– హెల్మెట్లు పంపిణీ చేసిన మర్రి రాజశేఖర్రెడ్డి, జక్కుల మహేశ్వర్రెడ్డి
సికింద్రాబాద్ : హెల్మెట్ ధరిస్తేనే వాహనదారులకు తలకు రక్షణ కలిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ ఎస్ ఇన్చార్జీ మర్రి రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
కంటోన్మెంట్ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల కు హెల్మెట్లను అందించాలనే సదుద్దేశ్యంతో నెల రోజులుగా టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్స్ ఎన్జీవో స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో హెల్మెట్ల పంపిణీ జోరుగా సాగుతుంది.
ఈ క్రమంలో శుక్రవారం కార్కానాలోని ప్రభుత్వ పాఠశాలలో ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్సురెన్స్ సమకూర్చిన హెల్మెట్లను ట్రాక్స్ ఎన్జీవో సంస్థ ద్వారా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలసి రాజశేఖర్రెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలకు వచ్చే విధ్యార్థులను తల్లిదండ్రులు తప్పనిసరిగా హెల్మెట్లను ధరించే విధంగా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సుమారు 150కి పైగా హెల్మెట్లను అందజేశారు.
కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, శ్యామ్కుమార్, నేతలు పెద్దాల నర్సింహ్మా, టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, పిట్ల నగేష్, ప్రవీణ్యాదవ్, ట్రాక్స్ ఎన్జీవో సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ అదిశంకర్, రాజేష్, ఉదయ్గౌడ్, రాజుసింగ్, సోమయ్య, శ్రీనివాస్, అనిల్, సాయితో పాటు తదితరులు పాల్గొన్నారు.