ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ మేడిబావి బస్తీ పరిసరాల్లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి త్వరలో కొత్త పైపులైన్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. స్థానిక కమ్యూనిటీహాల్ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం జలమండలి అధికారులతో కలిసి మేడిబావి బస్తీ, దీన్దయాల్నగర్లో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వెంటనే పైపులైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మేడిబావి బస్తీల్లో స్థానికుల అవసరాల కోసం రెండో అంతస్తులో షెడ్ నిర్మించనున్నట్లు తెలిపారు.
జలమండలి డీజీఎం వాహబ్, మేనేజర్ కృష్ణమోహన్, నాయకులు ముఠా జయసింహ, సయ్యద్ అస్లాం, సురేందర్, నేత శ్రీనివాస్, శ్యామ్సుందర్, మల్లికార్జున్రెడ్డి, గురుదీప్సింగ్, మాదవ్, బొట్టు శ్రీనివాస్, జెల్ల భిక్షపతి, మామిడి శ్రీను, శ్రీకాంత్ గౌడ్, టక్కర్ తదితరులు పాల్గొన్నారు.