శంషాబాద్ రూరల్ : సమాజంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మండల ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం, గురుపూజ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో గురువుల పాత్ర మరువలేనిదని కొనియాడారు.
సమాజంలో తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుదేనని వివరించారు. గురువులేని సమాజాన్ని ఉహించలేమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ తన్విరాజు, ఎంపీడీవో వినయ్కుమార్, ఎంఈవో రాంరెడ్డి, ఉపాధ్యా యులు బాల్రెడ్డి, వెంకటరమణగౌడ్, మల్లేష్గౌడ్, రాములు, ఇమానియల్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.