మియాపూర్ : నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను తాగునీరు, డైనేజీ, విద్యుత్, సౌకర్యవంతమైన రహదారుల వంటి మౌలిక వసతుల పరంగా ప్రథమ స్థానంలో నిలపటమే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో వందలాది కోట్లు వెచ్చించి వసతుల కల్పన పరంగా ఇప్పటికే సింహభాగం లక్ష్యాన్ని చేరుకున్నట్లు రాబోయే రోజులలో మిగిలిన వాటినీ పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని ఆయన స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజవకర్గం కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీలో రూ. 1.70 కోట్లతో చేపడుతున్న వరద నీటి కాలువ పనులను ఆయన పరిశీలించారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ రాంకీ పెరల్లో రూ. 70 లక్షలతో చేపడుతున్న యూజీడీ నిర్మాణ పనులను, ఇదే డివిజన్లో వాంబే గృహ సముదాయం నుంచి తులసీనగర్ వరకు తలెత్తిన డైనేజీ సమస్యను, ఫేజ్ 2లో సీసీ రోడ్డు నిర్మాణ ప్రతిపాదన పనులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్ , జీహెచ్ఎంసీ అధికారులతో కలసి విప్ ఆరెకపూడి గాంధీ సోమవారం పరిశీలించారు.