ముషీరాబాద్ : ముషీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు పిఆర్.రమేష్కుమార్ ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. ఉదయం ఇంట్లో ఉండగా గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ నేత ముఠా జయసింహ, ఆర్.మోజస్, ముదిగొండ మురళీ, ఎరం శేఖర్, ఇంద్రసేనారెడ్డి, రాజుచారి తదితరులు రమేష్కుమార్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.