మియాపూర్ :పార్టీకి కార్యకర్తలే బలమని , మరింత కష్టపడి రాబోయే రోజుల్లో పార్టీని ఎప్పటిలాగే పతాక శీర్షికన నిలబెట్టేందుకు సైనికుల్లా పని చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. పార్టీ కోసం నిరంతరం పని చేస్తున్న వారికి సంస్థాగత ఎన్నికలలో సముచిత స్థానం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం హెచ్ఎంటీ హిల్స్ కమ్యూనిటీ హాల్లో జరిగగా…కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలసి విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పటిష్టతతో పాటు శ్రేణులు మరింత ఉత్సాహంగా పని చేసేందుకు అధిష్టానం ఆదేశాల మేరకు బస్తీ , డివిజన్ కమిటీలను వేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ఈ డివిజన్ను రాజకీయంగా , అభివృద్ధి పరంగా అగ్రగామిగా నిలిపేందుకు డివిజన్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పని చేయాలన్నా రు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లటంలో పార్టీ కార్యకర్తల కృషే ప్రధానమన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.