మన్సూరాబాద్ : పేదింటి ఆడబిడ్డ పెండ్లికి నాగోల్లోని ఉప్పల ఫౌండేషన్ అపన్నహస్తం అందించి చేయూతనిచ్చింది. నగరంలోని కాచిగూడ, లిమాలగడ్డకి చెందిన పలంగ్తోడ్ యశోద కూతురు లక్ష్మీప్రియ వివాహం ఇటీవల నిశ్చయమైంది.
భర్తను కోల్పోయి కూతురు వివాహం చేస్తున్న యశోద కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కొందరు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని తెలుసుకున్న ఆయన ఆ కుటుంబంలో జరుగుతున్న వివాహానికి తన వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు.
ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం నాగోల్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మీప్రియ వివాహానికి గాను ఉప్పల ఫౌండేషన్ కో చైర్పర్సన్ ఉప్పల స్వప్నతో కలిసి పుస్తె, మెట్టలు, చీర, గాజులను నవ వధువు కుటుంబ సభ్యులకు ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ఉప్పల ఫౌండేషన్ ద్వార చేయూత నిస్తున్నామని తెలిపారు.