ఖలీల్వాడి/ విద్యానగర్, జనవరి 3 : టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. నిజామాబాద్ నగరంలోని మాలపల్లి పీహెచ్సీలో జిల్లావైద్యారోగ్య శాఖ అధికారి సుదర్శనం టీకా వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో 15 నుంచి 18 సంవత్పరాల వారు 76,900 మంది ఉన్నారని వెల్లడించారు. మొదటి రోజైన సోమవారం 3,237 మందికి టీకాలు వేశామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ తుకారాం రాథోడ్, వైద్యులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో సోమవారం 820 మంది టీనేజర్లకు టీకాలు వేశామని డీఎంహెచ్వో కల్పన కాంటే తెలిపారు.