సికింద్రాబాద్ : పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సంజీవయ్యనగర్-జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా ఎంఎంటీఎస్ రైలు ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సం ఘటన చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుని వయసు సుమారు. 30-40 సంవత్సరాల వయసు ఉంటుందని, ఒంటి పై ఎరుపు రంగు చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
మృతుని సంబంధీకులు ఏవరైనా ఉంటే సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు.