శంషాబాద్ రూరల్ :గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని ఘాన్సిమియాగూడ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ను కలిసి ఆయన సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలతో పాటు కార్యకర్తలే కీలకమని వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు గ్రామస్థాయిలో చేరే విధంగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావు, నీరటి రాజుముదిరాజ్, ఘాన్సిమియా గూడ గ్రామ సర్పంచ్ దేవికజగన్గౌడ్, ఎంపీటీసీ యాదయ్యగౌడ్, రేణుక ఎల్లమ్మ దేవాలయం చైర్మన్ జి రాంనాథ్ ముదిరాజ్, నరేష్ ముదిరాజ్లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
నూతన గ్రామ కమిటీ
మండలంలోని ఘాన్సిమియాగూడ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జి వెంకటేశ్ ముదిరాజ్, ఉపాధ్యాక్షుడిగా ఎండీ చాన్ద్ధిన్, యూత్ అధ్యక్షుడిగా మహేందర్లతో పాటు పలువురు సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేశామని మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి తెలిపారు.