మహబూబ్నగర్, జనవరి 6 : టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ రూ రల్ మండలం జమిస్తాపూర్కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు గొల్ల కురుమయ్య, చౌదర్పల్లి గ్రామవాసి పెద్దబావి రంగయ్య వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందారు. వారి కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.2లక్షల చొప్పున మంజూరైన బీమా చెక్కులను గురువారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ సభ్యత్వం పొంది న ప్రతి కార్యకర్తకూ బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రానికి చెందిన అరిఫ్కు రూ.2లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.