మాదాపూర్ : ఖార్డ్ సంస్థ ప్రతినిధులు పేద విద్యార్థులకు, ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గురువారం ఖార్డ్ సంస్థ ఆద్వర్యంలో మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్లోని దిశ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ముత్తుట్ ఫైనాన్స్ కంపెనీ వారి సీఎస్ఆర్ ఫండ్ సౌజన్యంతో బ్యాగులు, పుస్తకాలు, పెన్నులతో పాటు కోవిడ్ కిట్లను గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబ, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్లో పాటు ఖార్డ్ ఫౌండర్ సుమన్ మల్లాదిలతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ… పాఠశాల అభివృద్ధి తన వంతు సహయ సహకారాలు ఎల్లవేలలా ఉంటాయని, ఖార్డ్ ఫండ్ సంస్థ వ్యవస్థాపకుడు సుమన్, మంజులత మల్లాదిలను ప్రతి ఒకరు ఆదర్శంగా తీసుకొని ఇతరులకు సేవ చేసే విధంగా తమ వంతు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సాంబశివరావు, గుమ్మడి శ్రీనివాస్, రాంచెందర్, ముత్తూట్ ఫైనాన్స్ జితేంద్ర ఆగర్వాల్, లక్ష్మీనారాయణ, అప్పారావు, సాంబయ్య, ప్రభాకర్, జేవి రావు, వెంకయ్యలతో పాటు పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.