫోన్లు కరునుమరుగవుతూ ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్ఫోన్లు కనిపిస్తున్నాయి. స్మార్ట్ఫోన్లలో సరికొత్త ఫీచర్లు, అదనపు ఆకర్షణలకు అంతేకుండా పోతోంది. వీటితో ఎప్పుడు ఏ ప్రత్యేక చోటు చేసుకుంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ రోజున వింతగా అనిపించిన ఫీర్ మర్నాడే పాతదైపోయి, రోత పుడుతున్నది. ఖర్చుకు ఏ మాత్రం సంకోచించకుండా సరికొత్త రకం ఫోన్లను సొంతం చేసుకునేందుకు యువత ఆరాటపడుతోంది.
70 శాతం మందికి నిద్రలేమి సమస్య
ఉద్యోగ ఒత్తిడి, వ్యాపార నిర్వహణ కష్టాలు, ఆర్థిక సమస్యలు, చదువులో విపరీతమైన పోటీ కారణంగా సాధారణ నిద్రలేమి సమస్యలుంటాయి. అయితే యువతను మాత్రం వీటన్నింటికీ మించి బానిసలను చేస్తోంది స్మార్ట్ ఫోన్స్ ఫీవర్. వీటి కోసం నిద్రమానుకొని అర్దరాత్రి వరకు గడిపేస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్తో పాటు వాట్సాప్లో గంటలుగంటలు గడిపేస్తున్నారు. ఎయిమ్స్ విడుదల చేసిన ఓ సర్వే ప్రకారం దేశ రాజధానిలో ఏకంగా 70 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతుండగా ఇదే క్రమంగా పట్టణాలు, పల్లెల్లో కూడా యువత నిద్రలేమితో బాధపడుతూ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. వీలైనంతవరకూ పడుకోవడానికి ఓ గంట ముందు టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్లను ఆఫ్ చేయాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.
మున్ముందు పెను ప్రమాదం..
స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల వాడకంతో 35ఏండ్లు దాటిన వారు ఒత్తిళ్లకు గురై వ్యాధుల బారిన పడుతుండగా, విద్యార్థి, యువత మాత్రం నిద్రపోకుండా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లతో గడుపుతూ కోరి కష్టాలు తెచ్చుకుంటోంది. ఆ తర్వాత అదే పెద్ద సమస్యగా మారుతోంది. శరీర గడియారంలో వచ్చిన మా ర్పులతో వారు ఒక వయ స్సు వచ్చాక నిద్రపోదామ న్నా పోలేని పరిస్థితి తలెత్తుతుంది. క్రమేణా ఇవి పట్టణాల నుంచి పల్లెల్లోకి వ్యాపించింది. సెల్ఫోన్ వాడకుండా జీవితమే లేదనే అభిప్రాయానికి నేటి యువత చేరువవుతుంది. ఇంకా చిన్న పిల్లలు సైతం ఈ జాఢ్యానికి బానిసవులుతున్నారు. రాత్రి 10.. 11.. 12.. ఒంటి గంట.. ఇలా పెంచుకుంటూ పోతున్నారు. ఇంటర్నెట్లో విహారం ఫోన్లో కబుర్లు, చాటింగ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్లో చక్కర్లు కొడుతూ నిద్రను దాటవేస్తున్నారు. మున్ముందు అదే వారికి పెనుశాపంగా మారే ప్రమాదం పొంచి ఉన్నప్పటకీ ఏ మాత్రం లెక్క చేయడం లేదు.